రుణాలు ఇవ్వం.. పథకాలు ఆపేస్తాం!
‘మేమంతా గుంతకల్లులో నివసిస్తున్నాం. పొదుపు సంఘంలో ఉన్నాం. చెత్తపన్ను కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.
* బలవంతంగా చెత్తపన్ను వసూలు
* చెల్లించకపోతే బెదిరింపులు
‘మేమంతా గుంతకల్లులో నివసిస్తున్నాం. పొదుపు సంఘంలో ఉన్నాం. చెత్తపన్ను కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. కూలీ చేసుకుని జీవనం సాగించేవాళ్లం. ఇప్పటికే నిత్యావసరాలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు చెత్తపన్ను రూ.60 చెల్లించడం అదనపు భారం అవుతుంది. పన్ను చెల్లించకపోతే పొదుపు సంఘంలో ఉండొద్దని చెబుతున్నారు. రుణాలు రావని బెదిరిస్తున్నారు.
ఈనాడు డిజిటల్, అనంతపురం: పట్టణవాసుల నుంచి చెత్త పన్ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. చెల్లించని కుటుంబాలను గుర్తించి సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. కొన్నిచోట్ల ఇంకాస్త ముందుకెళ్లి సామాజిక పింఛన్లలో కోత విధించి పంపిణీ చేస్తున్నారు. మెప్మాలోని సభ్యులకు చెత్తపన్ను కడితేనే రుణాలు మంజూరు చేస్తామని తేల్చి చెబుతున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వంద శాతం చెత్తపన్ను వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు పలు వార్డులు, డివిజన్లలో అధికారపార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో సిబ్బందిని రానివ్వడం లేదు.
సాధారణ నిధుల నుంచి ..జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకంలో భాగంగా అనంత నగరపాలికతోపాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు చెత్త సేకరణ వాహనాలను పంపిణీ చేశారు. ఒక్కో వార్డు సచివాలయ పరిధిలో ఒక వాహనం వినియోగించేలా ప్రణాళికలు వేశారు. ఇంకా కొన్ని వార్డులకు వాహనాలను పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన వార్డుల్లో చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. ఆ డబ్బుల నుంచే వాహనాల ఈఎంఐ చెల్లించాలని మున్సిపల్ శాఖ ఆదేశించింది. ప్రతినెలా ఒక్కో వాహనానికి రూ.62 వేలు చెల్లించాలి. ఒకవేళ ఈఎంఐకు సరిపడా చెత్తపన్ను వసూలు కాకపోతే సాధారణ నిధుల నుంచి చెల్లించాలి. అసలే నిధుల్లేక మున్సిపాలిటీలు ఇబ్బందులు పడుతున్నాయి.
వ్యతిరేకత వస్తున్నా..
చెత్తపన్నుపై అన్ని ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కొన్నిచోట్ల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ ప్రాంతంలో పన్ను వసూలు చేయవద్దంటూ అధికారుల్ని అడ్డుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి లక్ష్యాలు, మరోవైపు స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చేసేదిలేక వాలంటీర్లు, మెప్మా, ఆర్పీలతో బలవంతపు వసూళ్లకు పూనుకుంటున్నారు. అయినా ప్రజల నుంచి సానుకూలత రాకపోవడంతో సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టణ పేదలపై భారం
ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నందుకు నెలకు వినియోగ ఛార్జీల కింద రూ.60 వసూలు చేస్తున్నారు. మురికివాడల్లో మాత్రం రూ.30 పన్ను చెల్లించాలి. అపార్ట్మెంట్లలో స్థాయిని బట్టి రూ.200, హోటళ్ల నుంచి రూ.300 నుంచి రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే పట్టణ ప్రజలపై వివిధ రూపాల్లో ఆర్థిక భారం ఎక్కువైంది. గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలు, పెట్రోలు, డీజిల్, వంటనూనె ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంతో పోలిస్తే నెలవారీ ఖర్చు వందశాతం పెరిగింది. వీటికితోడు ప్రభుత్వం చెత్తపన్ను భారం వేసిందని పట్టణవాసులు వాపోతున్నారు. ఏడాదికి రూ.720 నుంచి రూ.1,200 వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పింఛను సొమ్ములో కోత
చెత్తపన్ను కడితేనే పింఛను ఇస్తామని చెబుతున్నారు. గత నెల రూ.60 వాలంటీరుకు చెల్లించా. పన్ను కడితేనే పొదుపు రుణాలు వస్తాయని చెబుతున్నారు. ప్రతి నెలా సొమ్ము కట్టించుకుంటున్నా పారిశుద్ధ్యం మాత్రం అధ్వానంగా ఉంది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. మాలాంటి పేదలు ఎలా బతకాలి. ప్రభుత్వం పునరాలోచించాలి. - సరోజమ్మ, మొదినాబాదు
పన్ను చెల్లించాల్సిందే
చెత్తపన్ను చెల్లించకపోతే పథకాలు రద్దు చేస్తామని చెబుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. గత నెలలోనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు విచారణ జరిపాం. క్షేత్రస్థాయిలో మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు బలవంతం చేయడం లేదు. నిబంధనల మేరకు చెత్త సేకరణ జరుగుతున్న కాలనీవాసులు పన్ను చెల్లించాల్సిందే.
నాగరాజు, మున్సిపల్ ఆర్డీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఉద్యోగులకు తప్పని ఇక్కట్లు
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. రెండో రోజు కూడా అస్తవ్యస్తం, గందరగోళం కనిపించింది. సంబంధిత ఆర్వోలు నిర్దేశిత వసతులు, సౌకర్యాలు కల్పించడంలో అశ్రద్ధ చూపినట్లు తేలిపోయింది. -
రాకపోకలకు నిత్య నరకం
[ 05-05-2024]
ఉమ్మడి అనంత జిల్లాలో 2022 నవంబరులో భారీ వర్షాలకు వరదలొచ్చి జనజీవనం అతలాకుతలమైంది. వంకలు, వాగులు పొంగి పొర్లడంతో నీటి ప్రవాహ ధాటికి చాలాచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. -
చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం
[ 05-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్చౌదరి, అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయులతో చెలగాటం
[ 05-05-2024]
జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ యంత్రాంగం ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతోంది. విధి నిర్వహణ పట్ల బాధ్యతా రాహిత్యం, అవగాహన లోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు బహిర్గతమైంది. -
నిరుద్యోగులకు రూ.3వేలు భృతి
[ 05-05-2024]
‘‘తెదేపా సూపర్సిక్స్ పథకాలతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో రద్దయిన సంక్షేమ పథకాలన్నీ రానున్న కూటమి ప్రభుత్వంలో పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. -
అసత్య ప్రచారం తప్ప వైకాపా చేసిందేమీ లేదు: సునీత
[ 05-05-2024]
ఐదేళ్ల మీ వైకాపా పాలనలో ఎమ్మెల్యేగా అసత్య ప్రచారాలు తప్ప నువ్వు చేసిందేమిటి ప్రకాశ్రెడ్డీ.. అని రాప్తాడు ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని పరిటాల సునీత ప్రశ్నించారు. -
కాలుపై సమాధానాలు రాసుకొచ్చిన విద్యార్థిని
[ 05-05-2024]
డిగ్రీ పరీక్షల్లో ఓ విద్యార్థిని కాలు మీద సమాధానాలు రాసుకొని పరీక్ష కేంద్రానికి హాజరైంది. గుర్తించిన ఇన్విజిలేటర్ డిబార్ చేశారు. అనంతపురం ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో ఈ మాస్కాపీయింగ్ చోటు చేసుకొంది. -
బూతులు తిడుతున్నాడని దారుణ హత్య
[ 05-05-2024]
నిత్యం బూతులు తిడుతున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవళ్లతో దాడిచేసి దారుణంగా చంపిన ఘటన కదిరి మండలం జౌకలలో జరిగింది. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
[ 05-05-2024]
మండలంలోని పాలసముద్రం, వడిగేపల్లి పంచాయతీల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి సవిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు
[ 05-05-2024]
ధర్మవరం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 2వ పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శారదానగర్లో భాజపా కార్యకర్తలు భాను, శ్రీనివాసులుపై వైకాపా వర్గీయులు శుక్రవారం రాత్రి దాడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి