నాసైకిలే.. నా డాక్టర్
అయిదు పదుల వయసు దాటుతున్నారో లేదో మధుమేహం, రక్తపోటు, మోకాళ్ల నొప్పులంటూ ఈ రోజుల్లో కొందరు సతమతమైపోతుంటారు. అయితే ఆయనకు తొమ్మిది పదుల వయసు పైబడింది. మనవలు, మనవరాళ్లతో ఆడుకునే వయసు. విశ్రాంతి
అలుపెరగని పతకాల యోధుడు శివరామకృష్ణయ్య
లక్ష్మీపురం, న్యూస్టుడే
సైకిల్పై నుంచి జావెలిన్త్రో విసురుతున్న గింజుపల్లి శివరామకృష్ణయ్య
అయిదు పదుల వయసు దాటుతున్నారో లేదో మధుమేహం, రక్తపోటు, మోకాళ్ల నొప్పులంటూ ఈ రోజుల్లో కొందరు సతమతమైపోతుంటారు. అయితే ఆయనకు తొమ్మిది పదుల వయసు పైబడింది. మనవలు, మనవరాళ్లతో ఆడుకునే వయసు. విశ్రాంతి కోరుకునే మనసు. ఆ వయసులోనూ ఏమాత్రం తరగని ఉత్సాహం ఆయన సొంతం. ఎంతో మంది క్రీడాకారులకు మెలకువలు నేర్పిస్తూ.. ఇప్పటికీ వారితో పోటీ పడుతూ.. మనసును పతకాల వెంట పరుగులు తీయిస్తున్నారు గుంటూరుకు చెందిన 93 సంవత్సరాల గింజుపల్లి శివరామకృష్ణయ్య. నిత్యం అయిదు కిలోమీటర్లు సైకిల్ తొక్కడం వల్ల ఈ వయసులోనూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు శివరామకృష్ణయ్య. ఇటీవల చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంఫియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరచి మూడు పసిడి పతకాలు చేజిక్కించుకున్నారు.
ఎందరికో స్ఫూర్తి..
పతకాలతో..
ప్రత్తిపాడులో 19 మంది సంతానంలో 13వ వాడిగా జన్మించిన ఆయన పోరాటం చిన్ననాటి నుంచే ప్రారంభమైంది. రవాణా సదుపాయాలు లేని ఆ రోజుల్లో కాలినడకన ఎన్నో కిలోమీటర్లు నడచి వెళ్లి చదువుకున్నారు. శివరామకృష్ణయ్య 1963-73 మధ్య కాలంలో జాతీయ వాలీబాల్ జట్టు సభ్యుడు. పేరొందిన అథ్లెట్. ఉద్యోగ విరమణ చేసినా తర్వాత కూడా క్రీడా సాధన చేస్తున్నారు. రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో, జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, షాట్ఫుట్ పోటీల్లో ఇప్పటికీ రాణిస్తున్నారు. 2018, 2019లో జరిగిన ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంఫియన్షిప్ పోటీల్లో మూడు బంగారు పతకాలు, అదే ఏడాది బెంగుళూరులోని జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంఫియన్షిప్ పోటీల్లోనూ జావెలిన్త్రో, డిస్కస్త్రో, షాÆట్ఫుట్ విభాగాల్లో మూడు పసిడి పతకాలు హస్తగతం చేసుకున్నారు. వచ్చే నెల్లో పిన్లాండ్లో జరిగే అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధనే లక్ష్యంగా నిత్యం ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
క్రమశిక్షణ కలిగిన జీవన విధానం
క్రమశిక్షణ కలిగిన జీవన విధానం వల్లే ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉంటున్నా. ‘ఇప్పటికీ మధుమేహం, రక్తపోటు, మోకాళ్ల నొప్పులు వంటివి ఏమీలేవు. నా డాక్టర్.. నా సైకిలే. ఇప్పటికీ నిత్యం అయిదు కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాను. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఎన్టీఆర్ క్రీడాప్రాంగణంలో గంట వంతున నేను ప్రాక్టీస్ చేసుకుంటూ క్రీడాకారులకు మ్చెకువలు తెలియజేస్తుంటా. ఉదయం కర్జూరం, నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగుతా. ఆరు బాదం పప్పులు, వాల్నట్్స, పిస్తా తీసుకుంటా. ఆయిల్ లేకుండా జొన్న రొట్టె, లేకపోతే గోధుమ రొట్టెలు అల్పాహారంగా భుజిస్తా. మధ్యాహ్నం అన్నం రెండు కప్పులు, కూరలు ఎక్కువగా తీసుకుంటా. పెరుగు చాలా తక్కువ. మజ్జిగ ఎక్కువగా తాగుతా. రాత్రికి ఆపిలో, అరటి పండో, జామకాయ ఏదో ఒకటి తింటా. కాఫీలు, టీలు తాగను. పాలల్లో ఓట్సు, అటుకులు వేసుకుని తాగుతా. మద్యపానం, మాంసాహారం జోలికి వెళ్లను. మితాహారం, నిత్య వ్యాయామం నా ఆరోగ్య రహస్యం’..అని శివరామకృష్ణయ్య వివరించారు.
* ‘యువత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగాను ధృడంగా ఉండాలి. నిత్యం వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. దేవుడు ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చాడు. దానికి కాపాడుకోవడం మన ధర్మం. మితాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. పది మందికి మేలు చేయాలనే నాలో ఉన్న తపనే నన్ను ఇంత సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతుంది’.
-శివరామకృష్ణయ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక నేతలను ఓటుతో తరిమికొట్టండి
[ 06-05-2024]
‘ఇది మహనీయుల గడ్డ. ఎన్జీరంగా పుట్టిన ఈ నేలకు నమస్కరిస్తున్నా. చేనేత పితామహుడు ప్రగడకోటయ్య పుట్టిన ప్రదేశమిది. -
జనం ఆస్తులపై.. జగన్!
[ 06-05-2024]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు శాపంగా మారింది. -
పోస్టల్ బ్యాలట్ గందరగోళం
[ 06-05-2024]
జిల్లాలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆదివారం పీవో, ఏపీవోలకు ఉదయం శిక్షణ ఇచ్చి మధ్యాహ్నం నుంచి అక్కడే పోస్టల్ బ్యాలట్ ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించారు. -
మా ఆస్తులపై.. నీ పెత్తనం ఏంటీ జగన్!
[ 06-05-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చర్చ తీవ్రమవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
సీపీఎస్ రద్దని నమ్మించి ఉద్యోగులను మోసం చేసి..
[ 06-05-2024]
2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్ ఉద్యోగులతో ఊరూరా దండలు వేయించుకుని వారికి ముద్దులుపెట్టి తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పింఛను స్కీంను (ఓపీఎస్) తీసుకొస్తానని హామీ ఇచ్చారు. -
ఐదేళ్లూ.. దారిద్య్రమే!
[ 06-05-2024]
రహదారులు.. ప్రగతికి చిహ్నాలు. వైకాపా అయిదేళ్ల పాలనలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేశారు. అడుగుకో గుంత చొప్పున రోడ్డంతా చిల్లులు పడినా వైకాపా ప్రజాప్రతినిధులు, మంత్రులు పట్టనట్లు వదిలేశారు. -
8 వరకు పోస్టల్ బ్యాలట్కు అవకాశం
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్, ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి అన్నారు. -
అక్రమ వసూళ్లలో రజిని ఆల్టైం రికార్డు
[ 06-05-2024]
అయిదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా నేతలందరూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
పోలింగ్ బూత్ల వద్ద ఉద్యోగుల కష్టాలు
[ 06-05-2024]
తొలిరోజు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. -
ఓటు హక్కు వినియోగం!
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మాటల్లోనే సురక్షితం.. గ్రామాలకు అందని జలం
[ 06-05-2024]
రొంపిచర్ల మండలంలోని మునమాకలో నాలుగేళ్ల నుంచి రక్షిత మంచి నీటి పథకం నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. -
తెదేపా కార్యకర్తలపై వైకాపా రాళ్ల దాడి
[ 06-05-2024]
మాచర్లలో వైకాపా మూక మరోసారి రెచ్చిపోయింది. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు దిగింది. -
బ్యాలెట్ ఓట్లకు బేరసారాలు
[ 06-05-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. పది ముఠాలు పోలింగ్ కేంద్రానికి సమీపంలో కాచుక్కున్నాయ్... ఓటేసేందుకు వచ్చిన ఉద్యోగితో బేరసారాలాడటం..
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా