YSRCP: బరిలో నిలిచేదెవరు? బలయ్యేదెవరు?.. వైకాపా ఎమ్మెల్యేల్లో గుబులు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార వైకాపా నష్ట నివారణ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార వైకాపా నష్ట నివారణ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగులను మార్చడం ద్వారా సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ ఆరుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం.. లేదంటే మరో స్థానాన్ని కేటాయిస్తారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని గతేడాది ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఎన్నికల్లో ఎంతమేరకు ఖర్చు పెట్టుకోగలరనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. సిట్టింగులకు విజయావకాశాలు లేవని ఐప్యాక్ ఇచ్చిన సర్వే ఆధారంగా మరికొందరిని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సొంతపార్టీ వారే తిరుగుబాటు
మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఆయన్నే బరిలోకి దింపితే ఓడిపోవడం ఖాయమని అధిష్ఠానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేపై సొంతపార్టీ ప్రజాప్రతినిధులే తిరుగుబాటు చేయడంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతూ వస్తోంది. వైకాపా నాయకులే ఎమ్మెల్యేపై ఆవినీతి ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరో వ్యక్తికి టికెట్ కేటాయించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు వైకాపాకు చెందిన కొందరు చెబుతున్నారు. తిప్పేస్వామిని బుజ్జగించడానికి ఇటీవల తితిదే పాలక మండలి సభ్యుడిగా నియమించారనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది.
సిద్ధారెడ్డికి అనుమానమే..
కదిరి నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండటంతో ఆ వర్గానికే టికెట్ కేటాయించాలనే యోచనలో వైకాపా పెద్దలు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పూల శ్రీనివాస్రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. హిందూపురంలో ఇక్బాల్ను మార్చడంతో వైకాపా నుంచి జిల్లాలో ముస్లింలకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈనేపథ్యంలో ముస్లింలకు కేటాయిస్తారనే చర్చ నడుస్తోంది.
శింగనమలలో పోలీసు అధికారి?
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమే అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే భర్త, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తుండటం, సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. యల్లనూరు, పుట్లూరు మండలాల్లో సొంతపార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈక్రమంలో ఈసారి కొత్తవారికి టికెట్ కేటాయించాలని అధిష్ఠానం భావిస్తోంది. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఓ డీఎస్పీకి శింగనమల టికెట్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది.
శంకరనారాయణకు స్థానచలనం?
మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణను నియోజకవర్గంలోని ఓ సామాజికవర్గం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికేతరుడు కావడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే సోదరులపై అవినీతి ఆరోపణల కారణంగా గోరంట్ల, పరిగి మండలాల్లో పరిస్థితి మరింత దిగజారిపోయింది. పెనుకొండ నుంచి కాకుండా హిందూపురం ఎంపీగా బరిలోకి దింపుతారని తెలుస్తోంది. ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి కారణంగా ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వకపోవచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచే వస్తోంది.
రాయదుర్గం రంగయ్యకేనా..
రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వైకాపాలో వర్గపోరు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలని అధిష్ఠానం ఆలోచిస్తోంది. రాయదుర్గంలో వాల్మీకులు అధిక సంఖ్యలో ఉండటంతో ఎంపీ రంగయ్యను అక్కడికి పంపాలనే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో కాపు రామచంద్రారెడ్డి డి.హీరేహాళ్కు చెందిన ఓ వాల్మీకి నాయకుడి పేరును పార్టీ పెద్దల ముందు ఉంచగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
గుంతకల్లులో మార్పు తప్పదా..
ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి కుటుంబంలో ఇప్పటికే ఐదుగురికి పదవులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు టికెట్ మరో సామాజికవర్గానికి కేటాయించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే మాత్రం తన కుమార్తె నైరుతిరెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతుండటం గమనార్హం.
- ఈనాడు డిజిటల్, అనంతపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారమిచ్చినా.. నిర్లక్ష్యమే అడుగడుగునా..!
[ 27-04-2024]
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. రచ్చ సంగతి దేవుడెరుగు వారు నివాసముంటున్న ప్రాంతాలనూ గాలికొదిలేశారు వైకాపా ఎమ్మెల్యేలు. ఉమ్మడి అనంత జిల్లాలో 14 సీట్లకుగాను 12 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టడంతో ఇక తమ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయని కలలుగన్న ప్రజల ఆశలు ఐదేళ్లుగా నిరాశలయ్యాయి. -
‘అరాచక పాలన అంతం.. కూటమి పంతం’
[ 27-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా, భాజపా జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య పేర్కొన్నారు. -
రూ.50 లక్షలు.. నీళ్ల పాలు
[ 27-04-2024]
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం బుక్కరాయసముద్రం వాసుల పాలిట శాపంగా మారింది. ఈ మేజరు పంచాయతీలో 35 కాలనీల్లో 30 వేల జనాభా ఉంది. -
లోక్సభకు 21... అసెంబ్లీకి 136
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టంలో రెండో ప్రక్రియగా భావించే పరిశీలన సజావుగా ముగిసింది. ఎక్కడా పెద్దగా వివాదాలు, అభ్యంతరాలు చోటు చేసుకోలేదు. చిన్నాచితకా మౌఖిక ఫిర్యాదులు మినహా ఏ సమస్య తలెత్తలేదు. -
నెగ్గేందుకు సిగ్గులేకుండా బరితెగింపు
[ 27-04-2024]
ఓటర్లకు డబ్బు చేరవేసేందుకు అధికార వైకాపా ముందస్తుగా బరితెగించింది. తమ పార్టీ నాయకులపై ఎన్నికల యంత్రాంగం పూర్తి నిఘా ఉంటుందన్న అనుమానంతో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంటున్నారు. -
పెద్దలకు తారురోడ్డు.. పేదలకు మోకాలడ్డు!
[ 27-04-2024]
ఇక్కడ కన్పిస్తున్న పై చిత్రంలో పెద్దలు వెళ్లే రాచమార్గం.. దానిపక్కనే పేదలు వెళ్లే దారి ఉంది. నగరంలోని జన్మభూమి రోడ్డు నడిమి వంక నుంచి ప్రారంభమై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నివాసం, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నివాసం మీదుగా కోవూరునగర్ ప్రధాన రోడ్డులోకి చేరుతుంది. -
భవన నిర్మాణ కార్మిక జీవనం.. జగన్ పాలనలో ఛిద్రం
[ 27-04-2024]
రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న ఆన్లైన్ ఇసుక విధానంతో భవన నిర్మాణ కుటుంబాలను రోడ్డున పడేసింది. ఐదేళ్ల వైకాపా పాలన వారి బతుకులను ఛిద్రం చేసింది. -
చేనేతలను ఆదుకుంటాం: నిమ్మల కిష్టప్ప
[ 27-04-2024]
తెదేపా చేనేతలకు అండగా నిలుస్తోందని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. -
పయ్యావుల కేశవ్ ప్రచారంలో వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు
[ 27-04-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైకాపా నాయకులు గొడవలకు తవిచ్చేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.ఈ తరహా చర్యలకు మండలంలోని కాలువపల్లిలో శుక్రవారం వైకాపా కార్యకర్తలు పూనుకున్నారు. -
వైకాపా మోసపూరిత మాటలు నమ్మొద్దు: సునీత
[ 27-04-2024]
గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి ఎంత తప్పుచేశారో మీరే ఆలోచించాలి. ఆ తప్పు మళ్లీ చేయొద్దు. ఒక్క ఛాన్స్ అంటూ మళ్లీ మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు. -
సొంత చెల్లి చీరపైనా దిగజారుడు మాటలా?
[ 27-04-2024]
ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత చెల్లెలు ధరించిన చీర గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం జగన్ దిగుజారుడు తనానికి పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. -
నిలువ నీడేదీ జగన్?
[ 27-04-2024]
అసలే మండేఎండలు.. పట్టణంలోని బస్టాప్లలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండు పేరుకు మాత్రమే ఉండగా బస్సులన్నీ పాత బస్టాండు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. -
‘వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడదాం’
[ 27-04-2024]
వైకాపా నాయకులు ఐదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, వారి అరాచక పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మంత్రి, రాయదుర్గం నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం..
[ 27-04-2024]
ప్రజల నుంచి పన్ను కట్టించుకొంటున్నారే తప్పా అభివృద్ధి చేయలేకపోయారని, తనకు అవకాశం కల్పిస్తే కళ్యాణదుర్గాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 27-04-2024]
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం పెనుకొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆయనకు పూలమాలవేసి, శాలువాతో ఘనస్వాగతం పలికారు. -
నిండా మునిగినా.. రైతుకు తప్పని నిరీక్షణ
[ 27-04-2024]
తమది రైతు ప్రభుత్వమని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. భూగర్భ జలాలు పెంచాలనే లక్ష్యంతో 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఉమ్మడి అనంత జిల్లాలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువును హంద్రీనీవా నీటితో నింపింది. -
లోక్సభకు 9, అసెంబ్లీకి 45 నామపత్రాల తిరస్కరణ
[ 27-04-2024]
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా హిందూపురం పార్లమెంటు స్థానంతోపాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామపత్రాలను అధికారులు పరిశీలన చేశారు. -
28న ఏపీసెట్
[ 27-04-2024]
సహాచార్య ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఏపీ సెట్-2024 ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య వెంకట రమణ తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
[ 27-04-2024]
ఎస్కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో నిర్వహిస్తున్న 4వ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్థిని డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. -
ఆర్డీటీ సెట్కు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-04-2024]
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.మోహన్ మురళి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!