logo

బాలికపై వివాహితుడి అఘాయిత్యం

ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలికపై ఇంటి పక్కనే నివాసం ఉండే వివాహితుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 31 Mar 2023 04:55 IST

వత్సవాయి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలికపై ఇంటి పక్కనే నివాసం ఉండే వివాహితుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా బాధితురాలు కడుపునొప్పితో బాధపడుతుండగా బుధవారం ఆమెను జగ్గయ్యపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షలు చేసి ఐదో నెల గర్భిణి అని డాక్టర్‌ చెప్పారు. దీనిపై తల్లిదండ్రులు ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తుండగా.. బాలిక ఇంటి వద్దే ఉండేది. దీనిని ఆసరాగా తీసుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను ఏదో ఒక పనిపై పిలిచి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నట్లు, కొన్ని నెలలుగా పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని తేలింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న వత్సవాయి పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం ఆమెను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని