ఏకతాటిపైకి నేతలు.. తెదేపాలో నూతనోత్సాహం
రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు.
వంతల రాజేశ్వరితో పరిశీలకులు శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థిని శిరీషాదేవి తదితరులు
రంపచోడవరం, న్యూస్టుడే: రంపచోడవరం నియోజవర్గంలో తెదేపా నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. టికెట్ ఇవ్వలేదని ఇప్పటివరకు అసంతృప్తితో ఉన్న తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేస్తానని మంగళవారం ప్రకటించారు. దీంతో తెదేపా నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
నేతలంతా ఒక్కతాటిపైకి రావడంతో ఇక విజయం దిశగా పయనిస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని అసంతృప్తితో ఉన్న రాజేశ్వరితో నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసాల రాజు, జోన్-1 కోఆర్డినేటర్ దామచర్ల సత్య చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఆమెకు న్యాయం చేసేలా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వీరితో చర్చలు అనంతరం రాజేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి, పార్టీ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు దంతులూరి శివాజీ, ఎటపాక మండల అధ్యక్షుడు పుట్టి రమేష్, సీనియర్ నాయకులు మువ్వా శ్రీను, కనిగిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రెండు అసెంబ్లీ స్థానాలకు మరో ఏడు
పాడేరు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలకు ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. అరకులోయ అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులు చెండా ఏలియా, సివేరి అబ్రహం, వంతాల రామన్న, నారజి మధుబాబు, మర్రి ఉషారాణి, జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర నామపత్రాలు సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ తెలిపారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు మరొక సెట్ నామపత్రాలు అందజేశారని రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. రిటర్నింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పాడేరు సీఐ ప్రవీణ్కుమార్ రెండు కేంద్రాల వద్ద బందోబస్తు పర్యవేక్షించారు.
జిల్లాలో తొమ్మిది నామినేషన్లు
పాడేరు, న్యూస్టుడే: జిల్లాలోని అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో మంగళవారం తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత తెలిపారు. అరకు అసెంబ్లీకి ఆరు, పాడేరు ఒకటి, రంపచోడవరంలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు.
అయిదో రోజు ఇద్దరు
రంపచోడవరం, న్యూస్టుడే: రంపచోడవరం శాసనసభ నియోజకవర్గానికి మంగళవారం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వై.రామవరం మండలం గుర్తేడు పంచాయతీ అల్లూరిగడ్డ గ్రామానికి చెందిన కాకూరు కన్నపురెడ్డి, ఎటపాక మండలం చెన్నంపేట గ్రామానికి చెందిన కుంజా శ్రీను తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రశాంత్కుమార్కు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు లేని సంక్షేమం అభివృద్ధి నిలయంగా మన్యం
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమి విజయభేరి నేడే
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. -
ఓటుతో వైకాపాకు బుద్ధి చెప్పండి: ఈశ్వరి
[ 06-05-2024]
మీకు ఏ కష్టమొచ్చినా అండగా నేనుంటా.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటుతోనే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
జనం ఆస్తులకు జగనే గండం
[ 06-05-2024]
ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు. -
సెల్ఫోన్ పేలి చిరు వ్యాపారికి గాయాలు
[ 06-05-2024]
సెల్ఫోన్ పేలి వ్యక్తికి గాయాలు పాలైన ఘటన పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పరమలమ్మలో చోటు చేసుకుంది. -
చంద్రబాబుతోనే పోలవరం పూర్తి
[ 06-05-2024]
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం
[ 06-05-2024]
కూటమి గెలుపుతోనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
ఆసుపత్రిలో ఆకలి కేకలు
[ 06-05-2024]
నక్కపల్లి ఆసుపత్రిలో నిత్యం సగటున 25 మంది రోగులు ఉండేవారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొవిడ్ పేరుతో దాదాపు మూడేళ్లపాటు నిలిపేసింది. -
ప్రత్యర్థులు అసూయ పడేలా అభివృద్ధి చేస్తా: సీఎం రమేశ్
[ 06-05-2024]
కూటమి అభ్యర్థులను గెలిపించి ఇటు కేంద్రం, అటు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
మోదీ సభకు సర్వం సిద్ధం
[ 06-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లపాలెం సమీపంలోని సభాస్థలి ఏర్పాట్లను కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. -
యువత భవిత పట్టని పాలకులు: వడ్డే
[ 06-05-2024]
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, ముఖ్యంగా మనం ఎన్నుకున్న నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ‘భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక’ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
[ 06-05-2024]
పార్లమెంట్ అభ్యర్థి సి.ఎం.రమేశ్పై వైకాపా నాయకుల దాడిని నిరసిస్తూ పేటలో ఆదివారం కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. -
నీటి విడుదల నిలిపేసి గాలింపు
[ 06-05-2024]
మాచ్ఖండ్ జలవిద్యుత్కేంద్రానికి చెందిన జోలాపుట్ జలాశయం నుంచి ఆదివారం కొన్ని గంటలపాటు నీటి విడుదల నిలిపివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం