వేళ్లూనిన వ్యాపకం
మొక్కలే ఆమెకు ప్రాణం.. పొద్దుపొడవక ముందే లేచి వాటిని చూడనిదే ఆమె రోజువారీ పనులు ప్రారంభం కావు. ఆ ఇంటి ఆవరణలో అడుగుపెట్టగానేే.. ఏదైనా నర్సరీలో ఉన్నామా.. నందనవనమా అన్న అనుభూతి కలుగుతుంది. ఎటుచూసినా వివిధ రకాల పూలమొక్కలు, క్రోట
36 రకాల మొక్కలు..
యాపిల్, బత్తాయి, కమలా, డ్రాగన్ ఫ్రూట్, రామఫలక్కాయ, ఆవకాడ, పనస తదితర 36 రకాల చెట్లను పెంచుతున్నారు. ఇవికాక క్రోటన్ జాతికి చెందిన పీస్లిల్లీ, జడ్ప్లాంట్, స్నేక్ప్లాంట్ వంటి ఆక్సిజన్ మొక్కలు, మనీప్లాంటులో నాలుగురకాలు, సంక్లెంట్ తదితర క్రోటన్ జాతులు వీరివద్ద ఉన్నాయి. వంకాయ, టమాటా, చిక్కుడు, దొండ తదితర ఎనిమిది రకాల కూరగాయలు కుండీల్లోను, ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు.
కాకినాడలోని కృష్ణానగర్లో నివాసముంటున్న జలవనరులశాఖ విశ్రాంత అధికారి కె.మురళీగోపాలకృష్ణ, రాధ దంపతులు 15 ఏళ్లుగా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. చదివింది తక్కువే అయినా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ భర్త సహకారంతో ఆమె ఇంట్లో పనికిరాని నీటి సీసాలు, టర్కీ టవల్స్, వినియోగించిన బూట్లు, టైర్లు, పైపులు.. ఒకటేమిటి.. ఏ వస్తువునైనా తన చేతి మహిమతో ఇట్టే ఓ చక్కని ఆకృతిగా మలచగల మేటి మహిళ ఆమె. స్వయంగా సిమెంటుతో ఆకర్షణీయ డిజైన్తో కుండీలను తయారు చేసి వాటిలో మొక్కలు పెంచుతున్నారు. చిన్నచిన్న కుండీలను తయారుచేసి వాటిపై వివిధ డిజైన్లు వేస్తున్నారు.
మొక్కలతోనే దినచర్య..
మొక్కల సంరక్షణతోనే నా దినచర్య ప్రారంభమవుతుంది. ఖాళీగా ఉన్న సమయంలో భర్త సహకారంతో పాత వాటర్బాటిళ్లు, షూలను వివిధ రంగులతో అలంకరించి వాటిలో క్రోటన్ మొక్కలను పెంచుతున్నా. కడియం ప్రాంతంలోని నర్సరీల నుంచి ఈ మొక్కలు తెస్తున్నాం. కొన్నిరకాల క్రోటన్ మొక్కలను ఆన్లైన్లో చూసి తెప్పిస్తున్నా. ఇటీవల కార్పొరేషన్ సిబ్బంది ఇంటి ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్టుకొమ్మను తొలగిస్తున్న సమయంలో చాలా బాధ అనిపించింది. తప్పనిసరి పరిసితుల్లో తొలగించిన ఆ కొమ్మ స్థానంలో ఓ కుండీ పెట్టి ‘నువ్వు నన్ను కాపాడు.. నేను నిన్ను కాపాడుతా’ అంటూ పెయింట్తో రాశాను. ఇది చూసినవారు వేరే ఎక్కడైనా కొమ్మలు తొలగించినప్పుడు ఆలోచిస్తారనే చిన్న నమ్మకం. -ఎ.రాధ, కాకినాడ
డబ్బాలకు రంగులద్ధి.
పాలిథిన్ సీసాలను కత్తిరించి పొద్దుతిరుగుడు పువ్వు ఆకారంలో మలిచి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.