టింకరింగ్ చేస్తేనే..
వీరు సోమల మండలం కందూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారంలో రెండ్రోజులు అటల్ టింకరింగ్ ల్యాబ్ను ఉపయోగించుకుంటున్నారు.
టీచర్లకు శిక్షణ కరవు
అటల్ ల్యాబ్లను వీడని గ్రహణం
పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నీతి ఆయోగ్లో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ల(ఏటీఎల్)ను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసింది.. 21వ శతాబ్దపు నైపుణ్యాలతో సృజనాత్మక ఆవిష్కరణలను సాంకేతిక సహకారంతో రూపొందించి యువతను శక్తిమంతులను చేయడమే ఈ ఏటీఎల్ ముఖ్యోద్దోశం.. అయితే ఉపాధ్యాయులకు సరైన శిక్షణ నేటికీ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు మార్గదర్శనం చేసేవారు కరవయ్యారు.. తుదిగా ఎంతో ఉన్నత ఆశయానికి అడుగుడుగునా తూట్లుపడుతున్నాయి.
చిత్తూరు పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోబో తయారుచేసి
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరిస్తున్న ఉపాధ్యాయుడు
వీరు సోమల మండలం కందూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారంలో రెండ్రోజులు అటల్ టింకరింగ్ ల్యాబ్ను ఉపయోగించుకుంటున్నారు. వారి ఆలోచనలకు ఉపాధ్యాయుల సహకారం తోడై కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటున్నాయి. కార్యాలయాలు, గృహాలో గేటు తెరవడానికి అక్కడికి వెళ్లకుండా సెన్సార్ పరికరాన్ని వీరు రూపొందించారు. గృహాల్లో లైట్లు, ఫ్యాన్ సౌండ్ సిస్టమ్తో ఆఫ్ చేయడం తదితర పరికరాలు అందుబాటులోకి తెచ్చారు.
చిత్తూరు విద్య, న్యూస్టుడే: జిల్లాలోని 31 మండలాల్లో 20 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2020లో అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ అనంతరం వీటిని ఇప్పుడిప్పుడే వినియోగిస్తు న్నారు. విద్యార్థులచే ప్రయోగాలు చేయిస్తూ నాలెడ్జ్ ఎకానమీగా ఎదిగేలా చేయాలనేది లక్ష్యం. చక్కటి వాతావరణంలో పనిచేయడానికి, నేర్చుకోవడానికి అనువుగా వీటిని రూపొందించారు. సైన్స్ ప్రయోగ శాలలు, డీసీఆర్, వీసీఆర్లను వినియోగంలోకి తెచ్చి నిర్దేశిత ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు మార్గ దర్శనం చేయాలి. జిల్లా హబ్గా చిత్తూరు పీసీˆఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయగా.. స్పోక్ ఏటీఎల్-1 గా జడ్పీ ఉన్నత పాఠశాల కందూరు(సోమల మండలం), స్పోక్ ఏటీఎల్-2గా శ్రీపరమహంస యోగానంద పాఠశాల(శాంతిపురం), స్పోక్ ఏటీఎల్-3గా జడ్పీ ఉన్నత పాఠశాల (కీలపట్ల, గంగవరం మండలం), స్పోక్ ఏటీఎల్-4గా ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలికల పాఠశాల (గంగాధరనెల్లూరు), స్పోక్ ఏటీఎల్-5గా ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలికల పాఠశాల(పూతలపట్టు) వ్యవహరి స్తున్నాయి. వీటిని మరింత బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించారు.
శిక్షణ ఎన్నటికీ?
ల్యాబ్ వినియోగం, విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించాల్సిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొవిడ్ కారణంగా రెండేళ్లు మూతపడిన ఇవి ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు సైన్స్ టీచర్లకు గాని ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులకు వీటి వినియోగం, బోధనపై శిక్షణ ఇవ్వలేదు. వారంలో రెండు, మూడ్రోజులు ఈ ల్యాబ్లోకి వెళ్లి విద్యార్థులు ప్రయోగం చేయాలి. ఆ సమయంలో సందేహాలు వస్తే ఉపాధ్యాయులు నివృత్తి చేయాలి. విద్యార్థులు ఉత్సాహంగా ల్యాబ్కి వెళ్లి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ప్రయోగాలేవీ ఇక్కడ కనిపించడం లేదు. వీటిని రూపొందించాలంటే ఉపాధ్యాయులకు విధిగా శిక్షణ అవసరం. ఇందుకు ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిష్ణాతులచే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. అసలు శిక్షణ లేకపోవడంతో భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దటం సాధ్యమేనా అనే సందేహం కలగకమానదు.
ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తాం..
అటల్ టింకరింగ్ ల్యాబ్లను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. దేశానికి అవసరమైన శాస్త్రవేత్తలను పాఠశాల స్థాయి నుంచే తయారు చేసేందుకు టైం టేబుల్ రూపొందించుకుని ప్రయోగత్మకంగా బోధించేందుకు ఇవి ఉపకరిస్తాయి. త్వరలో ఉపాధ్యాయులకు శిక్షణ తప్పక ఇప్పిస్తాం.
విజయేంద్రరావు, డీఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!