Crime: కొడుకు లాగే ఉన్నాడని కిడ్నాప్
చనిపోయిన తన చిన్నకొడుకు లాగే ఉన్నాడని బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి దర్శనార్థం ఛత్తీస్గఢ్ నుంచి తిరుపతి బాలాజీ లింకు బస్టాండుకు వచ్చిన యాత్రికుల బృందంలోని చిన్నారి శివమ్ సాహూ (6) కిడ్నాప్ ఉదంతం అప్పట్లో సంచలనం రేపింది.
నాలుగు నెలల తర్వాత నిందితుడి అరెస్టు
తిరుపతి(నేరవిభాగం), న్యూస్టుడే: చనిపోయిన తన చిన్నకొడుకు లాగే ఉన్నాడని బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి దర్శనార్థం ఛత్తీస్గఢ్ నుంచి తిరుపతి బాలాజీ లింకు బస్టాండుకు వచ్చిన యాత్రికుల బృందంలోని చిన్నారి శివమ్ సాహూ (6) కిడ్నాప్ ఉదంతం అప్పట్లో సంచలనం రేపింది. అప్పుడే బాలుడిని కనుగొని తల్లిదండ్రులకు అప్పగించినా.. పరారీలో ఉన్న నిందితుడిని నాలుగు నెలల తర్వాత అరెస్టు చేశారు. తిరుపతి తూర్పు డీఎస్పీ మురళీకృష్ణ మంగళవారం అలిపిరి పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ‘ తిరుపతిలో బాలుడి కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఛేదించాం. తిరుపతి హరేరామ హరేకృష్ణ ఆలయం వద్ద పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకొని విచారించాం. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్ తాలూక పుట్టణహళ్లి గ్రామానికి చెందిన వెంకట రమణప్ప శివప్రసాద్ అలియాస్ శివారెడ్డిగా గుర్తించాం. విచారణలో.. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన ఉత్తమ్ కుమార్ సాహూ కుమారుడు శివమ్ సాహూని కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. లారీ డ్రైవరు అయిన శివారెడ్డి హిందీ భాష సరళంగా మాట్లాడటం వల్ల కొన్ని నిమిషాల్లోనే బాలుడు ఆకర్షితుడై వెంట వెళ్లాడు. బాలుడిని తీసుకుని విజయవాడకు వెళ్లగా.. తాను కిడ్నాప్ చేసిన విషయం మీడియా ద్వారా తెలుసుకుని దుర్గమ్మ గుడి సమీపంలో బాలుడిని వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడ నుంచి తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించాం. ఆ సమయంలో 15 టీమ్లు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇన్ని రోజులకు మళ్లీ తిరుపతికి వచ్చిన శివారెడ్డిని అలిపిరి ఎస్ఐ దేవేంద్రకుమార్, ఎస్ఐ జయచంద్ర, సిబ్బంది ప్రసాద్, రాజశేఖర్, నాగార్జున, లక్ష్మణరావు చాకచక్యంగా అరెస్టు చేశారు..’ అని డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా