పైపై అందాలకే మొగ్గు..!
గాంధీనగర్లోని సర్ విజ్జి నగరపాలక సంస్థ ఈత కొలనుల ఆధునికీకరణకు నగరపాలక సంస్థ సుమారు రూ.2కోట్లు వెచ్చించినా.. స్విమ్మర్లకు ఇబ్బందులు తప్పేలా లేదు.
రిసార్ట్ తలపించేలా ఈత కొలను
రూ.2కోట్లు వెచ్చించినా స్విమ్మర్లకు తప్పని ఇబ్బందులు
పూల్ వద్ద కూర్చోవడానికి ఏర్పాటు చేసిన షెల్టర్లు
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే : గాంధీనగర్లోని సర్ విజ్జి నగరపాలక సంస్థ ఈత కొలనుల ఆధునికీకరణకు నగరపాలక సంస్థ సుమారు రూ.2కోట్లు వెచ్చించినా.. స్విమ్మర్లకు ఇబ్బందులు తప్పేలా లేదు. నీటి శుద్ధి కర్మాగారాలు (వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్స్), పూల్లో ఫ్లోరింగ్, పోటీల సమయంలో లేన్ల మార్కింగ్ వంటివి ప్రధాన భూమిక పోషిస్తాయి. నగరపాలక సంస్థ మాత్రం వీటి కంటే ఎక్కువ భాగం బాహ్య అలంకారానికే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. రిసార్ట్స్ను తలపించేలా పూల్ ప్రాంగణంలో కూర్చునేందుకు వీలుగా షెల్టర్లు, గ్యాలరీకి టైల్స్, ఫిల్టరైన నీళ్లు పూల్లోకి పంపే వాటికి ఆకర్షణీయంగా టైల్స్, ముఖద్వారాల ఏర్పాటు, అధికారుల కార్లు పార్క్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకించి స్థలం కేటాయించి తీర్చిదిద్దారు. మరో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూల్ ప్రాంగణానికి మూడు వైపులా రోడ్లు ఉన్నాయి. పడమర దిక్కున నగరపాలక సంస్థ కందుకూరి వారి కల్యాణ మండపం ఉంది. ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం చేపట్టిన పనుల్లో దీన్ని విస్మరించారు.
ప్రధానంగా స్విమ్మర్లు సాధన చేసుకునేందుకు నీటిశుద్ధి కేంద్రం (ఫిల్టరైజేషన్ ప్లాంట్)కు ఆవశ్యకత ఉంది. స్టాండర్డ్ 50మీ.ల స్విమ్మింగ్ పూల్లోని నీటిని ఫిల్డర్ చేసేందుకు రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో ఒక్కటే పనిచేస్తోంది. రెండూ రన్నింగ్లో ఉంటే.. ఒక పూట ఒకటి, మరో పూట రెండోదానిని వినియోగిస్తే ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తాయి. అలా కాకుండా ఒకే ప్లాంటును రెండు పూటలా వాడితే భారం అధికమై త్వరగా రిపేరుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్లాంట్లకు రంగులు వేసి వదిలేశారు. గతంలో పనిచేయని దానిని బాగుచేశారు. పూర్తిగా పాడైపోయిన మరో దానిని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఫ్లోరింగ్ మార్చకుండా యథాతథంగా 25మీ.ల డీప్ పూల్
* పూల్ ప్రాంతానికి దక్షిణం వైపు ప్రధాన రహదారిలోకి అదనంగా మరో నూతన ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు నిత్యంగా రద్దీగా ఉంటుంది. ద్విచక్రవాహనాలు రోడ్డు పక్కగా పార్కింగ్ చేస్తే.. మరీ రద్దీ పెరిగే అవకాశం ఉంది. గతంలో తూర్పు వైపున ప్రధాన ద్వారం, ఉత్తరాన ద్విచక్రవాహనాలు ప్రవేశానికి వీలుగా చిన్నపాటి గేటు ఉండేది. పడమర వైపు మరో చిన్న గేటు ఉంది. ఇన్ని ఉన్నా.. దక్షిణాన అదనంగా మరో ప్రధాన ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేయడంతో ఆప్రాంతంలో రద్దీ అధికమవడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
* స్టాండర్డ్ 50మీ.ల పూల్లో లైన్ల మార్కింగ్ను రంగుతో వేశారు. శుభ్రం చేసే క్రమంలో రంగు పోయే అవకాశం ఉంది. కొత్త టైల్స్ వేశారు. ఆ సమయంలోనే లేన్ల మార్కింగ్ ప్రాంతంలో అదే రంగుతో కూడిన టైల్స్తో మార్కింగ్ చేయడం ద్వారా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. మూడు దశాబ్దాలకు పైగా నిర్మించిన ఈ పూల్లో గతంలో టైల్స్తోనే అమర్చిన మార్కింగ్ ఉండేది.
* 25మీ.ల డీప్ పూల్ను ఏమాత్రం పట్టించుకోలేదు. గతంలో పలుమార్లు ఫ్లోరింగ్కు వేసిన టైల్స్ పోయి స్విమ్మర్ల కాళ్లకు గాయాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దినప్పటికీ.. స్విమ్మర్లకు గాయాలు తప్పేలా లేదు. అధికారులు ఫ్లోరింగ్ కూడా ఒకే సారి వేసినట్లయితే స్విమ్మర్లకు ఉపయుక్తంగా ఉండేది.
* గతంలో స్విమ్మర్లు జాగింగ్, ఎక్సర్సైజ్లు చేసుకునేందుకు వీలుగా తూర్పువైపు ప్రధాన ముఖద్వారానికి పక్కనే పచ్చికతో కూడిన ప్రాంతం ఉండేది. ప్రస్తుతం అక్కడ మొత్తం ఫ్లోరింగ్ వేసి, అధికారుల కార్ల పార్కింగ్కు కేటాయించడం విమర్శలు వస్తున్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పూల్లో ఎప్పుడూ లేని విధంగా నూతనంగా అధికారుల కార్ల పార్కింగ్కు స్థలం కేటాయింపు సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు.
* గతంలో దిచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. పనిరాకి వస్తువులతో పాటు తొలగించిన పరికరాలు అక్కడ ఉంచారు. అక్కడ ఉంచిన వ్యర్థాలను త్వరితగతిన తొలగించి ద్విచక్ర వాహనాల పార్కింగ్కు వినియోగంలోని తీసుకురావాలని స్విమ్మర్లు కోరుతున్నారు.
●* ఈత కొలను ప్రాంతం ఇతరులకు పూర్తి నిషిద్ధప్రదేశం. ఇక్కడికి వచ్చిన వారు తొలుత స్నానమాచరించి, కొలనులోకి దిగి సాధన చేసుకుంటారు. సాధన పూర్తయిన తర్వాత మళ్లీ స్నానం చేసి వెళ్లిపోతారు. అంతేగానీ సేదతీరడానికి ఇతరులకు ఈ ప్రాంతం పూర్తి నిషిద్ధం. అలాంటిది ప్రాంగణంలో కూర్చునేందుకు వీలుగా షెల్టర్లు ఏర్పాటు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేన ఉమ్మడి కార్యాలయం ప్రారంభం
[ 10-05-2024]
శ్రీకాకుళంలో జనసేన పార్టీ ఉమ్మడి కార్యాలయాన్ని తెదేపా నాయకులు ప్రారంభించారు. -
మీ ఆస్తులకు భద్రత కావాలంటే కూటమిని గెలిపించాలి: చంద్రబాబు
[ 10-05-2024]
తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
అందుకే విజయవాడ పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్ కల్యాణ్
[ 10-05-2024]
‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది. -
బతుకు బండిపై.. పెట్రో మంట!
[ 10-05-2024]
ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట -
గన్నవరంలో చంద్రబాబు పర్యటన నేడు
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం గన్నవరంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. -
కూటమితోనే అభివృద్ధి
[ 10-05-2024]
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
[ 10-05-2024]
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్మిశ్రా అధికారులకు సూచించారు. -
చేష్టలుడిగిన నేత
[ 10-05-2024]
చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం -
ప్రభుత్వ మార్పుతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 10-05-2024]
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రగతి, మంచితనానికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కోరారు. -
కూటమికే మా మద్దతు
[ 10-05-2024]
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మద్దతు ఎన్డీయే కూటమికేనని సంఘ రాష్ట్ర కార్యదర్శి బీఆర్ ఆంజనేయులు అన్నారు. -
కూటమిదే పీఠం
[ 10-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. -
రూపాయి ఇవ్వలేదు రూపుమారలేదు
[ 10-05-2024]
మచిలీపట్నం కలెక్టరేట్ పరిధిలో ఆర్డీవో కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో ఆధునిక వసతులతో భవనం నిర్మించాలని నిర్ణయించడంతోపాటు రూ.2.25కోట్లు కేటాయించారు.2018 సెప్టెంబరు 28న పనులు ప్రారంభించారు. -
సాధారణ కాన్పులో 4 కిలోల బిడ్డ జననం
[ 10-05-2024]
గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతలనర్వకు చెందిన మేరీజోస్కు సాధారణ కాన్పులో 4 కిలోల బరువుతో బాబు జన్మించినట్లు వైద్యాధికారులు వి.శ్రుతి, భార్గవి గురువారం తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు