అరకొరగానే పాఠ్యపుస్తకాలు
విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా విద్యా, వసతి దీవెనలు తల్లుల ఖాతాలకు జమచేస్తున్నామంటూ పదేపదే చెబుతున్న పాలకులు ఏటా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా వారి భవిష్యత్తో చెలగాటమాడుతున్నారు.
ఇంటర్ విద్యార్థులకు తప్పని అవస్థలు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే
విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా విద్యా, వసతి దీవెనలు తల్లుల ఖాతాలకు జమచేస్తున్నామంటూ పదేపదే చెబుతున్న పాలకులు ఏటా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా వారి భవిష్యత్తో చెలగాటమాడుతున్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది అందించాల్సిన పాఠ్యపుస్తకాల విషయాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. గత సంవత్సరం పాఠ్యపుస్తకాలు లేకుండానే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాల్సిన దుస్థితి నెలకొంది.
తెలుగు అకాడమీ ద్వారా ఏటా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటర్ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తూ వస్తున్నారు. కరోనా సమయంలో పుస్తకాల సరఫరాలో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో అత్యధికశాతం మంది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది జిల్లాలోని ఎనిమిది జూనియర్ కళాశాలల్లో దాదాపు 1000 మంది పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. కొన్ని కళాశాలలో అధ్యాపకులే చొరవ తీసుకుని పూర్వ విద్యార్థుల నుంచి సేకరించిన వాటితో విద్యాబోధన సాగించారు. ప్రైవేటు కళాశాలల్లో ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ ఇచ్చి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తుండగా ప్రభుత్వ కళాశాలల్లో పాఠ్యపుస్తకాలే లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇవ్వాల్సిన పుస్తకాలు లేకుండానే ఇప్పటికి మూడు బ్యాచ్ల వరకూ పరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది. కళాశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే అందుబాటులో ఉండాల్సిన పుస్తకాలు అతీగతీ లేకుండా పోయాయి.
ఆర్భాటానికే పరిమితమైన హైస్కూల్ ప్లస్
విద్యావ్యవస్థలో సంస్కరణల పేరుతో గత ఏడాది ప్రభుత్వం మండలానికి ఒక్కటి చొప్పున జిల్లాలో 24 చోట్ల హైస్కూల్ ప్లస్ ప్రారంభించారు. విద్యాశాఖాధికారుల ఒత్తిడితో పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని బలవంతంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేర్పించారు. వారికి విద్యాబోధన చేసేందుకు అనుభవజ్ఞలైన అధ్యాపకులు లేకపోగా పాఠ్యపుస్తకాలు సక్రమంగా వారికి అందలేదు. మొత్తం 221 మంది పరీక్షకు హాజరైతే కేవలం 31 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యాసోపానానికి తొలిమెట్టుగా ఉండే ఇంటర్ విషయంలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇవ్వలేని ప్రభుత్వం వారి భవిష్యత్కు ఏమి భరోసా ఇవ్వగలదంటూ పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
తర్జన భర్జనలతో కాలయాపన
పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవలే జిల్లా వారీగా అరకొరగా పాఠ్యపుస్తకాలు పంపించారు. అధికారులు పెట్టిన ఇండెంట్ మేరకు మిగిలినవి ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చిన వాటిని హైస్కూల్ ప్లస్ విద్యార్థులకు కేటాయించాలన్న సూచన మేరకు వాటిని ఎవరికీ ఇవ్వకుండా భద్రపర్చారు. ఇప్పటికే ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమై పది రోజులు అవుతోంది. హైస్కూల్ ప్లస్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారన్న విషయంలో నేటికీ స్పష్టత లేదు.ఇవన్నీ తేలేవరకూ వచ్చిన వాటిని పంపిణీ చేయరు. త్వరలో ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి. వారికి సైతం పుస్తకాలు వస్తాయా రావా అన్న అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ విద్యాసంవత్సరంలోనూ విద్యార్థులకు ఏమేరకు పుస్తకాలు ఇస్తారన్న అంశం ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను ‘న్యూస్టుడే’ ప్రశ్నించగా గత ఏడాది సరఫరా లేదని, ప్రస్తుతం కొంత మేర వచ్చినా అవి ప్లస్ టూకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందన్నారు. మిగిలినవి త్వరలో వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక