రెడ్ సిగ్నల్ పడేనా?
జిల్లాలోని రైలు పట్టాలపై మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది.. జిల్లాలోని రైలు మార్గాల్లో కొన్ని సూసైడ్(ఆత్మహత్య) స్పాట్లను తలపిస్తున్నాయి.. నెలకు కనీసం నాలుగైదయినా పట్టాలపై వెలుగు చూస్తున్నాయి..
ఏటా పెరుగుతున్న ప్రమాదాలు
ఆత్మహత్యలకు అడ్డాగా రైలుపట్టాలు
గుర్తించలేని మృతదేహాలూ అధికమే
రైలు పట్టాలపై ప్రమాదం(పాత చిత్రం)
న్యూస్టుడే, చిత్తూరు(క్రైమ్): జిల్లాలోని రైలు పట్టాలపై మృతదేహాల సంఖ్య పెరిగిపోతోంది.. జిల్లాలోని రైలు మార్గాల్లో కొన్ని సూసైడ్(ఆత్మహత్య) స్పాట్లను తలపిస్తున్నాయి.. నెలకు కనీసం నాలుగైదయినా పట్టాలపై వెలుగు చూస్తున్నాయి.. ఆయా స్టేషన్ల పరిధిలో పట్టాలపై లభ్యమవుతోన్న మృతదేహాలను పరిశీలిస్తే పరిస్థితి నానాటికీ భయానకంగా మారుతోంది.. చివరకు కనీసం ఆనవాళ్లు సైతం దొరకని పరిస్థితి.. అవి ప్రమాదవశాత్తూ జరిగిన మరణాలా..? ఆత్మహత్యలా..? సాధారణంగా జరిగిన ప్రమాదాలా..? అనే విషయం తేలడం లేదు.. ఆ దిశగా ఎవరూ దృష్టి సారించడం లేదు.. ఏళ్ల తరబడి కొన్ని మృత దేహాల వివరాలు నేటికీ తెలియడం లేదు.. వీటికి అడ్డుకట్ట పడేదెన్నడేది ప్రశ్నార్థకంగా మారింది.
నేటికీ తెలియనివి ఎన్నో..?
రైలు పట్టాలపై వెలుగుచూసే మృతదేహాల్లో కొన్ని నేటికీ ఎవరిదనేది తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని వివరాలు తెలిసినా.. మరి కొన్ని మృతదేహాల వివరాలు సంవత్సరాలైనా తెలియడం లేదు. అవి ఎవరివనేది తెలిస్తే దర్యాప్తు ముమ్మరం చేసి కేసు ఛేదించవచ్చు. రైల్వే పోలీసులకు.. మృతుల వేలిముద్రల ద్వారా ఆధార్ పరిశీలించే అవకాశం కల్పించినా.. అవి ఎవరివనేది గుర్తించవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైలు పట్టాలపై జరిగే మరణాలపై దృష్టి పెట్టి రైల్వే అధికారులకు ఆధార్ పరిశీలనకు అవకాశం కల్పించి, ప్రమాదాలకు జరగకుండా చూడాలి.
రైలు పట్టాలపై ఆత్మహత్యలు
బెట్టింగ్ యాప్లో రూ.లక్షలు పోగొట్టుకుని, రుణ యాప్లో నగదు తీసుకుని, ప్రేమలో విఫలమై.. పరీక్షలో తప్పి.. ఇలా పలు కారణాలతో యువతీయువకులు రైలు పట్టాలపై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న నుంచి పెద్ద వరకు అవగాహనా లోపంతో పొలాల వద్ద ఉన్న రైల్వే లైను దాటుతూ ఊహించని రీతిన ప్రమాదానికి గురవుతున్నారు. ఇలాంటి వాటిపై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తుండాలి..
- ప్రవీణ్కుమార్, ఎస్సై, జీఆర్పీఎఫ్, చిత్తూరు
ఆత్మహత్యలకు పాల్పడే యువకుల్లో చాలామంది చరవాణి, బెట్టింగ్ యాప్, రుణయాప్లు వినియో గిస్తూ నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు నిత్యం పిల్లల్ని కనిపెడుతూ, వారి ప్రవర్తనలో మార్పు కనిపించిన వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వాలి. ముఖ్యంగా రైలు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లక్షితపై దాడిచేసి చంపిన చిరుత గుర్తింపు
[ 19-03-2024]
అలిపిరి కాలినడక మార్గంలో లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. -
ప్రేమ పేరుతో వంచన.. తాళి తెంచి నడిరోడ్డుపై వదిలి
[ 19-03-2024]
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా...కాదంటే చంపేస్తా... ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు, యువతిని బెదిరించి, వేధించి పెళ్లి చేసుకున్నాడు. -
బటన్ నొక్కినా..నగదు పడలేదేమన్నా!
[ 19-03-2024]
ఇచ్చిన మాట నెరవేరుస్తూ.. ఇంతకాలం మన ప్రభుత్వం అందించిన తోడ్పాటు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందంటూ సీఎం జగన్ వేసిన నాలుగో విడత చేయూత లబ్ధి అక్కచెల్లెమ్మలకు అందలేదు. -
అనుమతులు లేకున్నా..అడ్డుకోకూడదంతే!
[ 19-03-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలనూ వైకాపా ప్రభుత్వం లెక్క చేయడంలేదు. -
కోడ్ ఉంది.. గుట్టుగా కానిచ్చేయ్..!
[ 19-03-2024]
పుత్తూరు పట్టణంలోని రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, కుంటలు, కాలువలు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలాలు కరవయ్యాయి. -
సమస్యల నడుమ ‘పది’ పరీక్ష ప్రారంభం
[ 19-03-2024]
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జిల్లాలో సమస్యల నడుమ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. -
నిబంధనలు మరచి.. భక్తి చూపుతూ
[ 19-03-2024]
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా.. అధికార పార్టీ నాయకుల సేవలో అధికారులు తరిస్తున్నారు. రామకుప్పం మండలానికి మురుగేశ్ కుప్పం మండలంలో టీఏగా పనిచేస్తున్నారు. -
‘ఓపెన్’గా మాస్ కాపీయింగ్
[ 19-03-2024]
సార్వత్రిక పాఠశాలలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమాయ్యయి. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అందినప్పటి నుంచి మూకుమ్మడి చూచిరాతలు మొదలయ్యాయి. -
ఏళ్లుగా విస్మరించి.. ఇప్పుడు హడావుడి
[ 19-03-2024]
ఓటర్లను మభ్య పెట్టేందుకు అధికార వైకాపా కుయుక్తులు పన్నుతూనే ఉంది. -
తెదేపాలో చేరినందుకు.. వైకాపా శ్రేణుల దాడి
[ 19-03-2024]
తెదేపాలో చేరికను జీర్ణించుకోలేక.. వైకాపా కార్యకర్తలు దాడి చేసిన ఘటన చిత్తూరులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. -
రోజమ్మా.. శిల్పారామం ఎక్కడమ్మా..?
[ 19-03-2024]
మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని అందరూ భావిస్తారు.. అయితే పర్యాటక శాఖ మంత్రి జిల్లాలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు పదెకరాల స్థలం దొరక్కపోవడమంటే విడ్డూరమే! -
‘అభినయ్ అండతోనే కార్పొరేటర్ల బరితెగింపు’
[ 19-03-2024]
నగరపాలిక ఉపమేయర్ భూమన అభినయ్రెడ్డి ప్రోత్సాహంతోనే అధికార వైకాపా కార్పొరేటర్లు బరితెగించి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని 35వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. -
పరీక్షకు వెళ్లి.. విగతజీవిగా
[ 19-03-2024]
పదో తరగతి పరీక్ష రాసొస్తాని చెప్పి వెళ్లిన కుమారుడు విగతజీవిగా రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఇంటి పట్టా.. ఇక రానట్టే..!
[ 19-03-2024]
ఇళ్ల స్థలాల మంజూరును నిరంతర ప్రక్రియగా చేశాం.. ఎవరికైనా అర్హత ఉండి ఇంటి స్థలం లేకుంటే దరఖాస్తు చేసిన 90 రోజుల్లో పరిశీలించి మీకు స్థలాలు ఇస్తాం.’ -
అదను చూసి.. బరితెగించి..
[ 19-03-2024]
శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్నగర్ అంటే భూవివాదాలకు చిరునామాగా వినుతికెక్కింది. వైకాపా నేతలు, కొందరు పురపాలిక ఉద్యోగులు ఎంతగా సొమ్ము చేసుకున్నారో అందరికీ తెలిసిందే. -
ఎస్వీయూలో అక్రమ నియామకాలు
[ 19-03-2024]
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలను అతిక్రమించి ఎసీˆ్వయూలో 12 మందిని ఒప్పంద పద్ధతిలో నాన్టీచింగ్ ఉద్యోగులుగా నియమించినట్లు సమాచారం. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 19-03-2024]
-
నియమావళి.. ఉల్లంఘించి నిద్రలో జోగాలి
[ 19-03-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. జిల్లాలోని చాలాచోట్ల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. -
పేరుకే కుళాయిలు.. పనిచేయని కూలర్లు
[ 19-03-2024]
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అనీష్.. దాదాగిరి
[ 19-03-2024]
నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్, ఆయన అనుచరుల దందాపై నగరవాసులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
అబ్బా.. కొనలేమిక..!
[ 19-03-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీల మోతతో వినియోగదారులకు విద్యుత్తు శాఖ అంటేనే భయపడేలా చేసింది. -
బంగారం, చిల్లర దుకాణాల్లో చోరీ
[ 19-03-2024]
నాయుడుపేట పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోని ఎన్బీఆర్ఎస్ బంగారు ఆభరణాల దుకాణం, మరో చిల్లర దుకాణంలో ఆదివారం రాత్రి దుండగులు చోరీ చేశారు. -
ఉపాధ్యాయుడికి జైలుశిక్ష
[ 19-03-2024]
వరకట్నం వేధింపు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెవిరెడ్డి సుధాకర్రెడ్డికి వెంకటగిరి ఫస్ట్ క్లాస్ న్యాయస్థానంలో న్యాయమూర్తి అనూష జైలుశిక్ష విధించినట్లు సోమవారం న్యాయస్థానం వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!