జల్సాలకు అలవాటు పడి వ్యాపారికి టోకరా
జల్సాలకు అలవాటు పడి అక్రమంగా డబ్బు సంపాదించాలన్న విద్యార్థి అత్యాశ అతడిని ఊచల వెనుకకు నెట్టేసిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది.
జీఎస్టీ టాస్క్ఫోర్సు అధికారినంటూ బెదిరించి రూ.5 లక్షలు కాజేత
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, చిత్రంలో డీఎస్పీ వి.ఉమేందర్, గ్రామీణ సీఐ రఘుపతి
ఆదిలాబాద్ నేర విభాగం, న్యూస్టుడే : జల్సాలకు అలవాటు పడి అక్రమంగా డబ్బు సంపాదించాలన్న విద్యార్థి అత్యాశ అతడిని ఊచల వెనుకకు నెట్టేసిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. జీఎస్టీ, ఐటీ అధికారినంటూ వ్యాపారిని భయపట్టి రూ.5 లక్షలు కాజేశాడు. వివరాలను ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి శనివారం మావల పోలీసు స్టేషన్లో పాత్రికేయులకు వెల్లడించారు. ఉట్నూర్ మండలం ఎందా గ్రామానికి చెందిన శివకరణ్ కాగ్నే(22) పంజాబ్లోని జలంధర్ సైబర్ సెక్యూరిటీ, ఎల్పీయూ యూనివర్సిటిలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల ఇంటికొచ్చినపుడు స్థానిక వరసిద్ధి దుస్తుల దుకాణానికి తన సోదరితో కలిసి వెళ్లి.. ఆ దుకాణం యజమాని వివరాలు, చరవాణి నెంబరు సేకరించాడు. అతడికి ఫోన్ చేసి నేను జీఎస్టీ, ఐటీ అధికారినంటూ బెదిరించి ఆదిలాబాద్లోని ఒక లాడ్జికి రప్పించుకున్నాడు. వ్యాపారికి అక్కడికి రాగానే సుత్తితో తలపై కొట్టి తాడుతో కట్టేసి భయభ్రాంతులకు గురి చేశాడు. అనంతరం గత నెల 31న ఫోన్ చేసి కుటుంబ సభ్యులను హత్య చేస్తానని బెదిరించి అతని నుంచి రూ.5 లక్షలు తీసుకొని ఉడాయించాడు. ఈ విషయమై బాధితుడు ఈ నెల 1న మావల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ వి.ఉమేందర్ పర్యవేక్షణలో గ్రామీణ సీఐ రఘుపతి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకొని రూ.3.35 లక్షల నగదు, రూ.60 వేల విలువైన చరవాణి, సుత్తి, నైలాన్ తాడు, కత్తి, సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని కోర్టులో ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసాలు ఇటీవల ఎక్కువయ్యాయని నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. డీఎస్పీ ఉమేందర్, గ్రామీణ సీఐ రఘుపతి, మావల ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు