logo

బిల్లు చెల్లింపు జాప్యం.. పాఠశాలకు తాళం!

కాగజ్‌నగర్‌ పట్టణం పెట్రోల్‌పంపు ఏరియాలోని జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ, బిల్లు మంజూరులో జాప్యం కారణంగా.. గుత్తేదారు ఏకంగా పాఠశాలకు తాళం వేశాడు.

Updated : 16 Apr 2024 06:04 IST

పాఠశాలకు తాళం వేయడంతో బయట నిల్చొన్న విద్యార్థులు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: కాగజ్‌నగర్‌ పట్టణం పెట్రోల్‌పంపు ఏరియాలోని జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ, బిల్లు మంజూరులో జాప్యం కారణంగా.. గుత్తేదారు ఏకంగా పాఠశాలకు తాళం వేశాడు. సోమవారం ఉదయం విద్యార్థులు పాఠశాలకు రాగా.. ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఎదుటే నిల్చొన్నారు. రూ.97 లక్షలు పాఠశాల బిల్లు మంజూరు కావాల్సి ఉంది. రేపు మాపు అంటూ బిల్లు మంజూరు చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తుండటంతోనే పాఠశాల గేటుకు తాళం వేసినట్లు గుత్తేదారు అబీబ్‌ తెలిపారు. బిల్లు సత్వరమే మంజూరు చేస్తామని జిల్లా విద్యాధికారి అశోక్‌ స్పష్టమైన హామీ మేరకు.. గుత్తేదారు తాళాన్ని తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని