logo

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

మండల పరిధిలోని ఆరు వరుసల జాతీయ రహదారిలో తెల్లగుండ్లపల్లె వద్ద గురువారం కారు బోల్తా పడి ఒకరు మరణించగా ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బంగాకు చెందిన కొందరు బెంగళూరులోని బంధువుల ఇంటికి వచ్చారు.

Published : 27 May 2022 05:43 IST

ఏడుగురికి గాయాలు

తవణంపల్లె: మండల పరిధిలోని ఆరు వరుసల జాతీయ రహదారిలో తెల్లగుండ్లపల్లె వద్ద గురువారం కారు బోల్తా పడి ఒకరు మరణించగా ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బంగాకు చెందిన కొందరు బెంగళూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి అందరూ కలిసి కారులో తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరిగి బెంగళూరు వెళ్తుండగా తెల్లగుండ్లపల్లె సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అంకిత్‌ జేనా(6) మృతి చెందాడు. సుదర్శన్‌ హట్య, రంజిని హట్య, రితీష, గోపాల్‌ జేనా, సునిత జేనా, రుక్ష, అయంకిత గాయపడ్డారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం గాయపడిన ఏడుగురు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి వెళ్లారు. ప్రమాదానికి గురైన వారు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని