logo

లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు

మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్‌ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్‌ తెలిపిన వివరాలిలా..

Published : 26 Apr 2024 02:46 IST

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్‌ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్‌ తెలిపిన వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒంగోలులోని కట్టకిందిపల్లెకు చెందిన సిరిపోగు రాజు ఉపాధి నిమిత్తం 2016లో నిర్మల్‌ జిల్లాకేంద్రానికి వచ్చాడు. స్థానికంగా ఓ మేస్త్రీ వద్ద కూలీపనులు చేసేవాడు. ఈ క్రమంలో బాలిక(14)తో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 27 డిసెంబరు 2016 రోజున ఆమెను అపహరించి చెన్నైలో ఉంటున్న తన అక్క దగ్గరకు తీసుకెళ్లాడు. కొద్దిరోజులు అక్కడే గడిపారు. ఆ తర్వాత తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. బాలిక కుటుంబసభ్యులు పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టుచేశారు. విచారణలో భాగంగా ఏపీపీ వై.విశ్వాస్‌రెడ్డి 15 మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువుచేయడంతో నేరస్థుడైన సిరిపోగు రాజుకు పదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ జిల్లా ప్రత్యేక పోక్సో న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎ.కర్ణకుమార్‌ గురువారం తీర్పునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని