రెడ్ సిగ్నల్ పడేనా?
జిల్లాలోని రైలు పట్టాలపై మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది.. జిల్లాలోని రైలు మార్గాల్లో కొన్ని సూసైడ్(ఆత్మహత్య) స్పాట్లను తలపిస్తున్నాయి.. నెలకు కనీసం నాలుగైదయినా పట్టాలపై వెలుగు చూస్తున్నాయి..
ఏటా పెరుగుతున్న ప్రమాదాలు
ఆత్మహత్యలకు అడ్డాగా రైలుపట్టాలు
గుర్తించలేని మృతదేహాలూ అధికమే
రైలు పట్టాలపై ప్రమాదం(పాత చిత్రం)
న్యూస్టుడే, చిత్తూరు(క్రైమ్): జిల్లాలోని రైలు పట్టాలపై మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది.. జిల్లాలోని రైలు మార్గాల్లో కొన్ని సూసైడ్(ఆత్మహత్య) స్పాట్లను తలపిస్తున్నాయి.. నెలకు కనీసం నాలుగైదయినా పట్టాలపై వెలుగు చూస్తున్నాయి.. ఆయా స్టేషన్ల పరిధిలో పట్టాలపై లభ్యమవుతోన్న మృతదేహాలను పరిశీలిస్తే పరిస్థితి నానాటికీ భయానకంగా మారుతోంది.. చివరకు కనీసం ఆనవాళ్లు సైతం దొరకని పరిస్థితి.. అవి ప్రమాదవశాత్తూ జరిగిన మరణాలా..? ఆత్మహత్యలా..? సాధారణంగా జరిగిన ప్రమాదాలా..? అనే విషయం తేలడం లేదు.. ఆ దిశగా ఎవరూ దృష్టి సారించడం లేదు.. ఏళ్ల తరబడి కొన్ని మృత దేహాల వివరాలు నేటికీ తెలియడం లేదు.. వీటికి అడ్డుకట్ట పడేదెన్నడేది ప్రశ్నార్థకంగా మారింది.
నేటికీ తెలియనివి ఎన్నో..?
రైలు పట్టాలపై వెలుగుచూసే మృతదేహాల్లో కొన్ని నేటికీ ఎవరిదనేది తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని వివరాలు తెలిసినా.. మరి కొన్ని మృతదేహాల వివరాలు సంవత్సరాలైనా తెలియడం లేదు. అవి ఎవరివనేది తెలిస్తే దర్యాప్తు ముమ్మరం చేసి కేసు ఛేదించవచ్చు. రైల్వే పోలీసులకు.. మృతుల వేలిముద్రల ద్వారా ఆధార్ పరిశీలించే అవకాశం కల్పించినా.. అవి ఎవరివనేది గుర్తించవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైలు పట్టాలపై జరిగే మరణాలపై దృష్టి పెట్టి రైల్వే అధికారులకు ఆధార్ పరిశీలనకు అవకాశం కల్పించి, ప్రమాదాలకు జరగకుండా చూడాలి.
రైలు పట్టాలపై ఆత్మహత్యలు
బెట్టింగ్ యాప్లో రూ.లక్షలు పోగొట్టుకుని, రుణ యాప్లో నగదు తీసుకుని, ప్రేమలో విఫలమై.. పరీక్షలో తప్పి.. ఇలా పలు కారణాలతో యువతీయువకులు రైలు పట్టాలపై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న నుంచి పెద్ద వరకు అవగాహనా లోపంతో పొలాల వద్ద ఉన్న రైల్వే లైను దాటుతూ ఊహించని రీతిన ప్రమాదానికి గురవుతున్నారు. ఇలాంటి వాటిపై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తుండాలి..
- ప్రవీణ్కుమార్, ఎస్సై, జీఆర్పీఎఫ్, చిత్తూరు
ఆత్మహత్యలకు పాల్పడే యువకుల్లో చాలామంది చరవాణి, బెట్టింగ్ యాప్, రుణయాప్లు వినియో గిస్తూ నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు నిత్యం పిల్లల్ని కనిపెడుతూ, వారి ప్రవర్తనలో మార్పు కనిపించిన వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వాలి. ముఖ్యంగా రైలు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా