అతివేగం.. నిద్ర మత్తు
ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో ఈనెల 1వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళుతోన్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనడంతో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
జిల్లాలో తరచూ ప్రమాదాలు
పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా పనిచేస్తేనే నివారణ
ఈనాడు డిజిటల్, చిత్తూరు, న్యూస్టుడే, తిరుపతి(నేరవిభాగం)
చంద్రగిరి మండలం కాశిపెంట్ల వద్ద గతనెలలో జరిగిన రోడ్డు ప్రమాదం
* ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో ఈనెల 1వ తేదీ తెల్లవారుజామున శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళుతోన్న ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనడంతో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
* ఈ ఏడాది జనవరి 25న తిరుమల శ్రీవారిని దర్శించుకుని కాణిపాకం బయలుదేరిన మహారాష్ట్ర భక్తులకు చెందిన కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న డివైడర్ గోడను ఢీ కొట్టడంతో నలుగురు ప్రమాదస్థలిలోనే దుర్మరణం చెందగా మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. అతివేగంతోనే ఈ ఘటన జరిగింది.
అతివేగం.. నిద్రమత్తుకు తోడు అవగాహన లేమితో జిల్లాలోని రహదారులు రక్తమోడుతున్నాయి. మృతుల్లో ఎక్కువమంది స్థానికేతరులే ఉంటున్నారు. తాజాగా శనివారం ఇదే తరహాలో పులిచెర్ల మండలంలో ప్రమాదం చోటుచేసుకుని నలుగురు మృతిచెందారు. అధిక శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమైనప్పటికీ జాతీయ రహదారులపై విధులు నిర్వర్తించే పెట్రోలింగ్ సిబ్బంది వాహనదారులను అప్రమత్తం చేస్తే కొంతవరకు ప్రాణనష్టాన్ని తప్పించవచ్చు. పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా పనిచేస్తేనే ప్రమాదాలు నివారించవచ్చు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల సందర్శనకు నిత్యం వేలాది మంది జిల్లాకు వస్తుంటారు. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకు అరుణాచలానికీ వెళుతుంటారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు జిల్లా రోడ్లపై ఏమాత్రం అవగాహన ఉండదు. త్వరగా గమ్యాన్ని చేరుకునేందుకు 100 కి.మీ.లపైగా వేగంతో వాహనాలు నడుపుతున్నారు. కొందరైతే సొంతంగానే వాహనాలు నడుపుతూ వస్తుండటం.. అందులోని ఒక్కరికే డ్రైవింగ్ రావడంతో అలసిపోయినా.. అతనే స్టీరింగ్ పట్టాల్సి వస్తోంది. నిద్ర లేమితో కంటి రెప్పలు మూతపడుతున్నాయి. ఈలోపే నష్టం జరిగిపోతోంది. మరికొందరు ముందుగా వెళుతున్న వాహనాలను తప్పించబోయి వాటినే ఢీ కొడుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు చంద్రగిరి- నేండ్రగుంట మధ్య ఎక్కువగా జరిగాయి. కల్లూరు, భాకరాపేట, మొగిలి ఘాట్లో లారీలు మిట్ట ఎక్కేటప్పుడు ఒక్కసారిగా నిదానిస్తున్నాయి. వెనుక వస్తున్న కారు, బస్సు డ్రైవర్లు వేగాన్ని అదుపు చేయలేక లారీలను ఢీ కొడుతున్నారు.
పులిచెర్ల మండలం ఎంజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో
శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనం
అరకొరగా స్పీడ్ గన్లు
జాతీయ రహదారులపై స్పీడ్ గన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అవి కూడా తిరుపతి- చిత్తూరు రోడ్డులో రెండు చోట్ల ఏర్పాటు చేశారు. ఇక్కడ వీటి సంఖ్య పెంచడంతోపాటు చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై కొత్తవి ఏర్పాటు చేసేలా రవాణా శాఖ అధికారులు చొరవ చూపాలి. తద్వారా అధిక వేగంతో వెళుతోన్న వాహనదారుడికి జరిమానా పడితే ఆ తర్వాత డ్రైవింగ్ చేసే విధానంలో మార్పు వచ్చి ప్రాణాలను కాపాడొచ్చు.
‘వాష్ అండ్ డ్రైవ్’ అమలు చేస్తే..
గతంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జాతీయ రహదారులపై విధులు నిర్వర్తించే పెట్రోలింగ్ సిబ్బంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలిపేవారు. డ్రైవర్ నీటితో ముఖాన్ని కడుక్కున్న తర్వాత ప్రయాణానికి అనుమతించేవారు. సిబ్బంది సక్రమంగా పనిచేస్తున్నారా? లేదాని తెలుసుకునేందుకు సీఐలు, డీఎస్పీలు అకస్మాత్తుగా వెళ్లే పరిస్థితి ఉంది. దీంతో ప్రమాదాల సంఖ్య కొంతవరకు తగ్గింది. ప్రస్తుతం ఈ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న జమానా.. పన్నులతో హైరానా
[ 10-05-2024]
పుత్తూరు పట్టణానికి చెందిన వీరయ్యకు గతంలో రూ.2,500 ఇంటి పన్ను చెల్లించేవాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆస్తి విలువ ఆధారిత విధానంతో పన్ను విధించడంతో రూ.4,500 చెల్లించాలని పురపాలక సంఘ అధికారులు అతడికి డిమాండ్ నోటీసు అందించారు. -
ఓటర్లకు డబ్బుతో వైకాపా గాలం..!
[ 10-05-2024]
ఐదేళ్లుగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న వైకాపా.. ఎన్నికల్లో విజయం సాధించాలని డబ్బుతో ఓటర్లకు గాలం వేసే పనిలో బిజీగా ఉంది. -
పోలింగ్ కేంద్రాల్ని అప్పగించాలి
[ 10-05-2024]
పోలింగ్ కేంద్రాల్ని శుక్రవారం నాటికి సెక్టోరియల్ అధికారులకు అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. ఎంఈవోలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. -
నమ్మించడం.. వంచించడం.. ఇదే జగన్ నైజం
[ 10-05-2024]
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని విపక్ష నేత హోదాలో జగన్ పదేపదే నాయకులకు హితబోధ చేశారు. అవి లేనప్పుడు అటువంటి నేతలను ఇంటికి పంపాలని కూడా ఆయనే సెలవిచ్చారు. -
తెదేపా ఆకలి తీర్చింది.. వైకాపా మూసేసింది
[ 10-05-2024]
రూ.2కే పేదలకు కిలో బియ్యం అందించిన తేదేపా ప్రభుత్వం వారి ఆకలి తీర్చేందుకు రూ.5కే అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. -
జెండాలు వేరైనా.. అజెండా ఒకటే...!
[ 10-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటే అని నందమూరి రామక్రిష్ణ అన్నారు. మండలంలోని అరగొండ గ్రామంలో వైకాపాకు చెందిన రంజిత్కుమార్రెడ్డి, విజయ్ యాదవ్ కుటుంబ సభ్యులకు ఆయన గురువారం తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
దేశానికి మోదీ.. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం
[ 10-05-2024]
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ అన్నారు. -
ప్రజలు ఎలాపోతే మనకేంటి..?
[ 10-05-2024]
నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడానికి నిర్దేశించిన కట్టమంచి చెరువు పర్యాటక ప్రాజెక్టు అమలును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది.. -
జగన్.. పన్నుతో వేధించెన్
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన మూలధన విలువ ఆధారిత(సీవీ) ఆస్తిపన్ను విధింపుతో పట్టణ ప్రాంత భవనాలు, ఇళ్ల యజమానులపై మోయలేని భారం పడింది. -
సూపర్-6తోనే సామాజిక న్యాయం..!
[ 10-05-2024]
అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్-6 పేరుతో చంద్రబాబు ప్రజల ముందుకు రాగా.. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రతిపాదించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. -
రెచ్చగొట్టి దాడిచేశారు
[ 10-05-2024]
రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఏర్పేడు మండలం దుర్గిపేరిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
ఎన్నికల రోజు కార్మికులకు సెలవు
[ 10-05-2024]
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ఉప కార్మిక కమిషనర్ యం.బాలునాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఓటు వేయడానికి మూడు గంటలు వేచి చూడాలా ?
[ 10-05-2024]
‘మేడమ్.. నేను వచ్చి సుమారు మూడు గంటల సేపవుతోంది. ఎన్నికల విధుల నుంచి ఇచ్చిన ఆర్డరు చూపించా. నా ఓటు చిత్తూరులో ఉంది.