logo

దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి

కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్‌ యంత్రాంగం చోద్యం చూస్తుంది.

Published : 26 Apr 2024 02:48 IST

 

బెల్లంపల్లిబస్తీలో దారి మళ్లించిన మురుగుకాల్వ

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్‌ యంత్రాంగం చోద్యం చూస్తుంది. పట్టణంలోని బెల్లంపల్లిబస్తీలో రోడ్డు పక్కనే ఉన్న మురుగుకాలువను మళ్లించి మరీ ఖాళీ స్థలాన్ని కబ్జా చేశారు. కల్వర్టు నుంచి నేరుగా ఉండాల్సిన మురుగుకాలువను పక్కకు దారి మళ్లించారు. జేసీబీతో కాలువను తీయించారు. రహదారి పక్కనే ఇదంతా జరుగుతున్న మున్సిపల్‌ అధికారులకు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడున్న ఖాళీ స్థలం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వెనకాల ఉన్న ఖాళీ స్థలాలపై సైతం కబ్జాకోర్లు కన్నేశారు. పోచమ్మ చెరువు కింద ఖాళీ స్థలాలు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. మురుగుకాలువను మళ్లించి మళ్లీ తవ్వించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ అండదండలతోనే కబ్జాలు పెరిగిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు వత్తాసు పలుకుతుండడంతో ప్రభుత్వ స్థలాల్లో కబ్జాదారులు జెండా పాతేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు