logo

Andhra News: వైద్యుల నిర్వాకం.. సర్జరీ ప్రారంభించి మావల్ల కాదని మధ్యలోనే ఆపేశారు..!

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వృద్ధురాలి కాలుకు జరుగుతున్న చికిత్సను వైద్యులు మధ్యలోనే ఆపారు.

Updated : 12 Jan 2023 10:22 IST

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఘటన

చిత్తూరు(వైద్యం), న్యూస్‌టుడే: చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్వాకం నివ్వెరపోయేలా చేసింది.  వృద్ధురాలి కాలుకు జరుగుతున్న చికిత్సను మధ్యలోనే ఆపారు. యాదమరి మండలం దళవాయిపల్లికి చెందిన పుష్పమ్మ(62) గతేడాది డిసెంబరు 31న ఇంట్లో జారిపడి తొడ ఎముక వద్ద గట్టిగా తగలడంతో కుటుంబ సభ్యులు ఈ నెల నాలుగో తేదీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.

విరిగిన ఎముక ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎక్స్‌రే తీయాలని చెప్పి ప్రైవేటు ఎక్స్‌రే ప్లాంటుకు రాశారు. ఎక్స్‌రే తీసుకురాగా పరిశీలించి వైద్యులు శస్త్రచికిత్స చేయాలని చెప్పి తేదీ సైతం చెప్పారు. తుదిగా వృద్ధురాలిని ఆపరేషన్‌ గదికి తీసుకెళ్లాక.. పలు కారణాలు చెప్పి వాయిదా వేసి బుధవారం శస్త్రచికిత్స ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. తొడ భాగాన్ని కోసిన వైద్యులు మధ్యలోనే కుట్లు వేసి.. స్థానికంగా చికిత్స చేయలేమని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు ప్రశ్నిస్తే ఎముకలు గట్టిగా లేవని వైద్యులు చెప్పడంతో వారు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాను సంబంధిత వైద్యులతో మాట్లాడతానని, న్యాయం చేస్తానని సూపరింటెండెంట్‌ హామీ ఇచ్చారు. ఆపై బాధితురాలిని ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని