నిబంధనలతో మిథ్య!
రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించిన జగనన్న విదేశీ విద్య పథకం కొందరికే పరిమితమవుతోంది. పథకంలో భాగంగా విదేశాల్లో చదివే వారికి భారీ సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా నిబంధన పేరుతో అర్హుల జాబితాలో కోత విధించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఐదుగురే ఎంపిక
పేద విద్యార్థులకు దక్కని అవకాశం
ఈనాడు డిజిటల్, అనంతపురం న్యూస్టుడే, రాణినగర్: రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించిన జగనన్న విదేశీ విద్య పథకం కొందరికే పరిమితమవుతోంది. పథకంలో భాగంగా విదేశాల్లో చదివే వారికి భారీ సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా నిబంధన పేరుతో అర్హుల జాబితాలో కోత విధించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్ కలిగిన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికే పథకం వర్తిస్తుందన్న నిబంధనతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో అనంతపురం నుంచి ఇద్దరు, శ్రీసత్యసాయి జిల్లా నుంచి ముగ్గురే ఎంపికయ్యారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో పథకం ద్వారా విద్యార్థులకు రూ.కోట్లల్లో బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు విడతల నిధుల్ని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో పెట్టింది. మూడున్నరేళ్ల అనంతరం విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించినప్పటికీ బకాయిల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
రూ.2.50 కోట్ల బకాయి...
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2018-19లో 120 మంది విద్యార్థులకు పథకం వర్తింపజేశారు. ఇందులో ఎస్సీలు 16, ఎస్టీలు 25, బీసీలు 64, మైనారిటీలు 15 మంది ఉన్నారు. వీరితోపాటు అదే ఏడాది ఈబీసీ విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి గత ప్రభుత్వంలోనే విడతల వారీగా కొంత చెల్లించగా.. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిలిపివేశారు. మైనారిటీలకు 2018-19లో రూ.75 లక్షలు, 2019-20లో రూ.35 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఎస్సీలకు రూ.15 లక్షలు, ఎస్టీలకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.1.15కోట్లు పెండింగ్లో ఉంచారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా విద్యార్థులకు రూ.2.50 కోట్లు మేర మంజూరు చేయాల్సి ఉంది.
సడలిస్తేనే మేలు..
జగనన్న విదేశీ విద్య పథకంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200లోపు క్యూఎస్ ర్యాంకు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఒకటి నుంచి వంద లోపు ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన వారికి గరిష్ఠంగా రూ.కోటి వరకు వంద శాతం ఫీజు రీయింబర్స్ చేస్తారు. 101 నుంచి 200 వరకు ర్యాంకు కలిగిన వర్సిటీల్లో సీటు తెచ్చుకుంటే రూ.50 లక్షల అందిస్తారు. ఈ నిబంధన కారణంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు అర్హత కోల్పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకటి నుంచి 500 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికి పథకాన్ని వర్తింపజేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల్లోని పేద విద్యార్థులకు విదేశీ విద్య అందించాలనేది పథకం ఉద్దేశం. ఈ నేపథ్యంలో నిబంధనను సడలించి ఎక్కువ మంది అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ విదేశీ విద్య పథకం ఉండేది. ఏ విశ్వవిద్యాలయంలో చదివినా పథకాన్ని వర్తింపజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి దాదాపు 150 మంది దాకా విద్యార్థులు లబ్ధి పొందారు.
అప్పు తెచ్చి ఫీజు చెల్లించా..
మా అమ్మాయి రోషిత విదేశీ విద్య పథకం కింద కజకిస్తాన్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వం ఇప్పటి దాకా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫీజు చెల్లిస్తేనే భోజనం, పరీక్షకు అనుమతి ఇస్తున్నారు. పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పటి దాకా రూ.15లక్షల వరకు వడ్డీలకు తెచ్చి చెల్లించా. ఇంకా రూ.20లక్షలకు పైగానే అవుతుంది. ఫీజు ఇవ్వకుంటే వెళ్లిపోవాలంటూ బెదిరిస్తుండటంతో చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తుందేమోననే భయం వెంటాడుతోంది. ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
ఎమ్.ఆనందం, విద్యార్థిని తండ్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్