మళ్లీ వస్తా.. ఐటీ పార్కు ప్రారంభిస్తా
‘మళ్లీ ఆదిలాబాద్కు త్వరలో వస్తా.. పట్టణంలో ఐటీ పార్కుని ప్రారంభిస్తా.. త్వరలోనే దీనికోసం స్థలాన్ని సేకరించాలని ఆదేశించాం’ అని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భవనంలో బీఎన్డీటీ, ఎన్టీటీ డాటా సంస్థల
పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్
ఐటీ ఉద్యోగులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్, చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ విఠల్, ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్, ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఆదిలాబాద్ పట్టణం, న్యూస్టుడే: ‘మళ్లీ ఆదిలాబాద్కు త్వరలో వస్తా.. పట్టణంలో ఐటీ పార్కుని ప్రారంభిస్తా.. త్వరలోనే దీనికోసం స్థలాన్ని సేకరించాలని ఆదేశించాం’ అని పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భవనంలో బీఎన్డీటీ, ఎన్టీటీ డాటా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐటీ కంపెనీ కార్యాలయాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ముందుగా ఆయనకు గుస్సాడీ నృత్యాలు, బాజాభజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సంస్థ ప్రతినిధులు, ఐటీ ఉద్యోగులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఆదిలాబాద్ అంటే అభివృద్ధికి ఆమడదూరంగా ఉందని పేరుండేదని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఇక్కడి పిల్లలు సైతం ఎవరికీ తీసిపోరని నిరూపిస్తున్నారని వివరించారు. ఆదిలాబాద్లో ఐటీ టవర్ ఏర్పాటుచేస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎమ్మెల్యే జోగురామన్న పట్టుబట్టడంతోనే ఇక్కడ ప్రయివేటు కంపెనీ ముందుకొచ్చిందని కొనియాడారు. కంపెనీ ఏర్పాటుకు కృషిచేసిన ఆ సంస్థ ప్రతినిధి సంజయ్దేశ్పాండేను అందరిముందు అభినందించారు.
విదేశాల్లో ఉన్నవారు ఆసక్తిచూపాలి..
ఆదిలాబాద్లో ఏర్పాటుచేసే ఐటీ పార్కులో కంపెనీలు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు విదేశాల్లో ఉన్న పూర్వ ఆదిలాబాద్ బిడ్డలు ఆసక్తి చూపాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తద్వారా కంపెనీలు పెరిగి ఇక్కడ చాలామందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయని వివరించారు. ఇప్పటికే ఐటీ రంగంలో స్థిరపడ్డ ఆదిలాబాద్ వాసులు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. తన పరంగాను కృషిచేస్తానని వివరించారు.
పర్యాటకంపై దృష్టి సారిస్తే బాగు..
హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో వారంతంలో కాలక్షేపానికి ఎలాంటి సదుపాయాలు ఉండవని వివరించారు. అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎన్నో సుందరమైన పర్యాటక ప్రాంతాలున్నాయని పేర్కొన్నారు. అందుకనే ఆదిలాబాద్ను కశ్మీర్తో పోలుస్తారని పేర్కొన్నారు. ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాని సమావేశంలో పర్యాటక మంత్రి శ్రీనివాస్గౌడ్ను కోరారు. తద్వారా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే ఐటీ కంపెనీ ఉద్యోగులు ఇక్కడ ఐటీ టవర్ ఉందని తెలుసుకొని పనిచేసేందుకు ఆసక్తిచూపే అవకాశం ఉందన్నారు.
తెరాస శ్రేణుల ర్యాలీ మధ్య ఆదిలాబాద్ పట్టణాన్ని వీక్షిస్తున్న మంత్రి కేటీఆర్
మంత్రిని కలిసిన కౌన్సిలర్లు
మంత్రిని స్థానిక పురపాలక కౌన్సిలర్లు, తెరాస శ్రేణులు ప్రత్యేకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి తమ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్, ఎమ్మెల్సీలు దండేవిఠల్, శంభీపూర్రాజు, పురపాలక ఛైర్మన్ జోగుప్రేమేందర్తోపాటు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఐటీడీఏ పీఓ వరుణ్రెడ్డి, అదనపు పాలనాధికారి రిజ్వాన్ బాషా షేక్, పురపాలక వైస్ఛైర్మన్ జహీర్రంజాని తదితరులు పాల్గొన్నారు.
రూ. 1.50 కోట్లు మంజూరు
ఆదిలాబాద్లోని పశుసంవర్థకశాఖ ఆవరణలోని ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న ఐటీ కంపెనీ కార్యాలయంలోని సమస్యలను ఉద్యోగులు వివరించడంతో మంత్రి కేటీఆర్ తక్షణమే రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్తోపాటు కార్యాలయ ఆధునీకరణ కోసం వీటిని వెంటనే విడుదల చేయనున్నట్లు వివరించారు. పనులను పూర్తిచేసే బాధ్యత జిల్లా పాలనాధికారి సిక్తాపట్నాయక్ చూడాలని ఆదేశించారు.
* కేటీఆర్ నేతృత్వంలోని మంత్రుల బృందం పర్యటించడం తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తెరాస రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత మంత్రులు పర్యటించడం ఇదే ప్రథమం కావడంతో నేతల్లోనూ జోష్ నింపింది.
* జోగు రామన్న ఇంటివద్ద కేటీఆర్ స్వయంగా జిల్లా నేతల పేర్లను ప్రస్తావించడంతో అంతర్గత అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమైంది. రామన్న ఇంటి వద్ద అందరి సమక్షంలోనే బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు, బోథ్ ఎంపీపీ తులశ్రీనివాస్లను కలిసి పనిచేయాలని కేటీఆర్ మందలించడం చర్చనీయాంశమైంది.
* మాతృవియోగమైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించేందుకు మంత్రి కేటీఆర్ తొలుత హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా జైనథ్ మండలం కేంద్రానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన అదే మండలంలోని దీపాయిగూడ వెళ్లారు. అనంతరం రోడ్డుమార్గాన ఆదిలాబాద్ చేరుకున్నారు. మావల బైపాస్ నుంచి వచ్చిన మంత్రులకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడి నుంచి వందలాదిగా ద్విచక్రవాహనాలతో ర్యాలీగా ఐటీ కార్యాలయానికి బయల్దేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
26 నుంచి యోగా-ధ్యానం అంశాలపై తరగతులు
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు యోగా -ధ్యానం అంశాలపై ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు తిరుపతి రెడ్డి తెలిపారు. -
క్రీడా ప్రాంగణంలో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం