ఎర్రకట్ట విస్తరణ ఎప్పుడో?
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది.
విస్మరించిన పాలకులు
కార్యరూపం దాల్చితే అందరికీ మేలు
దెబ్బతిన్న రైల్వే వంతెన
చిట్టినగర్, న్యూస్టుడే: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది. ఎందరో వాహన చోదకులు, ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేందుకు గొల్లపూడి బైపాస్ నుంచి సొరంగం, ఎర్రకట్ట రహదారి సులువైన మార్గం. దీనిని విస్తరిస్తే నగరంలోకి ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. పైగా ప్రమాదాల నివారణకు చెక్ పెట్టవచ్చు. తద్వారా 20 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తెదేపా హయాంలో రూ.88 కోట్లతో అంచనా
రాష్ట్రం విడిపోయింది. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో నగరానికి బాగా రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎర్రకట్ట రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని తెదేపా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గొల్లపూడి బైపాస్ వై జంక్షన్ రోడ్డు నుంచి చిట్టినగర్ సొరంగం, ప్రైజర్పేట, ఎర్రకట్ట, కేదారేశ్వరపేట, బీఆర్టీఎస్ రోడ్డు వరకు నాలుగు వరుసల విస్తరణకు (సుమారు 5.50 కిలోమీటర్లకు) అయ్యే వ్యయం సుమారు రూ.88 కోట్లుగా 2017లో ఆర్అండ్బీ అధికారులు అంచనా వేశారు. రైల్వే, ఆర్అండ్బీ, నగరపాలక సంస్థ, నగర పోలీస్ కమిషనరేట్, గతంలో జిల్లా కలెక్టర్, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని పరిశీలించారు.
తుంగలో తొక్కిన వైకాపా ప్రభుత్వం
ఈ మార్గం మధ్యలో దెబ్బతిన్న రైల్వే వంతెనను తొలగించి, దాని స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి, 4 వరుసల రోడ్డు విస్తరణకు సౌత్ సెంట్రల్ రైల్వే అప్పటి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్, సికింద్రాబాద్ నుంచి కూడా సుముఖతం వ్యక్తమైంది. ఈ రోడ్డు పశ్చిమ, మధ్యనగరం నియోజకవర్గాలను కలుపుతుంది. ప్రజలకు నగరంలోకి సులువైన మార్గంగా ఏర్పడుతుంది. ట్రాఫిక్ తగ్గుతుంది. సుమారు 1,50,000 మందికి పైగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చు. ఈ నేపథ్యంల ఎర్రకట్ట మార్గంలో పాత రాజరాజేశ్వరీపేట అంచున విస్తరణకు అడ్డుగా ఉన్న 29 ఇళ్లను కూడా అప్పట్లో తొలగించారు. అంతే ఈలోగా 2019 ఎన్నికలు వచ్చాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కితే, స్థానిక ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావులు ఈ విస్తరణ అంశాన్ని గాలికొదిలేశారు. దీంతో అభివృద్ధి పూర్తిగా పడకేసింది. అభివృద్ధిని కాంక్షించే నాయకులను ఎన్నుకునేలా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!