Vijayawada: ఆర్పీలకు కుక్కర్లు.. చీరలు
విజయవాడ మధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలంపల్లి తాయిలాల పరంపర కొనసాగుతోంది. ఇంటింటికీ ఎన్నికల ప్రచారం ముసుగులో తాయిలాలను విచ్చలవిడిగా పంచుతున్నారు.
కొనసాగుతున్న వెలంపల్లి తాయిలాల పంపిణీ
డ్వాక్రా గ్రూపులే లక్ష్యంగా పన్నాగం
ఓటర్లను ప్రభావితం చేసే ఉద్యోగులందరికీ ఎర
పాయకాపురంలో కుక్కర్లు తీసుకుని వెళ్తున్న వాలంటీర్లు (పాతచిత్రం)
ఈనాడు, అమరావతి, గవర్నర్పేట, న్యూస్టుడే: విజయవాడ మధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలంపల్లి తాయిలాల పరంపర కొనసాగుతోంది. ఇంటింటికీ ఎన్నికల ప్రచారం ముసుగులో తాయిలాలను విచ్చలవిడిగా పంచుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే.. ప్రతి ఉద్యోగికి గృహోపకరణాలు, చీరలు లాంటివి ఎరవేస్తున్నారు. ఇప్పటికే సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు కుక్కర్లను పంచుతూ అడ్డంగా దొరికారు. తాజాగా డ్వాక్రా మహిళా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్పర్సన్(ఆర్పీ)లకు తాయిలాలను ఎరవేస్తున్నారు. మధ్య నియోజకవర్గ పరిధిలో 400 మంది ఆర్పీలు ఉండగా ప్రతి ఒక్కరికీ కుక్కరు, చీర పంపిణీ ఆరంభించారు. డివిజన్ల వారీగా పంపిణీ బాధ్యతలను కొంత మంది కార్పొరేటర్లు, వైకాపా నేతలకు అప్పగించారు. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో ఈ పంపిణీ జరుగుతున్నట్టు సమాచారం. కొందరు కార్పొరేటర్లకు సంబంధించిన కార్యాలయాలు, ఎవరికీ అనుమానం రాని కొన్ని ఇళ్లలో ఈ తాయిలాలను ఉంచి అక్కడి నుంచి ఒక్కొక్కరికీ అందిస్తున్నారు. సింగ్నగర్లోని 59, 61, 64 డివిజన్లలోని ఆర్పీలకు గురువారం తాయిలాలు అందజేసినట్టు సమాచారం.
మధ్య నియోజకవర్గంలో 96 సచివాలయాలు ఉండగా వాటిలో వెయ్యి మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. మరో 1500 మంది వలంటీర్లున్నారు. వీళ్లందరికీ కుక్కర్లను పంపిణీ చేశారు. వారితో సమావేశాలను నిర్వహించి రూ.1500కు పైగా విలువ చేసే కుక్కర్లను మినీ వ్యాన్లలో తీసుకొచ్చి మరీ పంచారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో నియోజకవర్గ ఎన్నికల అధికారిగా ఉన్న విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ స్పందించి.. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందట నగర పోలీసు కమిషనర్కు లేఖ రాశారు. తెదేపా ఆధ్వర్యంలోనూ సత్యనారాయణపురం, నున్న పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసినా తీసుకోలేదు. దీంతో రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు పంపించారు. కానీ పోలీసులు ఇప్పటికీ దీనిపై ఒక్కచోట కూడా కేసు నమోదు చేయలేదు. తాయిలాల వ్యవహారం ఫొటోలతో సహా బయటకొచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం మరింత బరితెగించి కుక్కర్లతో పాటు చీరలను కూడా ఆర్పీలకు పంచుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఎక్కడా విషయం బయటకు రాకుండా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు.
రహస్య ప్రదేశాల్లో దాచి..
మధ్య నియోజకవర్గంలోని వేల మంది డ్వాక్రా గ్రూపు సభ్యులే లక్ష్యంగా తాజాగా తాయిలాలను ఎరవేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పించడం, వారి వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడంలో బుక్ కీపర్లుగా వ్యవహరించేది రిసోర్స్పర్సన్లే. అధికార పార్టీ సభలు, సమావేశాలకు డ్వాక్రా మహిళలను సమీకరించడంలోనూ ఆర్పీలే కీలకంగా ఉంటారు. వీరిని చెప్పు చేతల్లో ఉంచుకుంటే వేల మంది డ్వాక్రా మహిళలను ప్రభావితం చేయొచ్చు. అందుకే ఆర్పీలే లక్ష్యంగా తాజాగా వెలంపల్లి వర్గం తాయిలాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ముందుగా ఆర్పీలకు ఇచ్చాక, వారి ద్వారా డ్వాక్రా మహిళలందరికీ తాయిలాలు ఎరవేయాలని పన్నాగం పన్నుతున్నట్లు తెలిసింది. వన్టౌన్లోని కొన్ని హోల్సేల్ దుకాణాల నుంచి వీటిని పెద్దఎత్తున కొనుగోలు చేసి మధ్య నియోజకవర్గంలోని రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచి పంచుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు