logo

క్రీడా ప్రాంగణంలో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్,  నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 26 Apr 2024 11:20 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్,  నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నడక, వ్యాయామ, యోగా  సాధకులతో ముచ్చటించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రికెట్ శిక్షణ శిబిరంలో కాసేపు బ్యాటింగ్ సాధన చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే క్రీడా రంగానికి బడ్జెటులో ఎక్కువ నిధులు వచ్చేటట్లు కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట భాజపా నాయకులు ఆదినాథ్, అశోక్ ముస్తాపురే, జోగు రవి, లాలా మున్నా, అకుల ప్రవీణ్. వేదవ్యాస్, భీంసేన్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, సురేష్, ముకుంద్, సాయి, తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు