ఇదేం లెక్క..?
బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి చెందిన రైతు మొవ్వ వెంకటేశ్వరరావు 30 ఎకరాల్లో స్వర్ణ రకం వరి సాగు చేశారు.
దిగుబడి 45.. కొనుగోలు 34 బస్తాలే..!
అన్నదాతలకు నిబంధనాలు
ఈనాడు, అమరావతి
బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి చెందిన రైతు మొవ్వ వెంకటేశ్వరరావు 30 ఎకరాల్లో స్వర్ణ రకం వరి సాగు చేశారు. 10 ఎకరాలు కోత కోసి నూర్పిడి చేశారు. ఎకరానికి సగటున 45 బస్తాల ధాన్యం దిగుబడి రానుంది. ఆర్బీకే లో సంప్రదిస్తే.. ఎకరానికి 26 క్వింటాళ్ల చొప్పున(34 బస్తాలు) కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ క్రాప్ నమోదు ప్రకారం ఎకరానికి అంతే దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎక్కువ దిగుబడి వస్తే.. తమకు సంబంధం లేదని చెబుతున్నారు. 30 ఎకరాలకు ఎకరానికి 11 బస్తాల చొప్పున అదనంగా 330 బస్తాలు ధాన్యం మిగిలిపోతోంది. దీన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని రైతు వాపోతున్నారు.
* కానుమోలు గ్రామానికి చెందిన జి.ఉమామహేశ్వరరావు 35 ఎకరాల్లో సాధారణ రకం వరి సాగు చేశారు. ఆయన 13 ఎకరాల ధాన్యం కల్లాల్లో ఆరబోశారు. 40 నుంచి 42 బస్తాల వరకు దిగుబడి రానుంది. ప్రభుత్వం 34 బస్తాల చొప్పున మాత్రమే కొనుగోలు చేయనుంది. మిగిలిన ధాన్యం వేరే సర్వే నెంబరుతో ఇతర రైతుల పేరుమీద విక్రయించాలి. లేదా ప్రైవేటు వ్యాపారులకు అమ్మాల్సిన పరిస్థితి.
కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి.. అన్నట్లు ధాన్యం రైతుల పరిస్థితి తయారైంది. ప్రభుత్వం రకరకాల నిబంధనలు రైతులకు కాళ్ల సంకెళ్లుగా మారాయి. వ్యాపారులు కొనుగోలు చేయక ఇటు ప్రభుత్వం సక్రమంగా సేకరించలేక అన్నదాతలను అవస్థలకు గురి చేస్తున్నారు. ఈ ఏడాది ధాన్యం దిగుబడులు పెరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో సగటున 40 బస్తాలు(75 కేజీల చొప్పున), కృష్ణా జిల్లాలో 45 బస్తాల చొప్పున దిగుబడులు వస్తున్నాయి. అధికారులు మాత్రం ఎకరానికి 34 బస్తాల దిగుబడి నిర్ణయించారు. ఏ లెక్కన ఈ అంచనా వేశారో తెలియదు. దీంతో ఆర్బీకేల్లో ఎకరానికి 34 బస్తాల చొప్పునే కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. 5 ఎకరాల విస్తీర్ణం ఉంటే 170 బస్తాలు మాత్రమే ఆన్లైన్లో నమోదుకు అనుమతి ఉంది. అంతకంటే ఎక్కువుంటే తీసుకోదు. తక్కువ ఉంటే ఫరవాలేదు. ఈ నిబంధనలతో రైతుల వద్ద భారీగా ధాన్యం మిగిలిపోనుంది. దీంతో ప్రైవేటు వ్యాపారులే మళ్లీ దిక్కవుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి.
మరోవైపు తుపాను హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
* ఆర్బీకేలలో ధాన్యం తేమశాతం 17 శాతం ఉండాల్సిందేనని నిబంధన విధిస్తున్నారు. తీరా ఆరబెట్టి విక్రయించిన ధాన్యం మిల్లులకు కేటాయించిన తర్వాత తేమ శాతం ఎక్కువ ఉందని సమాచారం ఇస్తున్నారు. 19 శాతం నుంచి 20 శాతం ఉంటుందని, ఆ మేరకు తరుగు తీస్తున్నామని చెబుతున్నారు. రైతులు అంగీకరించకపోతే.. ధాన్యం వెనక్కి పంపుతామని మిల్లర్లు హెచ్చరిస్తున్నారు.
* ఒకసారి ఆర్బీకే అధికారులు తేమ శాతం పరిశీలించి పరీక్షించిన తర్వాత తేడా వస్తే రైతుకు సంబంధం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 75 కేజీల బస్తాకు.. సంచి బరువు కిలో, తరుగు 2 కిలోల చొప్పున 3 కిలోల ధాన్యం మినహాయిస్తున్నారు.
* పెద్ద రైతులు తమ ధాన్యం తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల ఈ క్రాప్లో వరిగా నమోదు చేసిన బంజర్లను చూపించి విక్రయాల్లో అక్రమాలకు తెరలేపుతున్నారు. ఎక్కువ శాతం కౌలు రైతులు ఈ దిగుబడి నిబంధనలతో నష్టపోవాల్సిన పరిస్థితి వస్తోంది.
వాస్తవ లెక్కలు తీయాలి..
జములయ్య, అధ్యక్షుడు, కౌలు రైతుల సంఘం
అధికారులు ఏ లెక్కన దిగుబడి అంచనా వేశారో తెలియడం లేదు. డెల్టా పరిధిలో 45 బస్తాల దిగుబడి వస్తోంది. మెట్టప్రాంతంలో 40 బస్తాలు తక్కువ కాకుండా ఉంది. కానీ ఎకరానికి 34 బస్తాలే కొంటామని చెప్పడం దారుణం. ఎంత పండితే.. అంత కొనుగోలు చేయాలి. గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఎంత దిగుబడి వస్తుందో లెక్కలు తీయాలి. రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఈక్రాప్లో దిగుబడి అంచనా మార్చి కనీసం 40 బస్తాలు కొనుగోలు చేయాలి. తేమ శాతం కూడా సడలించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!