మాటల్లో నిషేధం.. మత్తులో ఆధ్యాత్మిక నగరం
నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మద్యం మత్తులో పలువురు చేస్తున్న వికృత చేష్టలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
రహదారులపై మందుబాబుల వికృత చేష్టలు
భక్తులు, స్థానికుల్లో భయాందోళనలు
అన్నమయ్య కూడలి సమీపంలో బుధవారం మందుబాబుల వీరంగం
నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మద్యం మత్తులో పలువురు చేస్తున్న వికృత చేష్టలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మద్య నిషేధం అమలు చేసే అంశాన్ని పక్కనబెట్టి విక్రయాలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అధికార, ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లతో చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలున్నాయి.
ఈనాడు-తిరుపతి: జిల్లా పరిధిలో 27 బార్లకు ప్రభుత్వానికి లైసెన్సు రూపేణా ఏకంగా రూ.29.99 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మొత్తం 16 బార్లు ఉండగా.. వీటికి రూ.24.30 కోట్లు చెల్లించి దుకాణాల లైసెన్సులు తీసుకున్నారు.
‘కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది... మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి... అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం... మద్యాన్ని 5 నక్షత్రాల
హోటళ్లకే పరిమితం చేస్తాం.
మానిఫెస్టోలో ఎన్నికల సమయంలో జగన్మోహన్రెడ్డి పేర్కొన్న అంశం.
‘అలిపిరి నుంచి 10 కి.మీ.ల వ్యాసార్థంలో మద్యపానంపై సంపూర్ణ నిషేధం విధించాలి. ఇది ఒక్కసారి సాధ్యం కాకుంటే దశలవారీగా చేపట్టాలి. తొలి దశలో కనీసం రెండు కి.మీ.ల పరిధిలోని ఆర్టీసీ బస్టాండు - అలిపిరి రహదారి, చెర్లోపల్లి-అలిపిరి రహదారి, టౌన్ క్లబ్ - అలిపిరి రహదారి ప్రాంతాల్లో చేపట్టాలని ప్రభుత్వానికి నివేదిస్తున్నాం.’
2019 అక్టోబరు 23న తితిదే ధర్మకర్తల మండలి తీర్మానం
‘నగరంలోని యువత డ్రగ్స్, గంజాయికి బానిసయ్యారు. మాదక ద్రవ్యాలను వదలకుంటే జీవితాలు నాశనమవుతాయి.’
2021 జూన్లో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పలు కాలనీల్లో తనిఖీలు చేసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు
ఏరులై ప్రవహిస్తేనే ఆదాయం
నగరంలో ఓ బారును రూ.1.59 కోట్లకు, మరోదాన్ని రూ.1.55 కోట్లకు దక్కించుకున్నారు. రోజు తప్పనిసరిగా రూ.43,562 విలువైన మద్యాన్ని విక్రయించాలి. ఇది కేవలం లైసెన్సు రూపంలో చెల్లించాల్సిన సొమ్ము మాత్రమే. దీనికి అదనంగా దుకాణం నిర్వహణ, సిబ్బందికి వేతనాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా ఒక రోజుకు రూ.60 వేల విలువైన చేసే మద్యం విక్రయించాలి. ఇదీ కేవలం ఎటువంటి లాభం లేకుండానే. ఈ లెక్కన నగరంలోని బార్ల ద్వారా ఎంత మద్యం విక్రయమవుతుందో అర్థం చేసుకోవచ్చు.
హద్దులు మీరి..
ఇది అన్నారావు కూడలిలోని మద్యం దుకాణం. ఇది కపిలతీర్థం, ఇస్కాన్, వరదరాజస్వామి ఆలయాలకు సమీపంలో ఉంది. ప్రధాన ప్రాంతంలో ఉన్న ఈ దుకాణం వద్దే తాగిన సీసాలను పడేస్తున్నా ఎవరూ నియంత్రించడం లేదు. ఇదే పరిస్థితి నగరం అంతటా నెలకొంది.
తిరుపతి నగరంలో బుధవారం రహదారిపై వెళ్తున్న మహిళపై బీరు సీసా విసిరిన ఘటనలో జరిగిన అల్లర్లలో ఒకరు మృతి చెందారు. ఇలాంటివి రోజూ నగరంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. మందుబాబులు చేస్తున్న అరాచకాలు అనేకం ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బజారులో వెళ్తున్న మహిళలు, చిన్నపిల్లలతో అసభ్యంగా మాట్లాడటం. వాహనాలను ఇష్టానుసారంగా నడిపి ఇతరులకు తీవ్ర ఇబ్బందులు కల్పిస్తున్నారు.ఇలాంటి వాటిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా రాజకీయ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లతో వదిలేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
బహిరంగంగా తాగుతున్నా..
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే మద్యం తాగుతున్నా పోలీసులు, సెబ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరినైనా పట్టుకుంటే అధికార పార్టీ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం.
ప్రోత్సాహం ఎంతలా అంటే..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2022లో రూ.302.23 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే, 2023లో ఇప్పటి వరకు రూ.126.15 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఏ మేరకు మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నారన్నది తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మిక నగరంలో మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకురాకుంటే రానున్న రోజుల్లో రహదారిపై నడిచేందుకు ప్రజలు, భక్తులు భయపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న జమానా.. పన్నులతో హైరానా
[ 10-05-2024]
పుత్తూరు పట్టణానికి చెందిన వీరయ్యకు గతంలో రూ.2,500 ఇంటి పన్ను చెల్లించేవాడు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆస్తి విలువ ఆధారిత విధానంతో పన్ను విధించడంతో రూ.4,500 చెల్లించాలని పురపాలక సంఘ అధికారులు అతడికి డిమాండ్ నోటీసు అందించారు. -
ఓటర్లకు డబ్బుతో వైకాపా గాలం..!
[ 10-05-2024]
ఐదేళ్లుగా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్న వైకాపా.. ఎన్నికల్లో విజయం సాధించాలని డబ్బుతో ఓటర్లకు గాలం వేసే పనిలో బిజీగా ఉంది. -
పోలింగ్ కేంద్రాల్ని అప్పగించాలి
[ 10-05-2024]
పోలింగ్ కేంద్రాల్ని శుక్రవారం నాటికి సెక్టోరియల్ అధికారులకు అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. ఎంఈవోలతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. -
నమ్మించడం.. వంచించడం.. ఇదే జగన్ నైజం
[ 10-05-2024]
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని విపక్ష నేత హోదాలో జగన్ పదేపదే నాయకులకు హితబోధ చేశారు. అవి లేనప్పుడు అటువంటి నేతలను ఇంటికి పంపాలని కూడా ఆయనే సెలవిచ్చారు. -
తెదేపా ఆకలి తీర్చింది.. వైకాపా మూసేసింది
[ 10-05-2024]
రూ.2కే పేదలకు కిలో బియ్యం అందించిన తేదేపా ప్రభుత్వం వారి ఆకలి తీర్చేందుకు రూ.5కే అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. -
జెండాలు వేరైనా.. అజెండా ఒకటే...!
[ 10-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒకటే అని నందమూరి రామక్రిష్ణ అన్నారు. మండలంలోని అరగొండ గ్రామంలో వైకాపాకు చెందిన రంజిత్కుమార్రెడ్డి, విజయ్ యాదవ్ కుటుంబ సభ్యులకు ఆయన గురువారం తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
దేశానికి మోదీ.. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం
[ 10-05-2024]
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ అన్నారు. -
ప్రజలు ఎలాపోతే మనకేంటి..?
[ 10-05-2024]
నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించడానికి నిర్దేశించిన కట్టమంచి చెరువు పర్యాటక ప్రాజెక్టు అమలును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది.. -
జగన్.. పన్నుతో వేధించెన్
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన మూలధన విలువ ఆధారిత(సీవీ) ఆస్తిపన్ను విధింపుతో పట్టణ ప్రాంత భవనాలు, ఇళ్ల యజమానులపై మోయలేని భారం పడింది. -
సూపర్-6తోనే సామాజిక న్యాయం..!
[ 10-05-2024]
అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్-6 పేరుతో చంద్రబాబు ప్రజల ముందుకు రాగా.. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన అధినేత పవన్కల్యాణ్ ప్రతిపాదించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. -
రెచ్చగొట్టి దాడిచేశారు
[ 10-05-2024]
రెచ్చగొట్టి తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఏర్పేడు మండలం దుర్గిపేరిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
ఎన్నికల రోజు కార్మికులకు సెలవు
[ 10-05-2024]
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ఉప కార్మిక కమిషనర్ యం.బాలునాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఓటు వేయడానికి మూడు గంటలు వేచి చూడాలా ?
[ 10-05-2024]
‘మేడమ్.. నేను వచ్చి సుమారు మూడు గంటల సేపవుతోంది. ఎన్నికల విధుల నుంచి ఇచ్చిన ఆర్డరు చూపించా. నా ఓటు చిత్తూరులో ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!