శవాగారాల్లోనూ దోపిడీ
అనంత సర్వజనాసుపత్రిలో అనాథ, గుర్తుతెలియని మృతదేహాలను నిలవ చేయడం గగనంగా మారుతోంది. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పైసా ఇవ్వని పరిస్థితుల్లో ఈ దుస్థితి దాపురించింది.
మార్చురీలో ప్రమాదకంగా ప్యూజు బాక్సు
అనంతపురం(వైద్యం), న్యూస్టుడే: అనంత సర్వజనాసుపత్రిలో అనాథ, గుర్తుతెలియని మృతదేహాలను నిలవ చేయడం గగనంగా మారుతోంది. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పైసా ఇవ్వని పరిస్థితుల్లో ఈ దుస్థితి దాపురించింది. వీటన్నింటిని మార్చురీలో ఉన్న ఫ్రీజర్ బాక్సుల్లో నిలవ ఉంచాల్సి ఉంటుంది. అనాథ, గుర్తుతెలియని మృతదేహాల వివరాలను పోలీసులకు సమాచారం ఇస్తారు. వారు దర్యాప్తు చేసి ఇచ్చే నివేదిక ఆధారంగానే 72 గంటల్లో మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తారు. కొన్నిసార్లు పోలీసుల దర్యాప్తులో జాప్యం అవుతుండటంతో నాలుగు రోజులపాటు శవాలను మార్చురీలో భద్రపరచాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మార్చురీలో ఫ్రీజర్ బాక్సులు ఖాళీగా లేక మృతదేహాలను బయటనే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే రోజు ఎక్కువ మృతదేహాలు మార్చురీకి వచ్చిన సమయాల్లోనూ కొన్నింటిని బాక్సుల్లో ఉంచలేకపోతున్నామని ఈ క్రమంలో దుర్వాసన వస్తుండటంతో తాము ఇబ్బందులు పడుతున్నామని వైద్యులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురంలోని సర్వజన వైద్యశాలలో ఉన్న మార్చురీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రూ.12.60 లక్షలు మంజూరు చేశారు. మిగిలిన మొత్తంతో మార్చురీకి రంగులు వేయటం, ఎలక్ట్రికల్ వర్క్లు పూర్తిచేయటం, కాంపౌండ్వాల్, ఫ్రీజర్ బాక్సులు మరమ్మతులు చేయాల్సి ఉండగా సదరు గుత్తేదారు తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు పెట్టుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా ఫీజర్ బాక్సులు మరమ్మతులు చేయకనే చేసినట్లు బిల్లులు పెట్టి దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేపడితే పలు వాస్తవాలు వెలుగులోకి రావటంతో అక్రమార్కులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆ విభాగంలోని ఉద్యోగులు కోరుతున్నారు.
ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం (హెచ్డీఎస్)ను 2020,22,23 సంవత్సరాల్లో మొత్తంగా మూడుసార్లు మాత్రమే నిర్వహించారు. హెచ్డీఎస్ సమావేశం నిర్వహిస్తే జిల్లా కలెక్టర్ ఛైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఆసుపత్రి పర్యవేక్షకుడితో పాటు పలువురు సభ్యులు, వైద్యవిభాగాల హెచ్వోడీలు పాల్గొంటారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు కమిటీ ఆమోదంతో ఆసుపత్రి అభివృద్ధి కోసం నిధులను వెచ్చించాలి. సమావేశాలే నిర్వహించకపోవటంతో పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోని పరిస్థితి నెలకొంది.
సర్వజన వైద్యశాలతో పాటు తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్లు, హిందూపురం, పెనుకొండ, కదిరి, ఉరవకొండ, గుత్తి, పామిడి, కళ్యాణదుర్గం ఏరియా ఆసుపత్రుల్లో పంచనామా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 సీహెచ్సీ కేంద్రాల్లో పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా పదికి పైగా కేంద్రాల్లో వైద్యుల నియామకం ఉన్నా శవపరీక్షలు చేసేందుకు అవసరమైన వైద్య సామగ్రి లేక శవ పరీక్షలు నిర్వహించటం లేదు.
తెల్ల వస్త్రాన్ని ఇవ్వలేరా?
మార్చురీలో పోస్టుమార్టం చేసిన మృతదేహాలకు తెల్లటి వస్త్రం అవసరం అవుతుందని ఇందుకోసం వస్త్రాన్ని మంజూరు చేయాలని కోరుతూ ఫోరెన్సిక్ విభాగం వైద్యులు పలుమార్లు ఆసుపత్రి ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. లేఖలను చూసిన అధికారులు వస్త్రాన్ని మంజూరు చేయటం లేదని ఫోరెన్సిక్ వైద్యులు చెబుతున్నారు. తెల్లటి గుడ్డను మాత్రం ఆసుపత్రి ఉన్నతాధికారులు మంజూరు చేయకపోవటంతోనే మృతుల బందువులకు గుడ్డ తెచ్చుకోమని చెబుతున్నామని ఫోరెన్సిక్ విభాగం ఉద్యోగులు తెలుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలికతో వేంకటరమణుడి నిశ్చితార్థం
[ 21-05-2024]
రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. -
ఇంటర్మీడియట్ ప్రవేశాలకు వేళాయె..
[ 21-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. -
మళ్లీ బాదుడు ..
[ 21-05-2024]
ఏరుదాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఓట్ల కోసం ఈ ఏడాది జనవరి నుంచి చెత్తపన్నును నిలిపివేసిన ప్రభుత్వం.. మళ్లీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. -
పురం పారిశ్రామికవాడల్లో నీటికి కటకట
[ 21-05-2024]
శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి కళ్యాణదుర్గం పంపింగ్ హౌస్ వద్ద నీటిని పంపింగ్ చేయాల్సిన మోటార్లు దెబ్బతినటంతో ప్రస్తుతం ఒకే మోటారు పనిచేస్తోంది. -
శాంతిభద్రతలు పర్యవేక్షించండి
[ 21-05-2024]
జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో ఆయా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు పేర్కొన్నారు. -
పాతఏరులో కబ్జాదారుల పాగా
[ 21-05-2024]
హిందూపురంలోని పరిగి రోడ్లో ఉన్న పాతఏరులో ఆక్రమణదారులు తిష్ఠవేశారు. దాదాపు పది ఎకరాలకు పైగా ఉన్న ఈఏరు సగానిపైగా కబ్జాకు గురైంది. -
రెండేళ్లయినా సొంత భవనాల్లేవ్
[ 21-05-2024]
శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటై 25 నెలలు గడుస్తున్నా జిల్లా కేంద్రమైన పుట్టపర్తి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా విడుదల చేసిన పాపానపోలేదు. -
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
[ 21-05-2024]
భాజపా జాతీయ కార్యదర్శి ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్ సోమవారం ధర్మవరం వచ్చారు. ఎన్డీయే ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ఆయనకు తెదేపా, భాజపా నాయకులు గజమాలలతో సత్కరించారు. -
ఏసీఎల్ తుదిపోరుకు ఇండియన్ సిక్సర్స్ జట్టు
[ 21-05-2024]
అనంత క్రికెట్ లీగ్ ఫైనల్కు ఇండియన్ సిక్సర్స్ జట్టు అర్హత సాధించింది. అనంత క్రీడాగ్రామంలో సోమవారం జరిగిన పోటీలో ఇండియన్ జట్టు ఫ్యామిలీ క్లబ్ జట్టును 89 పరుగుల తేడాతో చిత్తు చేసింది. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
[ 21-05-2024]
ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు. -
శ్రీరామిరెడ్డి నీటిపథకం కార్మికుల సమ్మె బాట
[ 21-05-2024]
శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు ఈ నెల 18 నుంచి సమ్మె బాట పట్టారు. జీతాలతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండు చేస్తున్నారు -
ప్రభుత్వం విస్మరించింది.. ఆర్డీటీ నిర్మించింది
[ 21-05-2024]
శిథిలమైన చెక్డ్యామ్ను పునర్నిర్మించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదు. విసిగి వేసారిన వారు ఆర్డీటీ సంస్థను సంప్రదించారు. -
అనంతలో జోరు వాన
[ 21-05-2024]
జిల్లా కేంద్రం అనంత నగరంలో సోమవారం రాత్రి జోరువాన కురిసింది. పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. పలు రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. -
తాడిపత్రి అల్లర్ల కేసులో 728 మంది నిందితులు
[ 21-05-2024]
పోలింగ్ రోజు, మరసటిరోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు 728 మందిని బాధ్యులుగా గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్