logo

నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు  కలెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 28 Mar 2024 04:44 IST

జిల్లా సచివాలయం: న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రాజకీయ ప్రచారంలో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు  కలెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్‌ గురైన వారిలో.. తాడిపత్రి మున్సిపాలిటీకి చెందిన ఒప్పంద ఉద్యోగులు విజయ్‌కుమార్‌, సూర్యనారాయణరెడ్డి, తిరుపాల్‌రెడ్డి, శింగనమల మండలం వెస్ట్‌ నరసాపురానికి చెందిన క్షేత్ర సహాయకుడు అంజన్‌రెడ్డి ఉన్నారు. వీరితో కలిపితే ఇప్పటి దాకా 36 మంది వాలంటీర్లు, అయిదుగురు రేషన్‌ డీలర్లు, 11 మంది ఒప్పంద ఉద్యోగులు, ఒక రెగ్యులర్‌ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని