‘జగన్ హయాంలో కార్మికులకు ఉపాధి కరవు’
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఉపాధి కరవైందని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో మంగళవారం
వేదికపై నెట్టెం రఘురామ్, శివనాథ్, గద్దె, బోడే తదితరులు
కరెన్సీనగర్, న్యూస్టుడే: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు ఉపాధి కరవైందని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో మంగళవారం ఆటోనగర్ అనుబంధ సంఘాలు, రవాణారంగ మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెట్టెం మాట్లాడుతూ తెదేపా చిత్తశుద్ధికి ప్రతీక అని, అటువంటి పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. జగన్ మూడు రాజధానులంటూ ఆటోనగర్లోని లక్షలాది మంది కార్మికులకు పనులు లేకుండా చేశారని వాపోయారు. జీవో 5, 6 రద్దు చేస్తామని విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. ఐలా ఎన్నికలను జగన్ గాలికి వదిలేశారని విమర్శించారు. తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ... అధికారంలోకి రాగానే ఎన్నికలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, మోటార్ కార్పెంటర్ సంఘం అధ్యక్షుడు వి.లక్ష్మీనారాయణ, ఆటోనగర్ మెకానిక్ యూనియన్ కార్యదర్శి దస్తగిరి, పెయింట్స్ సంఘం కార్యదర్శి వీరాచారి, లారీ ఓనర్స్ సంఘం అధ్యక్షుడు వై.వి.ఈశ్వరరావు, అమరావతి కార్ల సంఘం అధ్యక్షుడు దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం