అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది.
అభ్యర్థిగా శివకృష్ణంరాజును ప్రకటించిన భాజపా
21 స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఖరారు
శివకృష్ణంరాజు
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, బిక్కవోలు: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో కూటమి తరఫున మొత్తం 21 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన ఈయన శివకృష్ణంరాజు ఆర్మీలో ఉద్యోగిగా దేశానికి సేవలు అందించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో 2020లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. రెండేళ్లుగా భాజపా నియోజకవర్గం కన్వీనర్గా కొనసాగుతున్నారు. ఈయన తండ్రి మూడు దశాబ్దాలుగా భాజపాలో కొనసాగుతూ పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించారు.
పొత్తు నేపథ్యంలో..
అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి(తెదేపా) బరిలో ఉంటారని ఆ పార్టీ అధిష్ఠానం విడుదల చేసిన తొలి జాబితాలోనే ప్రకటించింది. ఆ తరువాత భాజపాతో పొత్తు కుదిరిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిచోట్ల మార్పులతో అనపర్తి స్థానాన్ని భాజపాకు ఇవాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ శ్రేణులు నల్లమిల్లికి టికెట్ ఇవ్వాలని కోరుతూ వివిధ రూపాల్లో నిరసన తెలిపాయి. రెండు రోజుల క్రితం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి అనపర్తి స్థానాన్ని తెదేపాకే కేటాయించాలని కోరారు. ప్రస్తుత మార్పులు నేపథ్యంలో రామకృష్ణారెడ్డి పార్టీ క్యాడర్తో గురువారం సమవేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నియోజకవర్గం: అనపర్తి పార్టీ: భాజపా
పేరు: మునగపాటి శివరామకృష్ణంరాజు
పుట్టిన తేదీ: 22071986
విద్యార్హత: బి.ఎ., బి.ఎల్. ఫైనల్ సంవత్సరం
వృత్తి నేపథ్యం: మిలటరీలో 2004 డిసెంబర్లో చేరిన ఈయన ఇంటెలిజెన్సు విభాగంలో వివిధ హోదాల్లో తొమ్మిది రాష్ట్రాల పరిధిలో సేవలందించారు. హవల్దారుగా ఉద్యోగ విరమణ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా