తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది.
పార్టీల ప్రచార సరళిపై నివేదికలు
ఈటీవీ - ఆదిలాబాద్ : ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. కాంగ్రెస్, భాజపా, భారాస ప్రచారం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రీతిలో సాగుతోంది. కొన్ని చోట్ల కీలకనేతలు అన్నీ తామై పని చేస్తుండటం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరికొన్ని చోట్ల అంటీముట్టనట్లుగా ఉండటం వారిని అంతర్మథనానికి గురి చేస్తోంది.
కాంగ్రెస్ - గడ్డం వంశీకృష్ణ, ఆత్రం సుగుణ
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు ప్రేంసాగర్రావు, వినోద్, వివేక్ ప్రచార సరళి బాగానే ఉందనే నివేదిక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ)కి వెళ్లింది. ఇది వరకున్న గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి పని చేయటం ప్రచార లోపం లేకుండా చేస్తోందనే అభిప్రాయం వచ్చింది. ఫలితంగా భారాస, భాజపా నేతల అనైక్యతను అనుకూలంగా మార్చుకునే వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే సిర్పూర్, నిర్మల్, బోథ్లో ప్రచారం బాగానే ఉన్నా.. మిగిలిన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ముథోల్లో ఆశించిన రీతిలో లేదనే విషయం బయటపడింది. మంత్రి సీతక్క సైతం ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారనే విమర్శలు రావటం, ఈ నెల 22న సీఎం రేవంత్రెడ్డి పర్యటన తర్వాత కూడా పెద్దగా మార్పులేదనే అభిప్రాయం పీసీసీ దృష్టికి వెళ్లింది. అన్నింటిని క్రోడీకరించి ఈ నెల 28 నుంచి నేతల వారీగా సమాచారం సేకరణ చేయాలని పీసీసీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
భారాస - ఆత్రం సక్కు, కొప్పుల ఈశ్వర్
ఆసిఫాబాద్, బోథ్లో అనుకూలమైన వాతావరణం ఉందనే వ్యూహంతో ముందుకు వెళ్తున్న భారాస మిగిలిన ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్, ఖానాపూర్పై దృష్టి సారించింది. ఖానాపూర్లో నియోజకవర్గ ఇన్ఛార్జి స్థానికంగా ఉండటం లేదని ఫిర్యాదు వచ్చింది. నిర్మల్లో బలం పెంచుకోవచ్చనే భారాస భావిస్తోంది. మంచిర్యాల జిల్లాలో నేతల తీరు ఆశాజనకంగా లేదని శ్రేణుల మనోగతంగా ఉంది. వచ్చే నెల 4న కేసీఆర్ బస్సు యాత్ర లోపు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పెంచటంపై పార్టీ దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలో మిగిలిన ముఖ్య నేతలతో పాటు పార్టీని వీడకుండా ఉండే వారికి కీలక బాధ్యతలను అప్పగించాలని భారాస భావిస్తోంది.
భాజపా - గోమాసె శ్రీనివాస్, గోడం నగేష్
మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లిలో కమలం పార్టీ ప్రచారం మందకొడిగా కొనసాగుతోంది. శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో భారాస కంటే ఎక్కువ వచ్చిన ఓట్లను సైతం ప్రస్తుతం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం లేదనే జిల్లా నేతల ఫిర్యాదు దిల్లీ వరకు వెళ్లింది. అప్రమత్తమైన అధిష్ఠానం ఉమ్మడి జిల్లాలో పార్టీ ప్రచార శైలిపై ఆరా తీసింది. సిట్టింగ్ ఎంపీ స్థానమైన ఆదిలాబాద్లో నలుగురు ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, పాయల్శంకర్, పాల్వాయి హరీశ్బాబు, రామారావు పటేల్ మధ్య సఖ్యత లేదనే విషయాన్ని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఈ నెలలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్శిందే, విదేశాంగ మంత్రి శివశంకర్, ఓబీసీ నేత డా.లక్ష్మణ్ పర్యటనలు రద్దు కావటం నైరాశ్యం నింపిందనే సూచనలతో ఏకీభవించిన అధిష్ఠానం త్వరలోనే జోష్ నింపుతామని హామీ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు
[ 05-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో శనివారం సాయంత్రం జరిగిన ఘటనలో ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 40 మందిపై నాలుగు కేసులు నమోదు చేశారు. -
ఇండియా కూటమి తరఫున సీపీఎం ప్రచారం
[ 05-05-2024]
ఇండియా కూటమి తరఫున జిల్లాలో సీపీఎం ప్రచారం ప్రారంభించింది. -
క్రాంతినగర్లో పోలీసుల కవాతు
[ 05-05-2024]
పట్టణంలోని క్రాంతినగర్లో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాద విషయమై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు. -
కారల్ మార్క్స్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
[ 05-05-2024]
కారల్ మార్క్స్ ఆశయాలను నెరవేరిస్తేనే ఆయనకు నివాళులు అర్పించినట్లు అవుతుందని సీపీఎం, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు సూచించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్న శిక్షణ కానిస్టేబుళ్లు
[ 05-05-2024]
పోలీసు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న 254 మంది శిక్షణ కానిస్టేబుళ్లు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. -
ఆటోను ఢీకొన్న డీసీఎం.. ఒకరి పరిస్థితి విషమం
[ 05-05-2024]
పట్టణంలోని రిమ్స్ ముందు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
[ 05-05-2024]
తాంసి మండలం పొన్నారి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. -
ఎమ్మెల్యేల ప్రత్యేక ప్రార్థనలు
[ 05-05-2024]
బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం కల్వర్ చర్చిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
మరోసారి ప్రధానమంత్రిగా మోదీ
[ 05-05-2024]
మండల కేంద్రంలోని గిరిగాం, తాంసి గ్రామాల్లో ఆదివారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తాంసిలో భారాస ఇంటింటి ప్రచారం
[ 05-05-2024]
మండల కేంద్రంలో ఆదివారం భారాస నాయకులు ఇంటింటా తిరుగుతూ ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు
[ 05-05-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
భారాస నాయకుల ఇంటింటి ప్రచారం
[ 05-05-2024]
మండల కేంద్రలోని పొచ్చర గ్రామంలో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
భాజపా గెలుపు ఖాయం: ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
[ 05-05-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. -
భారాసతోనే రాష్ట్రానికి మేలు
[ 05-05-2024]
భారాసతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నెడ్క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమయ్య అన్నారు. -
అభిమాన తరంగం.. ఉప్పొంగిన ఉత్సాం
[ 05-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ రోడ్షో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. -
అగ్రనేతలపై కాంగ్రెస్.. భాజపా ఆశలు
[ 05-05-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, భాజపా, భారాసలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగాయి. మంచిర్యాలలో శనివారం రాత్రి భారాస అధినేత కేసీఆర్ రోడ్షో జరిగింది. -
దేవుడి పేరుతో భాజపా రాజకీయం
[ 05-05-2024]
దేశాన్ని పదేళ్లు పాలించిన భాజపా చేసిన అభివృద్ధి ఏమీ లేకనే దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని మంత్రి సీతక్క విమర్శించారు. -
రాజ్యాంగం మార్చే ప్రసక్తే లేదు
[ 05-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారనే వదంతులు ప్రజలు నమ్మొద్దని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని రాజ్యసభ సభ్యుడు మదన్సింగ్ రాఠోడ్ తేల్చిచెప్పారు. -
సిబ్బంది కొరత.. రోగుల అవస్థ
[ 05-05-2024]
జిల్లాలోని పీహెచ్సీల్లో స్టాఫ్నర్సులు, ఏఎన్ఎం, వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులకు నామమాత్రపు వైద్యం అందించి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
జిల్లా అభివృద్ధే సీఎం రేవంత్రెడ్డి అభిమతం
[ 05-05-2024]
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు -
బాల్యవివాహాలతో అనర్థాలు
[ 05-05-2024]
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఏర్పడుతాయని మహిళా సాధికారత కేంద్రం ఆర్థిక నిపుణుడు నిఖిల్రెడ్డి పేర్కొన్నారు. -
కబ్జాల వైపు కన్నెత్తి చూడరా?
[ 05-05-2024]
ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిలువ నీడలేని పేదలు గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం సాధారణంగా గమనిస్తుంటాం. -
పేరుకే శిబిరం.. పర్యవేక్షణ పూజ్యం
[ 05-05-2024]
జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా యువజన, క్రీడాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం నామమాత్రంగా మారింది. -
ప్రక్షాళన మా నుంచే మొదలైంది.. మరి మీరు?
[ 05-05-2024]
బాధితులకు ఫీజుల భారం నుంచి విముక్తి కలిగించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా అర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్(ఓఎస్ఏఎమ్) సభ్యులు అన్నారు. -
లక్ష మెజార్టీతో గెలుపు ఖాయం
[ 05-05-2024]
ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్