ప్రతిభ పోటీలతో ఉన్నతస్థాయిలో రాణింపు
పాఠశాల దశ నుంచే పోటీ పరీక్షల్లో పాల్గొనటం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించేందుకు దోహదపడుతుందని తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం అన్నారు.
శ్రీసత్యసాయి గురుకులం పాఠశాలలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
శ్యామలాసెంటర్, ధవళేశ్వరం(రాజమహేంద్రవరం), న్యూస్టుడే: పాఠశాల దశ నుంచే పోటీ పరీక్షల్లో పాల్గొనటం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించేందుకు దోహదపడుతుందని తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీసత్యసాయి గురుకులం పాఠశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాస్థాయి ప్రతిభా పాటవ పోటీలు సోమవారం జరిగాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, మండపేట, కొవ్వూరు ప్రాంతాల్లో విజేతలుగా నిలిచిన 8, 9, 10 తరగతులకు చెందిన 72 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరికి వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, చిట్టి కథలు అంశాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈఓ ఎస్.అబ్రహం మాట్లాడుతూ తాను చదువుకున్న రోజుల్లో వ్యాసరచన, క్విజ్ వంటి పోటీల్లో పాల్గొనటం వల్లే ఈ స్థాయికి చేరానన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు అనేక అవకాశాలున్నాయని, ముఖ్యంగా ఆన్లైన్ వేదికగా జరిగే పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో పిల్లలకు ఇటువంటి పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ‘ఈనాడు’ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను శ్రీ సత్యసాయి గురుకులం పాఠశాల కరస్పాండెంట్ ఎ.శ్యాంసుందర్ కొనియాడారు. ప్రిన్సిపల్ కె.గుర్రయ్య మాట్లాడుతూ విద్యార్థికి కేవలం చదువు ఒక్కటే ముఖ్యం కాదని, ఇటువంటి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని సూచించారు. కార్యక్రమంలో ‘ఈనాడు’ రాజమహేంద్రవరం యూనిట్ ఇన్ఛార్జి టి.వి.చంద్రశేఖర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘ఈనాడు’ తరఫున అందించిన బహుమతులు, ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథులు డీఈఓ ఎస్.అబ్రహం, శ్రీ సత్యసాయి గురుకులం పాఠశాల కరస్పాండెంట్ ఎ.శ్యాంసుందర్, ప్రిన్సిపల్ కె.గుర్రయ్య చేతులుమీదుగా విజేతలకు అందజేశారు. ఈమని సత్యనారాయణ, డాక్టర్ వి.రమాదేవి, కడలి.ఎస్.ఆర్.రాజేశ్వరి, తులసీరావు, మోటూరి శ్రీనివాసరావు, పి.పి.ఎస్.జె.శాస్త్రి పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఉమ్మడి జిల్లాస్థాయి విజేతలు వీరే
క్విజ్: ఆర్.జయంత్(భాష్యం ఆంగ్ల మాధ్యమ పాఠశాల, కాకినాడ), కె.తేజశ్రీ(ప్రగతి ఆంగ్ల మాధ్యమ పాఠశాల, రాజమహేంద్రవరం), ఎం.యశ్వంత్(సర్.సి.వి.రామన్
పాఠశాల, అమలాపురం).
చిట్టి కథలు: కె.భువన(శశి ఆంగ్ల మాధ్యమ పాఠశాల, మండపేట), ఎం.సాయి శరణ్య (భాష్యం ఆంగ్ల మాధ్యమం పాఠశాల, రాజమహేంద్రవరం), ఎ.అఖిల(విద్యానిధి పాఠశాల, అమలాపురం).
వ్యాసరచన: బి.ఎల్.వినమ్రత(లయోల పాఠశాల, తుని), మంచిగంటి శాలిని(హోలి ఏంజిల్స్ పాఠశాల, కొవ్వూరు), ఎం.సమన్విత (ప్రగతి పాఠశాల, రాజమహేంద్రవరం).
చిత్రలేఖనం: ఆర్.పాప(జిల్లా పరిషత్ పాఠశాల, తుని), పి.వైష్ణవి(సురేష్ పాఠశాల, కాకినాడ), కె.సత్య చంద్రిక (నారాయణ పాఠశాల, తుని)లు మొదటి మూడుస్థానాల్లో నిలిచారు.
21 వేల మంది విద్యార్థుల భాగస్వామ్యం
కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు
విద్యార్థుల్లో సృజన, సామర్థ్యాలను వెలికితీసేందుకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నాలుగు నెలలపాటు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, చిట్టి కథలు, క్విజ్, చిత్రలేఖనం పోటీల నిర్వహణకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, మండపేట, కొవ్వూరు కేంద్రాల పరిధిలో 10 పాఠశాలలు చొప్పున ఎంపిక చేశారు. మొదటి దశలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలల్లో నెలకు ఒక అంశం చొప్పున పోటీలు నిర్వహించారు. పాఠశాల స్థాయిలో సుమారు 21 వేలమందికిపైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ద్వితీయ దశలో ప్రాంతీయ స్థాయిలో ఫిబ్రవరిలో నిర్వహించిన పోటీల్లో 120 మంది పాల్గొన్నారు. ప్రాంతీయ స్థాయి విజేతలుగా నిలిచిన 72 మందికి ఆఖరిగా మూడో దశలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. వీరిలో 12 మంది విజేతలుగా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
[ 10-05-2024]
కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు. -
ప్రశ్నిస్తే దాడి.. పోరాడితే కేసు
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. -
అప్పుల ఆంధ్రాగా మార్చేశారు
[ 10-05-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
అయిదేళ్లలో రైతులను నిండా ముంచారు!
[ 10-05-2024]
ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. -
అన్నంపెట్టినా.. కడుపు మంటేనా!
[ 10-05-2024]
హాట్ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి. -
జగన్ ఏలుబడి.. పర్యాటకం చతికిలపడి..!
[ 10-05-2024]
‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 10-05-2024]
రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రుద్రరాజు
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఆహ్లాదానికి రుసుం.. అడిగితే అభివృద్ధి జపం
[ 10-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి. -
ఓట్లకు ‘సామాజిక’ గాలం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్ముకోం!
[ 10-05-2024]
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
[ 10-05-2024]
ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. -
అటు ఎన్నికలు.. ఇటు సెలవులు
[ 10-05-2024]
ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్ రిజర్వేషన్ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!