logo

ఆదర్శనీయుడు ఎన్టీఆర్‌

తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్‌ అని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మోరంపూడి బీవీఆర్‌ కల్యాణ మండపంలో ఆదివారం ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Published : 29 May 2023 05:00 IST

కేకు కోస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత

టి.నగర్‌: తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్‌ అని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మోరంపూడి బీవీఆర్‌ కల్యాణ మండపంలో ఆదివారం ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పేదల సంక్షేమం కోసం పార్టీ స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ చంద్రబాబు అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీని గెలిపించుకోవాలన్నారు. అనంతరం కేక్‌ కోశారు. పరిటాల శ్రీరామ్‌, తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని