నాడు గిరిజనులను కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టే..
నాడు హక్కుల కోసం పోరాడిన గిరిజనులను ఇంద్రవెల్లిలో కాల్చి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అంత పెద్ద తప్పు చేసి అమరవీరులకు క్షమాపణలు చెప్పకుండా సిగ్గు లేకుండా ఆ పార్టీ సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లిలో ఏ ముఖం పెట్టుకొని సభ ఏర్పాటు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు
ప్రభుత్వ ఉద్యోగులతో మాది పేగు బంధం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్, చిత్రంలో నిర్మల్ జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, జాన్సన్ నాయక్, జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఎంపీ అభ్యర్థి సక్కు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కుమురం భీం మనవడు సోనేరావు, విలాస్, రమాదేవి, శ్యాంసుందర్, తదితరులు
ఆదిలాబాద్ పట్టణం, న్యూస్టుడే : నాడు హక్కుల కోసం పోరాడిన గిరిజనులను ఇంద్రవెల్లిలో కాల్చి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అంత పెద్ద తప్పు చేసి అమరవీరులకు క్షమాపణలు చెప్పకుండా సిగ్గు లేకుండా ఆ పార్టీ సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లిలో ఏ ముఖం పెట్టుకొని సభ ఏర్పాటు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఆదిలాబాద్లో మంగళవారం నిర్వహించిన పార్టీ ఆదిలాబాద్ లోక్సభ బూత్స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులతో తమకు పేగు బంధమని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో, స్వరాష్ట్ర సాధనకు జరిగిన ప్రతి పోరాటంలో ఉద్యోగులు తమతో కలిసి వచ్చారన్నారు. అందుకే కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ఉద్యోగుల కంటే ఎక్కువగా 73 శాతం వేతనాలు పెంచారని గుర్తుచేశారు. కాకపోతే ఎన్నికల్లో వారి మనసును గెలవలేకపోయామన్నారు. ఎందుకంటే వారికి వేతనాలు ప్రతి నెల ఒకటో తేదీన ఇవ్వలేకపోయామని వివరించారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు కూడగట్టుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద పదవులు అనుభవించిన వాళ్లు ఎందరో వెళ్లినా ఒక నిరుపేద గిరిజనుడైన ఆత్రం సక్కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా పార్టీని నమ్ముకొని ఉండటం ఇతరులకు ఆయన ఆదర్శమని కొనియాడారు. ఆయన్ని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు కష్టపడితే వచ్చే సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికల్లో మేం కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తామని వివరించారు.
భాజపా, కాంగ్రెస్లు ఒకటే..
జోగురామన్న, భారాస జిల్లా అధ్యక్షుడు
ప్రజలనుమోసం చేయడంలో భాజపా, కాంగ్రెస్ ఒకటే. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్, సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ, విమానాశ్రయం ఏర్పాటు చేయడంలో కేంద్రం జిల్లాపై వివక్ష కనబరిచింది. అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలి. 420 హామీలను అమలుచేయని కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది.
పార్లమెంట్లో ఆదిలాబాద్ గొంతు వినిపిస్తా
ఆత్రం సక్కు, ఎంపీ అభ్యర్థి
ప్రతి కార్యకర్త తాను ఎంపీ అభ్యర్థిగా భావించి కష్టపడి పని చేయాలి. చేసిన అభివృద్ధిని వివరించాలి. ఒకరు మతం పేరుతో, మరొకరు మోసపూరిత హామీలతో మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారనే విషయాన్ని విడమరిచి చెప్పాలి. నేను ఏ గ్రామానికి వెళ్లినా కేసీఆర్ రైతుబంధు ఇచ్చిన దేవుడని కొనియాడుతున్నారు. పార్లమెంటులో ఆదిలాబాద్ గొంతును వినిపించేందుకు గెలిపించాలి.
భారాస సత్తా చూపించాలి
అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
సమావేశానికి హాజరైన వేలాది మంది కార్యకర్తలను చూస్తుంటే మన బలమెంతో తెలుస్తుంది. ప్రజా సభ పెడితే ఇంకెలాగో ఉంటదో అర్థమవుతుంది. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో పని చేయాలి. మే 13న మన సత్తా చూపించాలి. గులాబీ జెండాను ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఎగురవేసి ఇతర పార్టీలకు మనమేంటో చూపించాలి.
సొంత గూటికి జడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్
జిల్లా పరిషత్ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఇంతకుముందు ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించి, చివరి నిమిషంలో మనసు మార్చుకొని భాజపాలో చేరారు. ఎంపీ టికెట్ ఆశించినా నిరాశ ఎదురైంది. తాజాగా పార్టీ సమావేశంలో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు. కుమురం భీం మనవడు సోనేరావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నిర్మల్ జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ ప్రేమేందర్, వివిధ నియోజకవర్గాల బాధ్యులు జాన్సన్నాయక్, లోలం శ్యాంసుందర్, రమాదేవి, రాంకిషన్రెడ్డి, ఎంపీపీలు తులశ్రీనివాస్, మార్శెట్టి గోవర్ధన్, జడ్పీటీసీ సభ్యులు చారులత, కుమ్ర సుధాకర్, నాయకులు యూనుస్ అక్బానీ, సాజిదొద్దీన్, రౌతు మనోహర్, సతీష్పవార్, అజయ్, యాసం నర్సింగ్రావు, దాసరి రమేష్, కస్తాల ప్రేమల, రంగినేని మనీషా, ఆడే శీల, మమత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఇంటింటి ప్రచారం
[ 30-04-2024]
తాంసి మండలం పాలోది, జామిడి గ్రామాల్లో మంగళవారం భారాస నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద