జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
చేతికి అందేంత ఎత్తులోనే హెచ్టీ పాశాలు
ఇంటి ముందున్న హెచ్టీ తీగలు (అంతరచిత్రం) మృతుడు బులివీర్రాజు
సామర్లకోట, న్యూస్టుడే: జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటి ముందు స్తంభాలు, తీగలు ఏర్పాటుచేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట రాగంపేటరోడ్డులోని ఈటీసీ లేఅవుట్లో నిర్మించిన జగనన్నకాలనీలోని ఓ ఇంటికి పెయింట్లు వేసేందుకు తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన ముప్పిడి బులివీర్రాజు (31) తన మేనల్లుళ్లు పవన్, మనోజ్తో బుధవారం వచ్చారు. మేడపై పిట్టగోడకు రంగులు వేసేందుకు అక్కడే ఉన్న ఇనుప రేకులను మరోచోట పెట్టాలని బులివీర్రాజు వాటిని పైకి ఎత్తడంతో ఇంటికి సమీపంలోనే ఉన్న 11 కేవీ తీగలకు తగిలి విద్యుదాఘాతంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య కీర్తన, ఏడాదిన్నర వయసున్న కుమార్తె మేన్సీ ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇళ్లకు దూరంగా ఉండాల్సిన విద్యుత్తు తీగలను నిబంధనలకు విరుద్ధంగా అతి దగ్గరలోనే ఏర్పాటుచేయడంతో ప్రమాదం జరిగిందని బంధువులు విలపిస్తూ చెప్పారు.
సీఎం ప్రారంభిస్తారని హడావుడి పనులు..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ కాలనీని గత ఏడాది అక్టోబరు 12న ప్రారంభించారు. దీనికి ముందు అధికారులు హడావుడిగా పనులు పూర్తి చేయించారు. ఇళ్లు ప్రారంభించిన అయిదు నెలల్లోనే విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ కార్మికుడు మృతిచెందడం గమనార్హం. ప్రస్తుతం కొందరు లబ్ధిదారులు కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. కాలనీకి విద్యుత్ సరఫరా నిమిత్తం సమీపంలోనే సబ్స్టేషన్ నిర్మించి ఇళ్ల ముందు నుంచే 11 కేవీ తీగలు వేశారు. నిబంధనల ప్రకారం ఇంటికి తీగలు కనీసం అయిదడుగుల దూరంలో ఉండాలి. ప్రమాదం జరిగిన ఇంటికి రెండు వైపులా మూడు, రెండడుగుల దూరంలోనే మృత్యుపాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావడంతో హడావుడిగా పనులు పూర్తిచేయించిన అధికారులు పెయింటింగ్ కార్మికుడి మృతికి కారకులయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం