రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మండలంలోని పరిటాల సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
లక్ష్మణరావు (పాత చిత్రం)
కంచికచర్ల, న్యూస్టుడే: పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మండలంలోని పరిటాల సమీపంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నేలమర్రుకు చెందిన తూము లక్ష్మణరావు(33) మరొకరితో కలిసి ఈ నెల 21న తెలిసిన వారి పుట్టినరోజు వేడుకలకు బైక్పై హైదరాబాద్ వెళ్లారు. తిరిగి 23వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున పరిటాల సమీపానికి రాగానే నిద్రమత్తులో డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ అదుపుతప్పి అతను రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్సు సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి క్షతగాత్రుడ్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. లక్ష్మణరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేన ఉమ్మడి కార్యాలయం ప్రారంభం
[ 10-05-2024]
శ్రీకాకుళంలో జనసేన పార్టీ ఉమ్మడి కార్యాలయాన్ని తెదేపా నాయకులు ప్రారంభించారు. -
మీ ఆస్తులకు భద్రత కావాలంటే కూటమిని గెలిపించాలి: చంద్రబాబు
[ 10-05-2024]
తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
అందుకే విజయవాడ పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్ కల్యాణ్
[ 10-05-2024]
‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది. -
బతుకు బండిపై.. పెట్రో మంట!
[ 10-05-2024]
ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట -
గన్నవరంలో చంద్రబాబు పర్యటన నేడు
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం గన్నవరంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. -
కూటమితోనే అభివృద్ధి
[ 10-05-2024]
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
[ 10-05-2024]
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్మిశ్రా అధికారులకు సూచించారు. -
చేష్టలుడిగిన నేత
[ 10-05-2024]
చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం -
ప్రభుత్వ మార్పుతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 10-05-2024]
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రగతి, మంచితనానికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కోరారు. -
కూటమికే మా మద్దతు
[ 10-05-2024]
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మద్దతు ఎన్డీయే కూటమికేనని సంఘ రాష్ట్ర కార్యదర్శి బీఆర్ ఆంజనేయులు అన్నారు. -
కూటమిదే పీఠం
[ 10-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. -
రూపాయి ఇవ్వలేదు రూపుమారలేదు
[ 10-05-2024]
మచిలీపట్నం కలెక్టరేట్ పరిధిలో ఆర్డీవో కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో ఆధునిక వసతులతో భవనం నిర్మించాలని నిర్ణయించడంతోపాటు రూ.2.25కోట్లు కేటాయించారు.2018 సెప్టెంబరు 28న పనులు ప్రారంభించారు. -
సాధారణ కాన్పులో 4 కిలోల బిడ్డ జననం
[ 10-05-2024]
గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతలనర్వకు చెందిన మేరీజోస్కు సాధారణ కాన్పులో 4 కిలోల బరువుతో బాబు జన్మించినట్లు వైద్యాధికారులు వి.శ్రుతి, భార్గవి గురువారం తెలిపారు