logo

ఆదివాసీ హక్కులను రక్షించే వారినే బలపర్చండి

మండలంలోని గసభ పంచాయతీ మొర్రిగుడలో ఇండియా కూటమిని గెలిపించాలని సీపీఎం నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు.

Published : 18 Apr 2024 01:50 IST

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: మండలంలోని గసభ పంచాయతీ మొర్రిగుడలో ఇండియా కూటమిని గెలిపించాలని సీపీఎం నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. బుధవారం సీపీఎం మండల కార్యదర్శి పోతురాజు ఆధ్వర్యాన జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సురేంద్ర మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలబిస్తున్న భాజపా, వైకాపా పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల రక్షణకు నిలబడుతున్న ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం నేతలు కోరారు. మాజీ సర్పంచి సురేష్‌, నాయకులు సత్యనారాయణ, రాజ్‌కుమార్‌, దొరబాబు, రంజిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


జి.మాడుగుల, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో సీపీఎం ఎంపీ అభ్యర్థి అప్పనర్సయ్యను గెలిపించాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మన్నపడాల్‌ తెలిపారు. వంతాల పంచాయతీ తియ్యమామిడి, బొడ్డాపుట్టు, కుమ్మరిగుంట, వంట్లమామిడి, మూగమర్రి, కర్జపల్లి, జర్రాయి గ్రామాల్లో బుధవారం ప్రచారాన్ని నిర్వహించారు. గిరిజన సంఘం నాయకుడు సర్భునాయుడు, వార్డు మెంబర్లు సీతారాం, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని