ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది.
ప్రభుత్వంలో విలీనమైనా దక్కని ప్రయోజనాలు
వేతన సవరణ, బకాయిల చెల్లింపులు ఎప్పుడో?
ముఖ్యమంత్రి జగన్ తీరుపై ఆవేదన
ఈనాడు, విశాఖపట్నం
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను జగన్ చిదిమేసినట్లయింది. బకాయిలు ఇవ్వలేక, భత్యాలు చెల్లించలేక జగన్ సర్కార్ చేతులెత్తేసి ఉద్యోగులకు చుక్కలు చూపిస్తుంది. ఫలితంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వేల మంది ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.
ఆ 75 శాతం ఏవీ: పర్యటనలకు అవసరం నిమిత్తం రూ.23 కోట్లతో ఇటీవల అయిదు ప్రత్యేక బస్సులను కొనిపించిన జగన్ ఉద్యోగుల బకాయిల చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2017లో ఆర్టీసీ వేతన సవరణ చేపట్టగా అప్పటి బకాయిలను ఇప్పటివరకు పూర్తిగాచెల్లించలేదు. మొత్తం ఒకేసారి ఇస్తే భారమవుతుందని నాలుగు భాగాలుగా చేసి మొదట 25 శాతం అందరికి జమ చేసి మిగిలిన 75 శాతం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు.
అవన్నీ ఆగిపోయాయి: వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. ప్రభుత్వంలో కలవక ముందు గ్యారేజీ ఉద్యోగులకు రాత్రి భత్యం, డీజిల్ను పొదుపు చేసినందుకు నెలవారి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. అదనంగా పనిచేసిన సమయానికి అదనపు భత్యం, ప్రతి నెలా టెక్నికల్ భత్యం, వేడి దగ్గర పనిచేస్తే హీట్ అలవెన్స్, 45 ఏళ్లు దాటిన మహిళా కండక్టర్లకు ఆరోగ్య భత్యం వంటివి ఉండేవి. ప్రతి నెలా వచ్చే జీతంతో పాటు వారి అనుభవం ఆధారంగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు అదనపు ఆదాయం వచ్చేది. ఇప్పుడు అవేమీ అందడం లేదు.
- గతంలో రెండేళ్లకు ఒకసారి మూడు జతల ఏకరూప దుస్తులు అందజేయడంతో పాటు కుట్టు కూలి ఇచ్చేవారు. పాదరక్షల కోసం రూ.వెయ్యి అందజేసేవారు. ఇప్పుడు గ్యారేజీ కార్మికులు, ఉద్యోగులు సొంత డబ్బులతో బూట్లు, ఏకరూప దుస్తులు కొనుగోలు చేసుకుంటున్నారు.
- దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మధ్యలో ఆగిపోతే వాటి మరమ్మతుకు ఇక్కడి నుంచి మెకానిక్లు వెళ్లి బాగు చేసేవారు. వీరు వెళ్లినందుకు అయ్యే ఖర్చులు ఇచ్చేవారు. పని వేళలకు మించి చేస్తే ఓటీ ఇచ్చేవారు. ఇప్పుడు అవేమీ ఇవ్వడమే లేదు. భోజనాలకు సొంత డబ్బులే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.
ఆరోగ్య భత్యమూ లేదు: అన్ని రకాల వైద్య సేవలకు ఈహెచ్ఎస్ ఉపయోగపడకపోవడంతో సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇటీవల ఓ ఆర్టీసీ ఉద్యోగికి ఛాతిలో నొప్పి రాగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రూ.1.50 లక్షలు చెల్లిస్తేగాని వైద్యం అందించలేమన్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగి గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోయేది. వెంటనే చికిత్స ఆరంభించేవారు. అప్పట్లో రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వైద్యం ఉచితంగా అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పదవీ విరమణ ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. ప్రభుత్వంలో విలీనం అయ్యాక తీవ్రంగా నష్టపోయామని వారంతా ఆవేదన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయం జెఫ్ బెజోస్ నుంచే నేర్చుకున్నా
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత