గుర్తుల గందరగోళం
జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు సైతం కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇతర పార్టీల అభ్యర్థులకూ గాజుగ్లాసు కేటాయింపుపై చర్చ
జగ్గంపేట, న్యూస్టుడే: జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు సైతం కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ ఎంపీ, ఆరు ఎమ్మెల్యే స్థానాల్లో (పిఠాపురం, కాకినాడ గ్రామీణం, నిడదవోలు, రాజానగరం, పి.గన్నవరం, రాజోలు) జనసేన పార్టీ అభ్యర్థులు కూటమి నుంచి బరిలో నిల్చున్నారు. వారు పోటీలో లేని పలు నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులకు ఇదే గుర్తును కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో జనసేన కాకుండా ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఒక ఎంపీ అభ్యర్థి ఇదే గుర్తుపై పోటీ చేయనున్నారు.
ఈ నియోజకవర్గాల్లో ..: కోనసీమ జిల్లా రామచంద్రపురం- జై శ్రీసూర్యేంద్రనాథ్ బాబుజీ (స్వతంత్ర), మండపేట- మార్ని సత్యనారాయణ (స్వతంత్ర), కొత్తపేట- బొచ్చా శ్రీనివాస్రావు (స్వతంత్ర)కు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం- దువ్వాడ కన్నయ్య (స్వతంత్ర), జగ్గంపేట- పాటంశెట్టి సూర్యచంద్ర (స్వతంత్ర), తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు- కొయ్యే శేఖరబాబు (స్వతంత్ర), రాజమహేంద్రవరం నగరం ఎమ్మెల్యేగా, తూర్పుగోదావరి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మేడా శ్రీనివాస్ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్) గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. కాకినాడ నగర నియోజకవర్గంలో ఒకరికి కేటాయించినట్లు తెలుస్తోంది. స్పష్టత రావాలి.
ఏరికోరి అడిగారు..
జగ్గంపేటలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత 14 మంది పోటీలో నిలిచారు. అందులో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గాజుగ్లాసు గుర్తు కావాలని కోరారు. ఎన్నికల రిట్నరింగ్ అధికారి ఎం.శ్రీనివాసరావు సమక్షంలో లాటరీ తీయగా పాటంశెట్టి సూర్యచంద్రను ఆ గుర్తు వరించింది. ఈయన ఇదే నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జిగా పనిచేశారు. సీటు రాకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
[ 21-05-2024]
అన్నవరం రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. -
లాకులు.. లీకులు
[ 21-05-2024]
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. -
మేల్కోకుంటే.. ముప్పే!
[ 21-05-2024]
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి
[ 21-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. -
రెండవ ప్లాట్ఫామ్ మూసివేత
[ 21-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాల(ట్రాక్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. -
కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 21-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. -
కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం
[ 21-05-2024]
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...
[ 21-05-2024]
కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్బాబు అన్నారు -
వస్తోంది.. ఆహార భద్రత రథం
[ 21-05-2024]
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది -
రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు
[ 21-05-2024]
అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. -
పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
[ 21-05-2024]
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. -
ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
[ 21-05-2024]
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.