అర్జీల పరిష్కారంపై దృష్టి సారించండి
స్పందనలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్, జేసీ, డీఆర్వో, ఆర్డీవో
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: స్పందనలో వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రంజిత్బాషా సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం వివిధ విభాగాల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అర్జీలు సరిగా పరిష్కరించకుంటే రీఓపెన్ చేయాల్సిన అవసరం వస్తోందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అలా చేయాల్సి వస్తే అందుకు గల కారణాలను సంబంధిత అధికారి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రామదర్శినిలో గుర్తించిన సమస్యలు, తనిఖీ నివేదికలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి బుధవారం స్పందన, గ్రామదర్శిని కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈ రెండు అంశాల్లో వచ్చే సమస్యలు పరిష్కరిస్తే దాదాపుగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉండదని పేర్కొన్నారు. అన్ని శాఖలకు సంబంధించి స్పందనలో వస్తున్న అర్జీలను పరిశీలించి, ఏయే సమస్యలపై ఎక్కువగా వస్తున్నాయనే విషయం గుర్తించి నివేదిక ఇవ్వాలని జడ్పీ సీఈవోను ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించి రీఓపెన్ అర్జీలపై తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాలని డీఆర్వోకు సూచించారు. జేసీ అపరాజితసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ.కిషోర్లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
వినతులు వెల్లువ: * పదిహేడేళ్ల కిందట జీఎన్ఎం కోర్సు పూర్తి చేసి కొవిడ్ సమయంలో తాత్కాలికంగా పనిచేశామని, ఇంటర్న్షిప్ లేని కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రతిభ, భారతి, సుజాత తదితరులు వినతిపత్రం ఇచ్చారు.
* పెనమలూరుకు చెందిన సుధీర్ తమ గ్రామంలో రహదారిని ఆక్రమించి వ్యవసాయ భూమిలో కలిపేశారని, విచారించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరారు.
* బోయ కులస్థులతో పాటు ఇతర కులాలకు చెందిన వారిని ఎస్టీల్లో చేర్పించే ప్రయత్నాలు విరమించుకోవాలని జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలువురు అర్జీలు సమర్పించారు.
లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి: టిడ్కో గృహ లబ్ధిదారులకు రుణాల మంజూరును వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్బాషా బ్యాంకు అధికారులను కోరారు. కలెక్టర్ బంగ్లా నుంచి టెలికాన్ఫరెన్స్లో బ్యాంకు అధికారులు, కోఆర్డినేటర్లతో టిడ్కో గృహ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. గుడివాడలో ముఖ్యమంత్రి చేతుల మీదగా గృహాలను అందించే కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకూ 4,828 మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వడంతో పాటు గృహాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయడం ప్రశంసనీయమన్నారు. ఈనెల 10 లోపు మిగిలిన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మెప్మా పీడీ విశాలాక్షి, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయిరాం, తదితర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే విజయవాడ పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్ కల్యాణ్
[ 10-05-2024]
‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది. -
బతుకు బండిపై.. పెట్రో మంట!
[ 10-05-2024]
ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట -
గన్నవరంలో చంద్రబాబు పర్యటన నేడు
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం గన్నవరంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. -
కూటమితోనే అభివృద్ధి
[ 10-05-2024]
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
[ 10-05-2024]
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్మిశ్రా అధికారులకు సూచించారు. -
చేష్టలుడిగిన నేత
[ 10-05-2024]
చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం -
ప్రభుత్వ మార్పుతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 10-05-2024]
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రగతి, మంచితనానికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కోరారు. -
కూటమికే మా మద్దతు
[ 10-05-2024]
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మద్దతు ఎన్డీయే కూటమికేనని సంఘ రాష్ట్ర కార్యదర్శి బీఆర్ ఆంజనేయులు అన్నారు. -
కూటమిదే పీఠం
[ 10-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. -
రూపాయి ఇవ్వలేదు రూపుమారలేదు
[ 10-05-2024]
మచిలీపట్నం కలెక్టరేట్ పరిధిలో ఆర్డీవో కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో ఆధునిక వసతులతో భవనం నిర్మించాలని నిర్ణయించడంతోపాటు రూ.2.25కోట్లు కేటాయించారు.2018 సెప్టెంబరు 28న పనులు ప్రారంభించారు. -
సాధారణ కాన్పులో 4 కిలోల బిడ్డ జననం
[ 10-05-2024]
గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతలనర్వకు చెందిన మేరీజోస్కు సాధారణ కాన్పులో 4 కిలోల బరువుతో బాబు జన్మించినట్లు వైద్యాధికారులు వి.శ్రుతి, భార్గవి గురువారం తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్