తుక్కు పేరిట అక్రమ దందా!
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు.
తీవ్రమైన ఎండల్లో పొంచి ఉన్న ప్రమాదం
కాగజ్నగర్-సిర్పూర్(టి) ప్రధాన రహదారిపై ఓ తుక్కు దుకాణం
కాగజ్నగర్, న్యూస్టుడే: అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. కాగజ్నగర్లోని ఎస్పీఎంతోపాటు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎస్పీఎం, ఈఎస్ఐ ఖాళీ క్వార్టర్ల ఇనుప కిటికీలు, ద్వారాలు అపహరణకు గురవుతున్నాయి. రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు నియంత్రికలను కూడా ధ్వంసం చేసి అందులోని రాగి తీగను దొంగిలిస్తున్నారు. డిస్కం అధికారులు గతేడాది కాగజ్నగర్ మండలం అందెవెల్లిలో ఓ నియంత్రిక ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిరుపయోగం, వినియోగంలో లేని వివిధ వస్తువులను మాత్రమే కొనుగోలు చేసి, అపహరణ పాల్పడిన సామగ్రిని కొనుగోలు చేయరాదంటూ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. సదరు వ్యాపారులు నిబంధనలు బేఖాతరు చేస్తూ చోరీ సామగ్రి కొంటున్నారు. తదనంతరం అధిక ధరలకు విక్రయించి ఇతర ప్రాంతాలకు తరలించి లాభాలు గడిస్తున్నారు. వ్యాపారులు బెదిరించి అతి తక్కువ ధరకు చోరీలకు పాల్పడిన వారినుంచి సామగ్రి కొంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
పొంచి ఉన్న ప్రమాదం
ప్రస్తుతం ఎండలు మండిపోతున్న తరుణంలో.. కనీస ప్రమాణాలు పాటించక పోవడంతో తరచూ హైదరాబాద్ వంటి ఏరియాల్లోని తుక్కు కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేంద్రాల్లో నిరుపయోగంగా అట్టలు, కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, ఇతర సామగ్రి ఇష్టారాజ్యంగా ఆరుబయటనే పడేసి ఉండటం, ఈ కేంద్రాలు పలు కాలనీల మధ్యలోనే ఉండటంతో.. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్నిమాపక అధికారులు, పోలీసులు సైతం ‘మాములు’గానే వదిలి వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
- జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్, రెబ్బెన, వాంకిడి, తదితర మండలాల్లో దాదాపు 20కి పైనే తుక్కు దుకాణాలు వెలిశాయి. సదరు వ్యాపారులు పురపాలిక, పంచాయతీ, అగ్నిమాపక సిబ్బంది నుంచి విధిగా లైసెన్సులు తీసుకోవాలి. నిబంధనలను పాటిస్తూ వ్యాపారాన్ని కొనసాగించాలి. సంబంధిత అధికారులు, ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని అధికారులు ఆ వ్యాపారంపై నిత్యం నిఘా ఉంచాలి. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి దుకాణాల పరిధిలోని ఆయా శాఖల అధికారులు సైతం తనిఖీలు చేయకుండానే ‘మామూలు’ గానే వదిలి వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
మరో కొత్త దందా..
వివిధ రాష్ట్రాల్లోని అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు చోరీలకు పాల్పడిన లారీలు, కార్లు, ద్విచక్రవాహనాలు, ఇతర సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తుక్కు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. తమ దగ్గరి గ్యాస్ కట్టర్స్ సహాయంతో పెద్ద వాహనాలను సైతం తుక్కుగా మార్చి, వాటిని ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. గతంలో ఇలాంటి దందా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తదితర రాష్ట్రాల్లోనే కొనసాగుతుండగా.. ప్రస్తుతం జిల్లాకు కూడా పాకింది. పలువురు తుక్కు వ్యాపారులు ఆ దందాను కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండేళ్ల వ్యవధిలో కాగజ్నగర్లోని మూడు లారీలు మాయమయ్యాయి. అవి మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలకు గుర్తుతెలియని వ్యక్తులు తరలించినట్లు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీల సహాయంతో పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఆ లారీ కేసును నేటికీ పోలీసులు ఛేదించకపోవడం గమనార్హం.
చర్యలు తీసుకుంటాం: కరుణాకర్, డీఎస్పీ
తుక్కు వ్యాపారులపై నిఘా పెంచి చర్యలు తీసుకుంటాం. చోరీలకు పాల్పడిన వస్తువులను కొనుగోలు చేయరాదంటూ ఇప్పటికే పలు మార్లు వ్యాపారులకు హెచ్చరించాం. అయినప్పటికీ ఆ దుకాణాలపై నిత్యం తనిఖీలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు
[ 05-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో శనివారం సాయంత్రం జరిగిన ఘటనలో ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 40 మందిపై నాలుగు కేసులు నమోదు చేశారు. -
ఇండియా కూటమి తరఫున సీపీఎం ప్రచారం
[ 05-05-2024]
ఇండియా కూటమి తరఫున జిల్లాలో సీపీఎం ప్రచారం ప్రారంభించింది. -
క్రాంతినగర్లో పోలీసుల కవాతు
[ 05-05-2024]
పట్టణంలోని క్రాంతినగర్లో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాద విషయమై అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మొహరించారు. -
కారల్ మార్క్స్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
[ 05-05-2024]
కారల్ మార్క్స్ ఆశయాలను నెరవేరిస్తేనే ఆయనకు నివాళులు అర్పించినట్లు అవుతుందని సీపీఎం, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు సూచించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్న శిక్షణ కానిస్టేబుళ్లు
[ 05-05-2024]
పోలీసు శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న 254 మంది శిక్షణ కానిస్టేబుళ్లు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. -
ఆటోను ఢీకొన్న డీసీఎం.. ఒకరి పరిస్థితి విషమం
[ 05-05-2024]
పట్టణంలోని రిమ్స్ ముందు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
[ 05-05-2024]
తాంసి మండలం పొన్నారి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. -
ఎమ్మెల్యేల ప్రత్యేక ప్రార్థనలు
[ 05-05-2024]
బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం కల్వర్ చర్చిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
మరోసారి ప్రధానమంత్రిగా మోదీ
[ 05-05-2024]
మండల కేంద్రంలోని గిరిగాం, తాంసి గ్రామాల్లో ఆదివారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తాంసిలో భారాస ఇంటింటి ప్రచారం
[ 05-05-2024]
మండల కేంద్రంలో ఆదివారం భారాస నాయకులు ఇంటింటా తిరుగుతూ ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు
[ 05-05-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
భారాస నాయకుల ఇంటింటి ప్రచారం
[ 05-05-2024]
మండల కేంద్రలోని పొచ్చర గ్రామంలో భారాస నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
భాజపా గెలుపు ఖాయం: ఎంపీ అభ్యర్థి గోడం నగేష్
[ 05-05-2024]
రాబోయే లోక్సభ ఎన్నికల్లో భాజపా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. -
భారాసతోనే రాష్ట్రానికి మేలు
[ 05-05-2024]
భారాసతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నెడ్క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమయ్య అన్నారు. -
అభిమాన తరంగం.. ఉప్పొంగిన ఉత్సాం
[ 05-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ రోడ్షో గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. -
అగ్రనేతలపై కాంగ్రెస్.. భాజపా ఆశలు
[ 05-05-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, భాజపా, భారాసలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగాయి. మంచిర్యాలలో శనివారం రాత్రి భారాస అధినేత కేసీఆర్ రోడ్షో జరిగింది. -
దేవుడి పేరుతో భాజపా రాజకీయం
[ 05-05-2024]
దేశాన్ని పదేళ్లు పాలించిన భాజపా చేసిన అభివృద్ధి ఏమీ లేకనే దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని మంత్రి సీతక్క విమర్శించారు. -
రాజ్యాంగం మార్చే ప్రసక్తే లేదు
[ 05-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారనే వదంతులు ప్రజలు నమ్మొద్దని, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని రాజ్యసభ సభ్యుడు మదన్సింగ్ రాఠోడ్ తేల్చిచెప్పారు. -
సిబ్బంది కొరత.. రోగుల అవస్థ
[ 05-05-2024]
జిల్లాలోని పీహెచ్సీల్లో స్టాఫ్నర్సులు, ఏఎన్ఎం, వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులకు నామమాత్రపు వైద్యం అందించి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
జిల్లా అభివృద్ధే సీఎం రేవంత్రెడ్డి అభిమతం
[ 05-05-2024]
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిమతం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు -
బాల్యవివాహాలతో అనర్థాలు
[ 05-05-2024]
బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఏర్పడుతాయని మహిళా సాధికారత కేంద్రం ఆర్థిక నిపుణుడు నిఖిల్రెడ్డి పేర్కొన్నారు. -
కబ్జాల వైపు కన్నెత్తి చూడరా?
[ 05-05-2024]
ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిలువ నీడలేని పేదలు గుడిసె వేసుకుంటే రెవెన్యూ అధికారులు తొలగించడం సాధారణంగా గమనిస్తుంటాం. -
పేరుకే శిబిరం.. పర్యవేక్షణ పూజ్యం
[ 05-05-2024]
జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా యువజన, క్రీడాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం నామమాత్రంగా మారింది. -
ప్రక్షాళన మా నుంచే మొదలైంది.. మరి మీరు?
[ 05-05-2024]
బాధితులకు ఫీజుల భారం నుంచి విముక్తి కలిగించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా అర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్(ఓఎస్ఏఎమ్) సభ్యులు అన్నారు. -
లక్ష మెజార్టీతో గెలుపు ఖాయం
[ 05-05-2024]
ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!