logo

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

Published : 26 Apr 2024 02:52 IST

ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

బెజ్జూరు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జూరు మండలం ఆర్కగూడకు చెందిన ఆత్రం మహేష్‌(25), బారేగూడకు చెందిన తొర్రెం వెంగల్‌రావు(30)లు బూర్గుగూడలో తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వెళ్లొస్తున్నారు. ఎల్కపల్లికి చెందిన దున్న నర్సింహ(20), ఆయిళ్ల నిఖిల్‌, శనిగారం రాజ్‌కుమార్‌లు బారేగూడ వైపు వివాహ విందుకు వెళ్తున్న క్రమంలో అతివేగంతో, అజాగ్రత్తగా నడపడంతో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆత్రం మహేష్‌, తొర్రెం వెంగల్‌రావు, దున్న నర్సింహలు అక్కడికక్కడే మృతి చెందగా నిఖిల్‌, రాజ్‌కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కౌటాల సీఐ సాధీక్‌పాషా, బెజ్జూరు ఎస్‌ఐ విక్రమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలంలో కుటుంబీకుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని