logo

చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు

మాజీ ఎంపీ రాఠోడ్‌ రమేష్‌ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్‌ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత

Published : 25 Apr 2024 06:10 IST

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : మాజీ ఎంపీ రాఠోడ్‌ రమేష్‌ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్‌ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత నేరుగా కలెక్టరేట్కు వచ్చి కండువా లేకుండా భాజపా అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేశారు. వాస్తవానికి ఆయన డమ్మీ అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేసినా.. బీ ఫారం సమర్పణకు అవకాశం ఉండటంతో చివరి నిమిషంలో అభ్యర్థిని మారుస్తారా? అన్న చర్చకు తెరలేపింది. మరోవైపు గోడం నగేష్‌ తన నామపత్రం దాఖలు చేసే క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేల నడుమ జన సమీకరణ విషయంలో వాగ్వాదం జరిగినట్లుగా ప్రచారం జరగడం రాజకీయ దుమారం రేపింది. ఇదిలా ఉంటే ర్యాలీలో ... నామపత్ర దాఖలు, ఆ తర్వాత మీడియా మాట్లాడే సందర్భంలో నలుగురు ఎమ్మెల్యేలు కలిసి పాల్గొనడంతో అవన్నీ వదంతులే అనే మాట పార్టీ వర్గాల నుంచి వినిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు