ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ చేసి బాలికకు వేధింపులు
ఓ బాలికకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్చేసి అసభ్య పోస్టులతో వేధింపులకు గురిచేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు రిమాండుకు తరలించారు.
నిందితుడి అరెస్టు
హైదరాబాద్: ఓ బాలికకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్చేసి అసభ్య పోస్టులతో వేధింపులకు గురిచేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు రిమాండుకు తరలించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన గౌరనేని మనోజ్(27) మెకానికల్ ఇంజినీరింగ్ 3వ సంవత్సరం వరకు చదివాడు. చెడు తిరుగుళ్లకు అలవాటు పడటంతో పెద్దలు మధ్యలోనే మాన్పించేశారు. అయినా పోర్న్ సైట్లు చూస్తూ... తనకు తెలిసిన సాంకేతిక విద్యతో ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేయడమెలాగో తెలుసుకున్నాడు. నకిలీ పేర్లతో అనేక ప్రొఫైల్స్ సృష్టించి యువతులకు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపేవాడు. 2021 డిసెంబరులో నగరానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఇతను పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను అంగీకరించింది. దీంతో ఆమెకు ఓ ఫిషింగ్ లింక్ను పంపాడు. అదేంటో తెలుసుకోకుండానే ఓపెన్చేసిన సదరు బాలిక తన వివరాలన్నీ అందులో పొందుపరిచింది. తద్వారా ఆమె ఇన్స్టాగ్రామ్ యూజర్నేమ్, పాస్వర్డ్ మనోజ్కు తెలిసిపోయాయి. ఆ ఖాతాను తన ఆధీనంలోకి తీసుకుని పాస్వర్డ్ను మార్చేసిన మనోజ్... ఆమె ఫొటోలు డౌన్లోడ్ చేసుకుని వ్యభిచారిణిలా సృష్టిస్తూ ఆమె ఖాతాలోనే అసభ్యంగా కామెంట్లు పెట్టి వేధించసాగాడు. వేరొక స్నేహితురాలి ప్రొఫైల్ నుంచి ఫోనుచేసి అతనిని నిలదీయగా... నగ్నంగా వీడియో కాల్ చేస్తే ఆ ఫొటోలను తొలగిస్తానని.. లేదంటే అసభ్యంగా మార్ఫింగ్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేశారు. ఇది తెలుసుకున్న మనోజ్ తన సెల్ఫోనుతోపాటు సిమ్కార్డులను కాల్చేశాడు.. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు అతడు హ్యాక్చేసిన ఐపీ నంబరును సంపాదించారు. సెల్ఫోను సిమ్ కార్డులను కాల్చేసినా.. నిందితుడి జాడను కనిపెట్టి అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!