తితిదే బడ్జెట్లో శ్రీనివాససేతుకు రూ.25 కోట్లు
శ్రీవారికి హుండీ ఆదాయంతోపాటు ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో పెట్టిన పెట్టుబడులే ఆదాయ వనరుగా మారాయి. రానున్న ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ రెండింటి ద్వారా సుమారు రూ.2,581 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈనాడు-తిరుపతి, న్యూస్టుడే, తిరుమల: శ్రీవారికి హుండీ ఆదాయంతోపాటు ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో పెట్టిన పెట్టుబడులే ఆదాయ వనరుగా మారాయి. రానున్న ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ రెండింటి ద్వారా సుమారు రూ.2,581 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తం ఆదాయంలో 58.50 శాతం వీటి ద్వారానే వస్తుందని బడ్జెట్లో పొందుపర్చారు. తితిదే 2023-24 వార్షిక ఆదాయం రూ.4,411.68 కోట్లు ఉంటుందని ఇటీవల ధర్మకర్తల మండలిలో ప్రవేశపెట్టారు. ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీనివాససేతు కోసం రూ.25 కోట్లు పొందుపర్చారు. గత ఏడాది రూ.200 కోట్లు పొందుపర్చడంతో ఇప్పుడు కేటాయించిన నిధుల ద్వారా పనులు పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రసాదాలు, ఆర్జిత సేవల ద్వారా వచ్చే ఆదాయంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఈ ఏడాది తరహాలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24)లో ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.500 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ.330 కోట్లు, ఆర్జిత సేవల ద్వారా రూ.140 కోట్లు, కల్యాణకట్ట ద్వారా రూ.126.50 కోట్లు వస్తాయని భావిస్తున్నారు.
ధర్మప్రచారానికి..
హిందూ ధర్మ ప్రచారానికి రూ.93 కోట్లు బడ్జెట్లో పెట్టారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వీటిని ఖర్చు చేయనున్నారు. వివిధ సంస్థలకు గ్రాంటు కింద రూ.115.50 కోట్లు ఖర్చు చేస్తారు. తితిదే విద్యా సంస్థల్లో వివిధ అవసరాలకు రూ.128.88 కోట్లు బడ్జెట్లో నిధులు కేటాయించారు. అలాగే వివిధ విశ్వవిద్యాలయాలకు గ్రాంట్ల కింద రూ.29 కోట్లు పొందుపర్చారు. ఆరోగ్యంతోపాటు పారిశుద్ధ్య విభాగానికి రూ.103.19 కోట్లు, ఎఫ్ఎంఎస్ సేవలకు రూ.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు రూ.58.10 కోట్లు, స్విమ్స్కు గ్రాంటు కింద రూ.86 కోట్లు, బర్డ్, ఎస్వీ ప్రాణదాన ట్రస్టులకు రూ.60 కోట్లు కేటాయించారు. వీటితోపాటు విజిలెన్స్ విభాగానికి రూ.178.33 కోట్లు పొందుపర్చారు.
ఇంజినీరింగ్ విభాగానికి....
రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇంజినీరింగ్ విభాగానికి సుమారు రూ.300 కోట్లు బడ్జెట్లో పొందుపర్చారు. ఇందులో ఆసుపత్రుల్లో పనులకు రూ.106.65 కోట్లు ఖర్చు చేయనున్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.42.13 కోట్లు, రహదారులకు రూ.29.49 కోట్లు, కల్యాణమండపాల నిర్మాణం, మరమ్మతులకు రూ.18.02 కోట్లు వెచ్చించనున్నారు. ఆలయ పనులకు రూ.14.06 కోట్లు పొందుపర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ