logo

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మండలంలోని పరిటాల సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Published : 25 Mar 2023 04:14 IST

లక్ష్మణరావు (పాత చిత్రం)

కంచికచర్ల, న్యూస్‌టుడే: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై మండలంలోని పరిటాల సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నేలమర్రుకు చెందిన తూము లక్ష్మణరావు(33) మరొకరితో కలిసి ఈ నెల 21న తెలిసిన వారి పుట్టినరోజు వేడుకలకు బైక్‌పై హైదరాబాద్‌ వెళ్లారు. తిరిగి 23వ తేదీ రాత్రి హైదరాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున పరిటాల సమీపానికి రాగానే నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌ అదుపుతప్పి అతను రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్సు సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి క్షతగాత్రుడ్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. లక్ష్మణరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని