logo

న్యూస్‌టుడే విలేకరి రమేష్‌పై దాడి హేయం

ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన నేపథ్యంలో కళ్యాణదుర్గం బహిరంగసభలో న్యూస్‌టుడే విలేకరి రమేష్‌పై వైకాపా గూండాలు దాడి చేయడం అత్యంత బాధాకరమని...

Published : 10 May 2024 03:43 IST

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన నేపథ్యంలో కళ్యాణదుర్గం బహిరంగసభలో న్యూస్‌టుడే విలేకరి రమేష్‌పై వైకాపా గూండాలు దాడి చేయడం అత్యంత బాధాకరమని అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, తెదేపా రాష్ట్ర మీడియా సమన్వయకర్త బీవీ వెంకట్రాముడు ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో మీడియాపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, అధికారం పోతుందనే అక్కసుతో వైకాపా అల్లరి మూకలు దాడులకు తెగబడటం దారుణమన్నారు. గతంలోనూ ఉరవకొండ, బొమ్మనహాళ్‌ విలేకరులపై దాడులకు పాల్పడ్డారని, మీడియా దాడులను నియంత్రించడంలో పోలీసులు ఘోరంగా విఫలమవుతున్నారని, ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా కూడా రౌడీమూకలు రెచ్చిపోవడం ప్రజలు గమనించాలన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని