దోచుకోవడంపైనే వైకాపా సర్కారు ధ్యాస
వైకాపా ప్రభుత్వానికి దోచుకోవడంపై తప్ప, రాష్ట్రాభివృద్ధిపై ధ్యాస లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు.
భాజపా ఎంపీ జీవీఎల్
మాట్లాడుతున్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు, చిత్రంలో రాజారావు, ఉమామహేశ్వరరావు, కృష్ణారావు తదితరులు
అరకులోయ పట్టణం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వానికి దోచుకోవడంపై తప్ప, రాష్ట్రాభివృద్ధిపై ధ్యాస లేదని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. అరకులోయ మండలం చినలబుడులో శుక్రవారం ఆయన పర్యటించారు. స్థానిక ఏకలవ్య పాఠశాలలో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని టీవీలో వీక్షించారు. అరకులోయ పోర్టు అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడిన జీవీఎల్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఇతర పథకాలకు ఖర్చుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను మోసగిస్తోందన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లో గిరిజనులకు ఖర్చు చేయాల్సిన కేంద్ర నిధుల్ని పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో గత ఏడాది 1.58 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాలు పొందినట్లు గణాంకాలు ఉండగా, ఈఏడాది 71వేల మందికి తగ్గిందన్నారు. రాష్ట్రానికి 28 ఏకలవ్య పాఠశాలలు కేంద్రం మంజూరు చేయగా, వాటిలో అల్లూరి మన్యంలో 11 ఉన్నాయన్నారు. వీటిలో ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించని పరిస్థితిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
గుర్తింపునకు నోచుకోని కులాలకు ప్రాధాన్యం
రాష్ట్రంలో అర్హతలున్నా పూర్తిస్థాయి గుర్తింపునకు నోచుకోని గిరిజన కులాలను గుర్తించి వారికి పూర్తి న్యాయం చేస్తామన్నారు. కొండకుమ్మర్లు గిరిజనులుగా గుర్తించేందుకు శతశాతం అర్హులన్నారు. వీరిపై అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు కూడా సమాచారం లేదన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ పనులు అక్కడక్కడ మాత్రమే జరుగుతున్నాయన్న జీవీఎల్, కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లి వారంలో జాతీయ రహదారి పనులు వేగవంతం అయ్యేలా చూస్తానన్నారు. రెండు మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా పర్యటించి మన్యం సమస్యలపై పూర్తినివేదికతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. జిల్లా భాజపా అధ్యక్షులు పాంగి రాజారావు, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు, ఉమామహేశ్వరరావు, పార్టీ మండల నాయకులు రామచంద్ర, ఆనంద్, దేవ, బలరాం ఆయన వెంట ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!