logo

జనసేన ఉమ్మడి కార్యాలయం ప్రారంభం

శ్రీకాకుళంలో జనసేన పార్టీ ఉమ్మడి కార్యాలయాన్ని తెదేపా నాయకులు ప్రారంభించారు.

Updated : 10 May 2024 21:13 IST

ఘంటసాల: శ్రీకాకుళంలో జనసేన పార్టీ ఉమ్మడి కార్యాలయాన్ని తెదేపా నాయకులు ప్రారంభించారు. ఘంటసాల మండల తెదేపా అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, జనసేన నాయకుడు బాలకోటేశ్వరరావు, నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, తాడికొండ వెంకటేశ్వరరావు, శ్రీనివాసులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. శ్రీకాకుళానికి చెందిన తాడికొండ సాయి మిత్రబృందం, తెదేపా, జనసేన, భాజపా నాయకులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని ప్రజలను కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు