logo

కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Updated : 29 Mar 2024 16:26 IST

జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రామరావుపేట ఎంపీటీసీ సభ్యుడు పెద్దల బాపు, ఇందారం, టేకుమట్ల గ్రామాలకు చెందిన మాజీ ఉప సర్పంచులు బొగడ మీది మౌనిక కిరణ్, లక్ష్మీ నరసయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫయాజ్, నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, ఆసంపల్లి శ్రీకాంత్, విశ్వంభర్ రెడ్డి, నామాల నాగరాజ్, పాత ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని