logo

నిర్మాణం నిలిపివేయడం దారుణం: కేశినేని

విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయకుండా నిలిపివేయడం దారుణమని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు.

Published : 21 Jan 2023 02:38 IST

భవానీపురం, న్యూస్‌టుడే: విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయకుండా నిలిపివేయడం దారుణమని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఈనెల 10న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘చేతులెత్తేశారు’ కథనానికి ఎంపీ స్పందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావుకు లేఖ రాశారు.  పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నూతన భవనం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నిర్మాణానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ఎన్‌జీవోలు, ట్రస్ట్‌లు  సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే తన ఎంపీ లాడ్స్‌ నుంచి నిధులను కేటాయిస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని