AP News: ఇసుక రేవులు..ఆగని వసూళ్లు!
అవసరమున్న వారికి సకాలంలో ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థకు స్వస్తి పలికి, ఆఫ్లైన్లో రేవు దగ్గరకు వాహనంతో వెళ్లి డబ్బులు చెల్లించి ఇసుక తీసుకెళ్లేలా నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
పాలసీ మారినా కష్టాలే
వినియోగదారులకు ఎదురుచూపులు
రేవులో ఇసుకను నింపుతున్న ప్రొక్లయినర్
ఆజాద్నగర్(అనంతపురం), న్యూస్టుడే: అవసరమున్న వారికి సకాలంలో ఇసుక సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థకు స్వస్తి పలికి, ఆఫ్లైన్లో రేవు దగ్గరకు వాహనంతో వెళ్లి డబ్బులు చెల్లించి ఇసుక తీసుకెళ్లేలా నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వాహనంతో నేరుగా రీచ్లోకి వెళ్లిన వినియోగదారులు రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. రేవు నిర్వాహకులు, స్థానిక అధికార పార్టీ నేతలు, మధ్యవర్తులతో కుమ్మక్కై ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. వీరు చెప్పిన వారికే లోడ్ చేస్తుండటంతో వివాదాలు రేగుతున్నాయి.
14 చోట్ల తవ్వుతున్నా..
నూతన పాలసీ అనుసరించి రాష్ట్రంలో కాంట్రాక్టు దక్కించుకున్న జేపీ వెంచర్స్ సంస్థకు జిల్లా అధికారులు (ఏపీ ఎండీసీ) 17 రేవులు అప్పగించారు. ఇందులో 14 చోట్ల తవ్వకాలు జరుగుతున్నా.. ఏడుచోట్ల మాత్రమే పూర్తి స్థాయిలో ఇసుక అందుతోంది. అన్ని రేవుల్లో తవ్వకాలు జరగక పోవడంతో వినియోగదారులు వరుస కడుతున్నారు. దీనికితోడు స్థానికులు తమ వాహనాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చి ఇసుక అందించాలని పట్టుబడుతున్నారు. ప్రతి రేవులో కనీసం 20 వాహనాలు అందుబాటులో ఉంచుతామని ప్రైవేటు సంస్థ ఇచ్చిన మాట కూడా అమల్లోకి రాలేదు. వినియోగదారులే సమకూర్చుకోవాల్సి వస్తోంది.
మధ్యవర్తులదే హవా
రేవుల్లో మధ్యవర్తులు హల్చల్ చేస్తున్నారు. ఎవరికైనా త్వరగా ఇసుక కావాలంటే వీరిని ప్రసన్నం చేసుకుని, డిమాండ్ మేరకు డబ్బు చెల్లిస్తే వెంటనే వాహనం రేవులోకి వెళ్లి, వీలైనంత వేగంగా ఇసుక నింపుకొని బయటకు వెళ్లిపోతోంది. కనగానపల్లి మండలంలోని కోనేటిపాళ్యం రేవులో ఇటీవల లారీకి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ జేపీ ప్రతినిధులతో ట్రాక్టరు, లారీ డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఇక్కడ స్థానిక అధికార పార్టీ నాయకుడు ఒకరు కొన్ని వాహనాలను లీజుకు తీసుకుని ఇసుకను తరలిస్తున్నారు. కంపెనీ మేనేజరుతో కుమ్మక్కై జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది.
ఒక పర్మిట్పై రెండు ట్రిప్పులు
రేవుల్లో జేపీ వెంచర్ కంపెనీ ప్రతినిధులు పర్మిట్లు అందజేస్తారు. పర్మిట్లలో సదరు వాహనం ఇసుకను డెలివరీ చేయడానికి మూడు నుంచి నాలుగు గంటల వ్యవధిని అనుమతి ఇస్తున్నారు. ఈ సమయాన్ని పలువురు టిప్పరు యజమానులు ఆసరాగా తీసుకుని పర్మిట్టులో అనుమతించిన సమయంలో రెండుసార్లు ఇసుక తరలిస్తున్నారు. రెండోదఫా నింపుకొనే క్రమంలో కంపెనీ ప్రతినిధులు వాహన యాజమాన్యాలతో అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలకు పాతర
నిబంధనల ప్రకారం రేవుల్లో ఇసుక తవ్వకాలు సాయంత్రం ఆరు గంటల వరకు జరపాలి. అయితే కోనేటిపాళ్యం రేవు నుంచి జిల్లా కేంద్రంతో పాటు, బెంగళూరు ప్రాంతానికి రాత్రి సమయాల్లో టిప్పర్లలో తరలుతున్నట్లు సమాచారం. ఈ రేవులో రాత్రి వేళల్లో కూడా తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసింది. తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు తన టిప్పర్లలో రేవు నుంచి ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి. రేవుల్లో బరువు తూచే యంత్రాలు లేవు. దీంతో ఎంత పరిమాణంలో ఇసుకను తరలిస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారింది.
గాడిలో పెడతాం: రమణారావు,
డీడీ, గనులు భూగర్భశాఖ
రేవుల్లో ఇసుక నిర్వహణపై నిఘాకు మైనింగ్, రెవెన్యూ, పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. వారిని అప్రమత్తం చేస్తాం. క్షేత్రస్థాయి పరిస్థితులను మరోసారి పరిశీలిస్తాం. రేవులకు వచ్చిన వినియోగదారులకు వీలైనంత త్వరగా ఇసుక లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ విలువ రూ.4,080 కోట్లు
[ 02-05-2024]
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. బార్లు బార్లా తెరిచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. -
ఇస్తే సులభం.. కుట్ర చేస్తే కష్టం
[ 02-05-2024]
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సులభం కాదని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వల్లె వేసిన మాటలు బూటకమని తేలింది. బ్యాంకు ఖాతాలు లేని 1.13 లక్షల మందికి తొలిరోజే ఇంటివద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేయడమే ఇందుకు నిదర్శనం. -
ఈవీఎంలపై అపోహలు వద్దు
[ 02-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పనితీరుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. పక్కా సాఫ్ట్వేర్తో తయారు చేసినట్లు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్కుమార్, ఎన్నికల పరిశీలకులు అజయ్నాథ్ ఝు, మనీష్ సింగ్ తెలిపారు. -
కానుకలు ఎత్తివేత.. సరకుల్లో కోత
[ 02-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో పండగలు వస్తే పేదలంతా పిండివంటకాలతో సంతోషంగా గడిపేవారు. ఏటా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్కు కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఏటా క్రమం తప్పకుండా తెదేపా సర్కారు అందించింది. -
కొండను కొల్లగొట్టారు
[ 02-05-2024]
పామిడి మండలంలోని వంకరాజుకాలువ, నెమళ్లపల్లి గ్రామ కొండల్లో నుంచి ఎర్రమట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. తాత్కాలిక అనుమతి పత్రాలు ఉన్నాయంటూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. రోజూ ఇరవై టిప్పర్ల వరకు మట్టిని తరలిస్తున్నారు. -
అధికార పక్షానికి పోలీసులు దాసోహం
[ 02-05-2024]
ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు తెగపడుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. దాడులపై ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదు. -
ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి ఓటమి భయం : సునీత
[ 02-05-2024]
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ఆయన సోదరులతో సొంత పార్టీ నాయకులనే బెదిరింపులు, వేధింపులతో ఇబ్బందులు పెడుతున్నారని, నియోజకవర్గంలో చాలాచోట్ల వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
తెదేపాతోనే మహిళల సంక్షేమం
[ 02-05-2024]
మహిళలు అభివృద్ధి పథాన నడవాలన్నా, వారు సంక్షేమాన్ని సమర్థంగా అందుకోవాలన్నా తెదేపాతోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
వైకాపా అరాచక పాలనను సాగనంపుదాం
[ 02-05-2024]
అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదామని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. -
ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుదాం
[ 02-05-2024]
వైకాపా అవినీతి, అక్రమాల పాలనకు అంతం పలకాలని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని కెంచానపల్లి, జుంజురాంపల్లి, బీఎన్హళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. -
వైకాపా ప్రచారానికి వెళ్తున్న కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
[ 02-05-2024]
వైకాపా ప్రచారానికి వెళ్తున్న ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రామ్భూపాల్ వివరాల మేరకు.. శెట్టూరు మండలం కనుకూరుకు చెందిన ఓబన్న, భార్య నాగమణి, కోడలు అనురాధ ద్విచక్ర వాహనంలో కళ్యాణదుర్గం వెళుతున్నారు. -
అనంతలో తెదేపా నాయకుడి అరెస్టు
[ 02-05-2024]
అనంతపురం గ్రామీణం రామకృష్ణ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ, తెదేపా నాయకుడు జయరాం నాయుడి అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టి నగేశ్పై దాడి చేయించాడనే కారణంతో వన్టౌన్ పోలీసులు బుధవారం తెల్లవారు జామున జయరాం నాయుడిని అరెస్టు చేశారు. -
తెదేపా అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ
[ 02-05-2024]
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణీ వసుంధర అన్నారు. నేడు ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, మెడలో గొలుసుల చోరీలు, వేధింపులు పెరిగి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ముస్లింల నమ్మకద్రోహి జగన్’
[ 02-05-2024]
రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు నమ్మించి మోసం చేసిన ఘనత జగన్దేనని శాసనమండలి మాజీ ఛైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ ఆరోపించారు. బుధవారం నగరం అనంత కన్వెన్షన్ హాలులో ముస్లిం, మైనారిటీలకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి